వ్యాపారి అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు.
పరకాల, న్యూస్టుడే: హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన వ్యాపారి వలిపిరెడ్డి మధుసూదన్ను అపహరించిన కేసులో మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసినట్లు, ఒకరు పరారీలో ఉన్నట్లు సీఐ రవిరాజు తెలిపారు. వివరాలివి.. మధుసూదన్ తన ఇంటి ఎదురుగా ఉన్న చెనుమల్ల సమ్మయ్య వద్ద వ్యాపార అవసరాల కోసం వివిధ సందర్భాల్లో రూ.10 లక్షల అప్పు తీసుకొని ప్రామిసరీ నోటు రాసి ఇచ్చారు. మధుసూదన్ అసలు, వడ్డీ చెల్లించకుండా మధుసూదన్ కాలయాపన చేస్తుండడంతో సమ్మయ్య పరకాలకు చెందిన రిపోర్టర్ కానుగంటి కరుణాకర్ను సంప్రదించారు. డబ్బులు ఇప్పిస్తే కరుణాకర్కు రూ.50 వేలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు గత నెల 22న కరుణాకర్.. పరకాలకు చెందిన మేకల దిలీప్, బొచ్చు రమేష్, దండ్రె వెంకటేష్లతో కలిసి మధుసూదన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. చౌట్పర్తి శివారులోని గుట్టల వద్దకు తీసుకెళ్లి రూ.28 లక్షలు బాకీ ఉన్నట్లు ప్రామిసరీ పత్రంపై సంతకాలు చేయించుకున్నారు. రెండు గంటల అనంతరం అంబేడ్కర్ కూడలిలో మధుసూదన్ను వదిలిపెట్టారు. దీనిపై మధుసూదన్ భార్య సుగుణ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. దిలీప్, రమేష్, వెంకటేశ్, కరుణాకర్లతో పాటు చెనుమల్ల సమ్మయ్య, ఆయన కుమారుడు అనీల్పై కేసు నమోదవ్వగా వెంకటేష్ మినహా మిగతా ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వారి వద్ద కారుతో పాటు ప్రామిసరీ పత్రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
పోక్సో కేసులో న్యాయవాదికి జైలు
నెహ్రూసెంటర్, న్యూస్టుడే : బాలికపై అత్యాచారానికి పాల్పడిన న్యాయవాదికి అయిదు సంవత్సరాల మూడు నెలల జైలు, రూ.11 వేల జరిమానా చెల్లించాలని శిక్ష విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ మంగళవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి హెచ్. నవీన్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. 2023 అక్టోబర్ 3వ తేదీన డోర్నకల్కు చెందిన న్యాయవాది తేజావత్ రమేష్ బాలిక(14)పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లి అక్టోబర్ 4న డోర్నకల్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. సీఐ ఉపేందర్ రావు పర్యవేక్షణలో అప్పటి ఎస్సై ఝాన్సీ కేసు నమోదు చేశారు. డీఎస్పీ తీర్థాల సత్యనారాయణ 2023, నవంబర్ 6న కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. డీఎస్పీ తిరుపతిరావు పర్యవేక్షించగా సీఐ ఉపేందర్ రావు ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారి 11 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. పీపీ కీసర పద్మాకర్రెడ్డి వాదనలు వినిపించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.చంద్రశేఖర ప్రసాద్ కేసు పూర్వాపరాలు పరిశీలించి న్యాయవాది రమేష్కు పైవిధంగా శిక్షవిధిస్తూ తీర్పునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీళ్లు మారరు వసూళ్ల పర్వం ఆపరు!
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్లోని అనేక మండలాల పరిధిలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వంలో మునిగితేలుతున్నారు. ప్రజలు వీరికి ఆమ్యామ్యాలు చెల్లించలేక చివరకు అవినీతి నిరోధక శాఖ (అనిశా)ను ఆశ్రయిస్తున్నారు. -
ఆరోపణలు.. విచారణలు!
[ 21-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం 14వ ఉప కులపతిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించిన సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. -
స్థిరాస్తి వ్యాపారానికి ఛార్జీల పెంపు గుబులు
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషను ఛార్జీల పెంపుపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో భూమి విలువ పెంచితే అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. -
సోదరులను బలిగొన్న రోడ్డు ప్రమాదం
[ 21-05-2024]
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. -
900 గ్రాముల మత్తు మందు పట్టివేత
[ 21-05-2024]
హశిష్ (గంజాయి ఆకులతో తయారు చేసినది) మత్తుమందు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
పనులు త్వరగా పూర్తి చేయండి
[ 21-05-2024]
నగరానికి ముంపు తప్పాలంటే వరదనీరు సాఫీగా వెళ్లేలా చూడాలని, నాలాల్లో పూడికతీత పనులు తొందరగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులు, గుత్తేదారులకు సూచించారు. -
విద్యావంతున్ని గెలిపించండి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు భారాస వైపు, నయవంచకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ప్రభుత్వ ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. -
జాడలేని వేసవి క్రీడా శిబిరాలు..!
[ 21-05-2024]
సెలవుల్లో చిన్నారులను క్రీడల వైపు మళ్లించడానికి తల్లిదండ్రులు తొలి ప్రయత్నంగా వేసవి శిబిరాలను ఎంచుకుంటారు. సంవత్సరం పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థుల్లో క్రీడాశిబిరాలు నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. -
ఆటోడ్రైవర్లకు సీఎన్జీ కష్టాలు
[ 21-05-2024]
పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో సీఎన్జీ, విద్యుత్తు వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సీఎన్జీ కిలో ధర.. లీటరు పెట్రోల్ ధరకంటే రూ.17 తక్కువగా ఉండటం, మైలేజీ ఎక్కువగా రావడం వల్ల ఆటోడ్రైవర్లు ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. -
ఖాళీ స్థలాలు.. సమస్యలకు నిలయాలు
[ 21-05-2024]
జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురికి నీటితో కుంటలుగా మారి, కంపు కొడుతున్నాయి. యజమానుల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. -
నిధులున్నా.. నీరుగారిన నిర్వహణ
[ 21-05-2024]
జిల్లాకు సాగునీరందే ఏకైక సాగునీటి కాలువ ఎస్సారెస్పీ డీబీఎం 38.. రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, గణపురం మండలాల మీదుగా ఉప కాల్వలు ఉన్నాయి. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సన్నద్ధం
[ 21-05-2024]
జిల్లాలో ఇంకా ఎన్నికల వాతావరణం కొనసాగుతూనే ఉంది. వారం రోజుల కిందట లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణకు సందడి ప్రారంభమైంది. -
ఉపాధి కూలీలకు సౌకర్యాలు తప్పనిసరి
[ 21-05-2024]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచే విధంగా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ
-
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
-
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల
-
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
-
ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్ భగవత్
-
చైనాలో ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్స్.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?