ఓటేయడానికైనా ఎలా రావాలి...!
తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు
రైలు జనరల్ బోగీల సంఖ్యను పెంచితే మేలు
అభ్యర్థులూ ఈ సమస్య పరిష్కారం మీ చేతుల్లోనే..
జనరల్ బోగీలో కిక్కిరిసిన జనం
తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు. సంకలో పిల్లను సీటు కిందకు తోసి, మరో సీటు కిందకు తల్లి దూరుతుంది. పండు ముసలి లోనికి ఎక్కిందో లేదో, ఎక్కినా ఆ జనంలో ఎక్కడ ఉందో తెలియదు. అయినా ప్రయాణం చేయాలి, గమ్యం చేరాలి..
‘‘ఉపాధిని వెతక్కుంటూ దూర ప్రాంతాలకు వెళ్లిన ఉమ్మడి వరంగల్వాసులు వచ్చే నెల 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి రావాలంటే ఈ జనరల్ బోగీలను ఆశ్రయించాల్సిందే. కాలు పెట్టే పరిస్థితి లేకపోతే ఎలా రావాలని మదనపడడుతున్నారు.’
దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్ల జనరల్ బోగీలలో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. మరుగుదొడ్డిలో కూర్చుని.. దాని తలుపు వద్ద తల వాల్చి, ఒక కాలుపై నిలబడి కష్టంగా సాగిపోతున్నారు. లోపల స్థలం లేక తలుపు వద్ద కూర్చుని ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మరణించిన వారు ఎందరో. అయినా రైల్వే కరుణించదు. అవే మూడు బోగీలలో ప్రయాణం చేయాల్సిందే.. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతి రైలులో ఐదు అంతకంటే ఎక్కువ సాధారణ బోగీలు ఉండేలా కృషి చేయాలని. ఈ అంశాన్ని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరుచుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. ఎంపీ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంపై ఆమేరకు ఒత్తిడి తేస్తామని హామీ ఇవ్వాలని.. గెలిచాక ఆ దిశగా పార్లమెంటులో గళమెత్తాలని కోరుతున్నారు.
-న్యూస్టుడే, కాజీపేట
ఐదు బోగీల కోసం ఉద్యమం..
ఒకప్పుడు జనాభాకు అనుగుణంగా ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకు ముందు రెండు, వెనక రెండు సాధారణ బోగీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగింది. జనరల్ బోగీలను మాత్రం ఇంకా తగ్గించారు. కొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కేవలం మూడు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఎక్స్ప్రెస్ రైలులో ఐదు జనరల్ బోగీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్తో హనుమకొండకు చెందిన డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఉద్యమం చేపట్టారు. ప్రధానమంత్రికి కోటి ఉత్తరాలు రాయాలని ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్, ఇన్స్టాగ్రాం గ్రూపులను ఏర్పాటు చేసి ప్రతి రోజు జనరల్ బోగీలలో ప్రయాణం చేసే వారి నుంచి వివరాలు సేకరిస్తూ, ఫొటోలు తీస్తూ రైల్వే ఉన్నతాధికారులకు వినతులు సమర్పిస్తున్నారు.
చేతిలో బిడ్డ, గర్భస్థ శిశువు మరణించారు.. - పరికిపండ్ల అశోక్
కోణార్క్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేస్తుండగా నిండు గర్భిణి తన కుమార్తెతో కలిసి కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కడానికి ప్రయత్నించి కింద పడి గాయపడ్డారు. తలకు తీవ్రగాయం కావడంతో ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా మరణించింది. ఈ సంఘటన నన్ను కలచివేసింది. అందుకే రైళ్లలో జనరల్ బోగీలు పెంచాలని ఉద్యమం ప్రారంభించాను.
మా ప్రభుత్వంలో ఇది సులువు
- భాజపా అభ్యర్థి అరూరి రమేష్
కేంద్రంలో వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి ప్రయాణికుల కష్టాలను తీర్చడం నాకు సులువుగా ఉంటుంది.టికెట్ల జారీకి అనుగుణంగా రైళ్లలో జనరల్ బోగీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధిస్తాను.
పార్లమెంటులో గళమెత్తుతా
- కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య
గెలవగానే ముందుగా రైల్వే సమస్యలపైనే గళమెత్తుతా. ప్రయాణికుల కష్టాలను వినిపించి రైళ్ల సంఖ్య, దూర ప్రాంత రైళ్లలో జనరల్ బోగీలను పెంపు కోసం కృషి చేస్తాను.
ప్రయాణం ప్రజల హక్కు
- భారాస అభ్యర్థి సుధీర్కుమార్
టికెట్ కొన్న ప్రతి ప్రయాణికుడికి సుఖమయమైన ప్రయాణం రైల్వే కల్పించాలి. ఇలా చేయని పక్షంలో విఫలమైనట్లే... లోక్సభలో జనరల్ బోగీల మీద గళమెత్తుతాను.
జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు రైల్వే శాఖను కోరుతున్నారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా అవే ఉంటున్నాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
ఫిర్యాదులకు : రైల్వే ఉచిత సహాయవాణి నెంబరు 139,
ట్విటర్ ఎక్స్ ఖాతాలు: Indian railways,south central railway, DRM secundrabad division, DRM vijayawada.ఇప్పటి వరకు ఇటీవల హసన్పర్తి, ఉప్పల్, పెండ్యాల రైల్వే స్టేషన్ల మధ్య 15 రోజుల వ్యవధిలోనే నలుగురు ప్రయాణికులు తలుపుల వద్ద ఫుట్బోర్డుపై కూర్చొని ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మరణించారు. ఎందరో దివ్యాంగులుగా మారారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుషారుగా.. చుట్టొద్దామా...!
[ 17-05-2024]
ఉమ్మడి వరంగల్.. సాంస్కృతిక రాజధాని. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈసారి వేసవిలో ఎండలు మండుతున్నా పర్యాటకులు ఓరుగల్లుకు వరుస కడుతున్నారు. -
ఎన్నికల పుణ్యం.. బడి బాగుకు మార్గం
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటులో భాగంగా వాటిలో మౌలిక వసతులు కల్పించారు.. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన పనులు చేపట్టారు. -
ఓరుగల్లు.. జలమయం!
[ 17-05-2024]
భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. -
యాదాద్రీశుడి సేవలో మాజీ మంత్రి హరీశ్రావు
[ 17-05-2024]
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం ఉదయం సందర్శించారు. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో..?
[ 17-05-2024]
సింగరేణి సంస్థ గడిచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు.. ‘ఎల్లో అలర్ట్’
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా కురిసింది. -
‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’
[ 17-05-2024]
ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. -
ముంపు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు
[ 17-05-2024]
గోదావరి వరదతో ముంపునకు గురయ్యే ప్రదేశాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ‘ప్రమాదం పొంచి ఉంది.. -
రైతులను మోసం చేస్తే సహించం
[ 17-05-2024]
రైతులను మోసం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువులు, -
విధుల్లో నిర్లక్ష్యం సరికాదు..
[ 17-05-2024]
ఈ నెల 20 నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులన్నింటిని పూర్తి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య పేర్కొన్నారు. -
రక్తపోటు గుండెకు చేటు..!
[ 17-05-2024]
ఏ చిన్న సమస్యతో వైద్యుడి దగ్గరకెళ్లినా.. అడిగే మొదటి ప్రశ్న మీకు బీపీ (రక్తపోటు) ఉందా? కొంచెం కోపంగా మాట్లాడినా అతనికి బీపీ ఉంది అంటారు.. ఇలా అన్ని అనర్థాలకు రక్తపోటు కారణమవుతుంది. -
9,99,501 మంది ఓటుకు దూరం..
[ 17-05-2024]
గత సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు కలిపి 9,99,501 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అంటే 29.78 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. -
కమీషన్ల కక్కుర్తి..!
[ 17-05-2024]
గ్రేటర్ వరంగల్ అక్రమాలకు అడ్డాగా మారింది. కమీషన్లు, పర్సంటేజీల కోసం ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం ఎంతకైనా తెగిస్తున్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
[ 17-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీప అడవిలో మంగళవారం హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ సుజాత కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్