ఈ పసిబిడ్డ.. మట్టిలో పుట్టిన సీత..!
రామాయణంలో సీత మట్టిలో నుంచి పుట్టినట్టు చెబుతారు. పాపాల ఈ కలియుగంలోనూ ఓ ఆడబిడ్డ మట్టిలో నుంచి ఊపిరి పోసుకుంది. నాడు జనకుడికి సంతానం లేకపోతే జానకి వరంగా భూమిలో నుంచి జన్మించింది.
నేనేం పాపం చేశాను.. బతికుండగానే కర్కశంగా భూమిలో పూడ్చారు.. ముక్కుపచ్చలారని నా ముఖం చూస్తే మీకు ముద్దు రాకపోవచ్చు.. ఉసురు తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఆడబిడ్డను మహాలక్ష్మిలా కొలుస్తారని అంటారు.. తల్లి గర్భంలో ఇలాంటి మాటలు విని ఎంతో మురిసిపోయా.. ఆడ బిడ్డగా పుడుతున్నానని పులకించిపోయా..
నన్నెంతో అల్లారుముద్దుగా చూసుకుంటారని ఆనందపడ్డా.. నేనేం నేరం చేశానని బొడ్డు తాడు తీయకుండానే మట్టిలో కలిపేయాలనుకున్నారు.. తల్లి పొత్తిళ్లలో నుంచి లాక్కొచ్చిన ఆ రాకాసి చేతులు ఎవరివి? మానవత్వం ఉన్నవాళ్లు నన్ను బతికించారు.. అమ్మ పాలు తాగాల్సిన నేను ఆసుపత్రిలో ఒంటరి పోరాటం చేస్తున్నా.. మట్టిలో నుంచి పుట్టిన సీతలా నేను అవనిజ అవుతా.. మట్టిలో మాణిక్యమై ఆడపిల్లల గొప్పదనం చాటిచెప్పి సరికొత్త చరిత్ర సృష్టిస్తా!
రామాయణంలో సీత మట్టిలో నుంచి పుట్టినట్టు చెబుతారు. పాపాల ఈ కలియుగంలోనూ ఓ ఆడబిడ్డ మట్టిలో నుంచి ఊపిరి పోసుకుంది. నాడు జనకుడికి సంతానం లేకపోతే జానకి వరంగా భూమిలో నుంచి జన్మించింది. నేడు ఎవరో రాక్షసులై బిడ్డను శాపంగా భావించి మట్టిలో పాతిపెట్టారు. మానవత్వం బతికున్న మనుషుల కంట పడడంతో కొన ఊపిరితో ఆ పసిగుడ్డు బతికింది. ఓ లారీ డ్రైవర్, ఉపాధి కూలీలు, పోలీసులు అంతా చలించిపోయి ఈ కలియుగ అవనిజకు పునర్జన్మ ఇచ్చారు. మృత్యుంజయురాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈనాడు, వరంగల్, న్యూస్టుడే, దామెర
కాపాడింది లారీ డ్రైవర్..
ఈ పసిపాపను ఉదయం 9.05 గంటలకు జాతీయ రహదారి పక్కన మొదటగా చూసింది ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ రాందినయ్. ఆయన చూసి ఉండకపోతే ప్రాణాలు దక్కేవి కాదు. మట్టిలో కాళ్లు కదులుతున్న ఆనవాళ్లు చూసి వెంటనే స్పందించి మట్టి తొలగించి పాపను బయటకు తీశారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి తగిన సమయంలో ఆసుపత్రికి పంపడంతో ఆ నవజాత శిశువు మృత్యుంజయురాలైంది.
కాళ్లు కదులుతుంటే చూశా
- రాందినయ్, ట్యాంకర్ డ్రైవర్
ట్యాంకర్లోకి నీటిని నింపుతున్నాను. ఆ పక్కనే మట్టిలోనుంచి కాళ్లు, చేతులు కదులుతూ ఉండడంతో ఒక్కసారిగా భయపడ్డాను. వెంటనే తేరుకుని మట్టిని తొలగించాను. ఓ ఆడశిశువు కనిపించింది. నా దగ్గర ఉన్న తువ్వాలలో పడుకోబెట్టాను. అక్కడే ఉన్న ఉపాధి హామీ కూలీలను పిలిచాను. వారు, తర్వాత పోలీసులు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారి పక్కనే శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ పసిపాపను చూసిన వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఈ దీనగాథ విన్నవారు ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ రాకాసులు ఎవరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాప ఆరోగ్యం మెరుగవ్వాలని దేవుళ్లకు దండాలు పెట్టారు. ఈ ఘటనపై ఊరుగొండ అంగన్వాడీ టీచర్ విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దామెర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల విచారణ..
ఈ ఘటనకు కారణాలేంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఊరుగొండ, ఒగ్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూ పాపను ఎవరు ఎటు నుంచి తీసుకెళ్లారనే కోణంలో విచారణ ప్రారంభించారు. విచారణాధికారిగా ఉన్న ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ.. కేసు నమోదు చేసుకున్నామని, పాపను కర్కశంగా పాతిపెట్టిన నిందితులు ఎవరనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ పసిపాప ఎనిమిది నెలలకే జన్మించినట్టు వైద్యులు పోలీసులకు తెలిపారు. దీంతో దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాల్లో ఆశా వర్కర్ల ద్వారా గర్భిణుల జాబితా సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు. 8 నెలల గర్భవతులు ఎంత మంది ఉన్నారు? శనివారం ఎన్ని కాన్పులు జరిగాయి? ఆయా పిల్లలు ఎక్కడున్నారో చూసి నిందితులను పట్టుకునే వీలుందని శాయంపేట ఇన్స్పెక్టర్ రంజిత్రావు తెలిపారు.
ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు
పన్నెండేళ్లలోపు పిల్లల్ని పెద్దలు వదిలేసి వెళితే సెక్షన్ 317 కింద వారిపై కేసు నమోదు చేస్తారు. న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తుంది. వదిలేసిన పిల్లలు చనిపోతే మరిన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శిక్షను పెంచుతారు. శనివారం ఊరుగొండ వద్ద జరిగిన ఘటనలో పోలీసులు 317 కింద కేసు నమోదు చేశారు.
ఎంజీఎంలో మెరుగైన చికిత్స
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని పిల్లల వార్డులో వైద్యులు ఆ నవజాత శిశువుకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అత్యవసర విభాగంలో ఇంక్యుబేషన్ బాక్సులో పెట్టి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సరిచూస్తున్నారు. బయట వారెవరూ చూసేందుకు అనుమతించడం లేదు. పాప ఆరోగ్య పరిస్థితి ఏమిటనేది ఆదివారం ఒక స్పష్టత వస్తుందని వైద్యులు వెల్లడించారు.
వద్దనుకుంటే శిశుగృహకు ఇవ్వొచ్చు
- కొలిశెట్టి వసుధ, సీడబ్ల్యూసీ ఛైర్పర్సన్, వరంగల్
తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు వద్దనుకుంటే శిశుగృహకు ఇస్తే తీసుకుంటాం. వారి ఆలనాపాలనా ప్రభుత్వమే చూస్తుంది. పెంచలేని పరిస్థితిలో ఉన్నామని పిల్లలను తెచ్చి ఇచ్చినా స్వీకరిస్తాం. రెండు నెలల వరకు సమయం ఇస్తాం. ఆ లోపు మనసు మార్చుకుంటే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. లేదా శిశుగృహ నిర్వాహకులే బాధ్యత తీసుకుంటారు. ‘కారా’ ద్వారా ఎవరైనా దత్తతకు దరఖాస్తు చేస్తే వారికి అప్పగిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వణికిన నగరం!
[ 18-05-2024]
నగరంలో గురువారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంతో పౌరులు వణికిపోయారు. -
ఉప పోరు.. ప్రచార హోరు
[ 18-05-2024]
మొన్నటి వరకు లోక్సభ ఎన్నికలతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఫలితాలు ఇంకా వెలువడకముందే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందడి మొదలైంది. -
పనులు చేశారా.. పంచుకున్నారా..!
[ 18-05-2024]
బదిలీపై వెళ్లిన ఉన్నతాధికారి పాత తేదీలతో 200 మెజర్మెంటు బుక్కు(ఎంబీ)లపై సంతకాలు చేయించడానికి గల కారణాలేమిటి? అభివృద్ధి పనులు చేశారా? చేయకుండానే ఎంబీ రికార్డు చేశారా? -
జోరు వానతో ఆగమాగం
[ 18-05-2024]
ఆకస్మిక అకాల వర్షాలతో జనగామ పట్టణం జలమయమవుతోంది. నిండు వేసవిలో కురిసిన పెద్ద వానకే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న వర్షాకాలంలో ఎలా ఉంటుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. -
ఎన్నికల వేళ.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం!
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో జనగామ ఆర్టీసీ డిపోకు ఆదాయం పెరిగింది. -
పాఠశాలల అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం తగదు
[ 18-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా గుర్తించిన పాఠశాలల్లోని అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యం తగదని సంబంధిత గుత్తేదారులు, అధికారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. -
స్ట్రాంగ్ రూం వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 18-05-2024]
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం నగర కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఆకస్మికంగా తనిఖీచేశారు. -
దూసుకొస్తున్న లారీ.. ప్రాణాలు హరీ!
[ 18-05-2024]
గోదావరిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మహదేవపూర్, కాళేశ్వరం ప్రాంతాల నుంచి నిత్యం వందలాది ఇసుక లారీలు వివిధ ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. -
అన్నదాత ఆగమాగం
[ 18-05-2024]
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని మండే ఎండలను తట్టుకొని యాసంగి సాగు చేసిన అన్నదాతల ఆశలు నేలవాలిపోయాయి. -
అప్పుడే పల్లెలపై పడ్డారు..!
[ 18-05-2024]
వర్షకాలం సీజన్ ప్రారంభమే కాలేదు.. ఉమ్మడి జిల్లాలో నకిలీ, నాసిరకం విత్తనాల విక్రయాలకు అక్రమార్కులు తెర లేపారు. -
కొత్త ఆసుపత్రిలోకి ఉన్నవి మార్చొచ్చా!
[ 18-05-2024]
వరంగల్ కేంద్ర కారాగార స్థలంలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి ప్రస్తుతం ఉన్న ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్, టీబీ, ప్రాంతీయ నేత్రవైద్యశాల ఆసుపత్రులను మార్చడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తో అధికారులతో సమీక్షించారు. -
గెలిపిస్తే నిరుద్యోగుల గళమవుతా..
[ 18-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భారాస తరఫున పోటీచేస్తున్న తనను గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగల పక్షాన గళమవుతానని అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
[ 18-05-2024]
నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు, లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శబరీష్ హెచ్చరించారు. -
హత్య కేసు ఛేదించిన పోలీసులు
[ 18-05-2024]
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగిన ఓ వివాహిత హత్య కేసును శుక్రవారం పోలీసులు ఛేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM