రైతుల దరి చేరని భూసార పరీక్షలు
దిగుబడి అధికంగా రావాలని రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేయాలి, ఏ ఎరువులు ఎంత వరకు వినియోగించాలో తెలియాలంటే కచ్చితంగా భూసార పరీక్ష చేయాల్సిందే. ప్రస్తుతం రసాయన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి.
సద్వినియోగం చేసుకుంటే ఎంతో మేలు
జనగామ రూరల్, న్యూస్టుడే: దిగుబడి అధికంగా రావాలని రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఏ పంట వేయాలి, ఏ ఎరువులు ఎంత వరకు వినియోగించాలో తెలియాలంటే కచ్చితంగా భూసార పరీక్ష చేయాల్సిందే. ప్రస్తుతం రసాయన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. సాగు ఖర్చు తడిసి మోపడవుతోంది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గాలంటే భూసార పరీక్షలే శరణ్యం. అలాగే పంట దిగుబడి పెరుగాలంటే భూములు సారవంతంగా ఉండాలి. గత నాలుగేళ్లుగా పరీక్షలపై ఎలాంటి పురోగతి లేకపోవడంతో అన్నదాతలు ఎవరికి తోచినట్లు, వారి వారి సౌలభ్యతలను బట్టి ఎరువులను వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని వల్ల పూర్తి స్థాయిలో ఫలితాలను పొందలేక పోతున్నారనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ప్రస్తుత వేసవిలో పంటలకు తాత్కాలిక విరామం ఏర్పడటంతో రైతులు ఇప్పుడు భూసార పరీక్షలు చేయించుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. పరీక్షల నిర్వహణ జిల్లాలో పూర్తిగా నిలిచిపోయిన తీరుపై ‘న్యూస్టుడే’ కథనం.
సాగు ఇలా..
జిల్లాలో సాగుకు అనుకూలమైన 3.90 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 2.20 లక్షలు తరి, 1.70 లక్షల ఎకరాల మెట్ట భూములున్నాయి. వీటిలో రైతులు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, వేరుసెనగ పంటలను పండిస్తున్నారు. గత 7-8 ఏళ్లుగా రైతులు సాగుకు విరామం లేకుండా రెండు పంటలను పండిస్తున్నారు. దీంతో భూములు సారాన్ని కోల్పోతూ నిస్సారమవుతుండటంతో ప్రస్తుత యాసంగి దిగుబడి తగ్గుముఖం పట్టిందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూణ్నాళ్ల ముచ్చటగానే..
సాగు రంగానికి ప్రాధాన్యత కల్పించేందుకు గత రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను క్లస్టర్లుగా విభజించి రైతు వేదికలను నిర్మించింది. వీటిలో అన్నదాతలకు సాగు రంగంలో మెళకువలు నేర్పటం, పంట సాగు విధానంపై అవగాహన కల్పించటం, భూసార పరీక్షలు నిర్వహించేందుకు మినీ కిట్స్ను సైతం ఏర్పాటు చేసింది. ఆరంభంలో ఒకమారు పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ ఏర్పాటు చేసి మిని కిట్స్, అందుకు అవసరమైన రసాయనాలను అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది.
జిల్లాలో మొత్తం రైతులు: 1.81 లక్షల మంది
సాగు భూమి: 3.90 లక్షల ఎకరాలు
నమూనాలు ఇస్తే.. ఫలితాలు అందిస్తాం..
- వినోద్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, జనగామ
భూసార పరీక్షలతో భూమిలో లోపాలు తెలుసుకొని వాటిని రైతులు పూడ్చుకునేందుకు అవకాశముంది. ప్రస్తుతం జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించే సౌకర్యాలు అందుబాటులో లేవు. ఆసక్తి కల్గిన రైతులు భూమిని దున్నక ముందే భూమిలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి సంబంధిత ఏఈవో, ఏవోలకు అందజేయాలి. వాటిని వరంగల్కు తరలించి, అనంతరం వాటి ఫలితాలను అందజేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్