హోరెత్తనున్న ప్రచారం
లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, భాజపా, భారాస తమ పార్టీల అగ్రనేతలతో ఒకటి రెండు దఫాలు వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రచారం చేశాయి.
రేపు వరంగల్లో సీఎం రేవంత్ రోడ్డు షో
8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాక
ఈనాడు, వరంగల్
లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, భాజపా, భారాస తమ పార్టీల అగ్రనేతలతో ఒకటి రెండు దఫాలు వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రచారం చేశాయి. ఇప్పుడు ప్రచారానికి మరో ఆరు రోజులే మిగిలి ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు మరోసారి అగ్రనేతలతో ప్రచారం హోరెత్తించనున్నాయి. వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా 7న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓరుగల్లు నగరంలో రెండు చోట్ల రోడ్డుషోలు, అనంతరం కూడలి సమావేశాల్లో ప్రసంగించనున్నారు. వరంగల్ తూర్పులో సాయంత్రం 6.30 గంటలకు షోలో పాల్గొని తర్వాత కూడలి సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ఆ తర్వాత రాత్రి 7.45 గంటలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గమైన హనుమకొండలో రోడ్డుషోలో పాల్గొన్న తర్వాత కూడలి సమావేశంలో ప్రసంగిస్తారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి వరంగల్ నియోజకవర్గంలో మడికొండ, భూపాలపల్లి సభల్లో పాల్గొన్నారు. మహబూబాబాద్లో ఒక సభలో పాల్గొన్నారు. రేపు నగరంలో మరో దఫా ప్రచారం చేయనున్నారు.
8న సభకు భారీ ఏర్పాట్లు
మే 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్, మహబూబాబాద్ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ తరఫున మామునూరులోని లక్ష్మీపురంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో మామునూరు విమానాశ్రయంలో దిగి నేరుగా సభా స్థలికి చేరుకొని ప్రసంగించనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్లో భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్డు షో జరిగింది. కేంద్ర మంత్రి కిరణ్రిజుజు కూడా మానుకోటకు వచ్చారు. వరంగల్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి భాజపా అభ్యర్థికి మద్దుతుగా రోడ్డు షోలో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రధాని సభకు కమల దళం సిద్ధమైంది.
ఇప్పటికే రెండు చోట్లకు భారాస అధినేత కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓరుగల్లు, మానుకోటల్లో జరిగిన రోడ్డు షోలు, కూడలి సమావేశాల్లో పాల్గొని భారాస అభ్యర్థులు డాక్టర్ సుధీర్కుమార్, మాలోతు కవితల తరఫున ప్రచారం చేశారు. హనుమకొండలో ఏప్రిల్ 28న, మహబూబాబాద్లో మే 1న ఆయన ప్రచారం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్