నాన్నకు భారమై.. అమ్మకు దూరమై!
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
అనాథలైన చిన్నారులు
నాగమణి
యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్టుడే: పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. తల్లిపాలు తాగాలని చిన్నారి, అమ్మ చేతితో గోరుముద్దలు తినాలని బాలుడు మారాం చేస్తుంటే.. అమ్మ అచేతన స్థితిలో.. నాన్న రాలేని స్థితిలో ఉన్నాడని.. అర్థంకాని స్థితిలో ఉన్న ఆ పిల్లలకు ఎలా చెప్పి నచ్చజెప్పాలో తెలియక కుటుంబసభ్యులు, స్థానికులు కంటతడి పెట్టారు. ఈ హృదయ విదారక ఘటన యాదగిరిగుట్టలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ రమేశ్, స్థానికుల కథనం ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బూడిద యాదయ్య, దేవమ్మ దంపతుల చిన్న కూతురు గడిపె నాగమణి(25)ని జనగామ జిల్లా నాగారం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ ప్రవీణ్కు ఇచ్చి 2020లో వివాహం చేశారు. వీరికి వర్ధన్(3), లక్ష్మీ ప్రసన్న(9 నెలల) పిల్లలు కలిగారు. ఆ తర్వాత భర్త వరకట్న వేధింపులు, గృహ హింసకు గురిచేయడం, మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడంతో గొడవలు జరిగాయి. పంచాయితీ పెట్టి నచ్చజెప్పినా భర్తలో మార్పు రాకపోవడంతో ఈ నెల 3న పిల్లలతో కలిసి తల్లిగారి ఇంటికి చేరింది. సోమవారం మధ్యాహ్నం ఆవేశంతో ఆ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. స్థానికులు గమనించి కేకలు వేయడం, అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి హుటాహుటిన బావిలో దూకి, ఆమెను రక్షించి భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వృద్ధులైన యాదయ్య, దేవమ్మలకు ఇద్దరు సంతానం కాగా, పెద్ద కూతురు రేణుక పాముకాటుతో మృతి చెందగా, చిన్నకూతురు ఆత్మహత్య చేసుకుంది.
తల్లి కోసం ఎదురుచూస్తూ.. రోదిస్తున్న చిన్నారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడుల బాగు పనులిక చకచకా..!
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలను కనీస సదుపాయాలతో అన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొద్ది నెలల కిందట అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను (ఏఏపీసీ) ఏర్పాటు చేసింది. -
పట్టభద్రుల ఓటును వృథా కానివ్వను..
[ 19-05-2024]
‘వరంగల్ నల్గొండ ఖమ్మం శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థికి విజయం దక్కలేదు. -
నిరుద్యోగంపై పోరాడే వారికి పట్టం కట్టండి
[ 19-05-2024]
తెలంగాణలో నిరుద్యోగ సమస్యపై శాసన మండలిలో పోరాడే సత్తా, మేధోశక్తి భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డికే ఉందని పార్టీ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి, పూర్వ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ప్రేమేందర్రెడ్డి గెలుపుతోనే సమస్యల పరిష్కారం
[ 19-05-2024]
సుదీర్ఘకాలం భాజపాలో పనిచేస్తున్న స్థానికుడైన గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు -
కేయూ ప్రతిష్ఠకు మరకలు
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగింది. గత ఏడాది విశ్వవిద్యాలయం జాతీయ స్థాయిలో న్యాక్ ఎ ఫ్లస్ ర్యాంకు సాధించడంతో ఆచార్యులు, అధ్యాపకులు, విద్యార్థులు ఎంతో సంతోషించారు -
భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు..!
[ 19-05-2024]
భారాస, కాంగ్రెస్ డీఎన్ఏలు ఒక్కటేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. -
వైభవంగా వసంతోత్సవం
[ 19-05-2024]
శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం నిర్వహించారు. -
కదిలిన అధికార యంత్రాంగం
[ 19-05-2024]
అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై ‘అన్నదాత ఆగమాగం’ అనే శీర్షికతో ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు -
‘ఆదర్శం’ కొంతే.. పోలింగ్ అంతంతే!
[ 19-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. -
గ్రూపు-1 పరీక్షకు 14 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో జూన్ 9న జరగనున్న గ్రూపు-1 ప్రాథమిక పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. -
ఈఏపీ సెట్లో తొమ్మిదో ర్యాంకు
[ 19-05-2024]
తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్-లలిత దంపతుల కుమారుడు కొంతం మణితేజ 141 మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు