logo

‘కడియం, అరూరికి ఓటుతో బుద్ధిచెప్పాలి’

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే కాంగ్రెస్‌ నేతలను ప్రజలు నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మారపల్లి సుధీర్‌కుమార్‌, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలకు సూచించారు.

Published : 08 May 2024 04:21 IST

 మాట్లాడుతున్న భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ చిత్రంలో మాజీ మంత్రి దయాకర్‌రావు, నాయకులు
వర్ధన్నపేట, న్యూస్‌టుడే: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే కాంగ్రెస్‌ నేతలను ప్రజలు నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మారపల్లి సుధీర్‌కుమార్‌, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలకు సూచించారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ఓ వేడుకల మందిరంలో మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీని మోసం చేసి స్వప్రయోజనం కోసం కాంగ్రెస్‌, భాజపాలో చేరిన కడియం, అరూరికి లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌, భాజపాలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్‌ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని దయాకర్‌రావు కార్యకర్తలు, నేతలను కోరారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, స్థానిక భారాస నేతలు పాల్గొన్నారు.

కరీమాబాద్‌: భారాస లోక్‌సభ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ గెలుపు కోరుతూ స్థానిక కార్పొరేటర్‌ మరుపల్ల రవి ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటా ప్రచారం చేపట్టారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని