logo

నిబంధనల మేరకే ఈవీఎంల కమిషనింగ్‌

ఎన్నికల నిబంధనల మేరకు ఈవీఎంల కమిషనింగ్‌ నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల ప్రత్యేక అధికారి నవీన్‌ విద్ది తెలిపారు.

Published : 09 May 2024 02:07 IST

ఎనుమాముల మార్కెట్‌లో అధికారులు

మట్టెవాడ[, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనల మేరకు ఈవీఎంల కమిషనింగ్‌ నిర్వహించినట్లు కేంద్ర ఎన్నికల ప్రత్యేక అధికారి నవీన్‌ విద్ది తెలిపారు. వరంగల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ సంధ్యారాణితో కలిసి ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో నిర్వహిస్తున్న ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. బుధవారం వరంగల్‌ పార్లమెంట్ పరిధిలోని వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, వరంగల్‌ పశ్చిమ, పరకాల అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియ చేపట్టారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఇక్బాల్‌, నాగేశ్వరరావు, విజయసాగర్‌, ఉప తహసీల్దార్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని