చెయ్యెత్తి నినదించూ.. ఓటెత్తి జైకొట్టు
‘ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా మిగిలిపోరాదు’ ఇది ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం, ఆశయం.
‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన కార్యక్రమం
జనగామ, న్యూస్టుడే: ‘ఏ ఒక్క ఓటరు ఓటు వేయకుండా మిగిలిపోరాదు’ ఇది ఎన్నికల సంఘం ప్రధాన లక్ష్యం, ఆశయం. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ‘స్వీప్’ (సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్)పేరిట ప్రత్యేక ప్రచార, అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఈ నేపథ్యంలో అవగాహన సదస్సును మరింత విస్తృతం చేసేందుకు బుధవారం జనగామ జిల్లాలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఓటరు చైతన్యం, అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఉపాధి హామీ కూలీలు, రైతులు, యువకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని నినదించారు.
ఓటు వజ్రాయుధం..
నర్మెట్ట: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉచిత కరాటే శిక్షణ నిర్వహిస్తున్నారు. కోచ్, శిక్షణార్థులతో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో బుధవారం ఓటరు చైతన్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోచ్ ఎర్రవెల్లి బాబు అధ్యక్షత వహించి మండల కేంద్రంలో గ్రామస్థులకు ఓటు చైతన్యంపై అవగాహన కల్పించారు. ఓటు హక్కు వజ్రాయుధమని, నిజాయతీగా ఓటు వేయాలని సూచించారు.
ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలి..
జఫర్గఢ్: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును, ఓటర్లందరు సద్వినియోగం చేసుకోవాలని జఫర్గఢ్ తహసీల్దార్ అంజనేయులు అన్నారు. మండలంలోని ఉప్పుగల్లులో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీలకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సు గ్రామ కార్యదర్శి సమ్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో నాయకులు మద్యం, డబ్బులు, ఇతర ప్రలోభాలకు లోనవకుండా, సేవచేసే నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కూలీలతో ప్రతిజ్ఞ చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకం..
పాలకుర్తి: నియోజకవర్గ కేంద్రంలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన నిర్వహించగా తహసీల్దార్ వెంకటేశం హాజరై మాట్లాడారు. సుమారు 200కు పైగా పాల్గొన్న ఉపాధి కూలీలకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని, వినియోగించుకొని ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఏపీవో మంజుల, ఫీల్డ్ అసిస్టెంట్ కుమార్ పాల్గొన్నారు.
దేశ పాలకులను నిర్ణయిస్తుంది..
జనగామ రూరల్: ఓటు వజ్రాయుధమని, సద్వినియోగం చేసుకొని సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవాలని ఎంపీడీవో సంపత్కుమార్ అన్నారు. ఓటు హక్కు- పౌరుల బాధ్యతపై ‘ఈనాడు’ ఆధ్వర్యంలో శామీర్పేటలో ఉపాధి హామీ కూలీలకు చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో హాజరై మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దేశ పాలకులను నిర్ణయిస్తాయన్నారు. ఈసీ మాధవరెడ్డి, టీఏ అనిల్ పాల్గొన్నారు.
నాకు తొలిసారిగా ఓటు వేసే అవకాశం వచ్చింది. ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ఓటు హక్కును వినియోగించుకుంటా. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, సేవ చేసే నాయకుడికే ఓటు వేస్తాను.
భార్గవ్ రాజు, పాలకుర్తి
విద్యార్థులు, యువత, విద్యావంతులు.. అందరూ ఓటు వేసేలా అవగాహన కల్పించాలి. జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదయ్యేలా అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేలా చూడటం ఇక ఓటర్ల బాధ్యతే.
వినోద్కుమార్, స్వీప్ జిల్లా నోడల్ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.