ఓరుగల్లులో కాషాయోత్సాహం
మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు హోరెత్తాయి. ‘మరోమారు మోదీ సర్కారు’ అంటూ యువత కేరింతలు కొట్టింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వింటూ కమలం శ్రేణులు కొత్త ఉత్సాహంతో జేజేలు పలికాయి.
విజయవంతమైన భాజపా జనసభ
ఈనాడు, వరంగల్, సుబేదారి, మామునూరు, న్యూస్టుడే
మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు హోరెత్తాయి. ‘మరోమారు మోదీ సర్కారు’ అంటూ యువత కేరింతలు కొట్టింది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం వింటూ కమలం శ్రేణులు కొత్త ఉత్సాహంతో జేజేలు పలికాయి.
బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో (ఎడమ నుంచి కుడికి) భాజపా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంత రెడ్డి, ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు, మహబూబాబాద్, వరంగల్ పార్టీ అభ్యర్థులు ప్రొఫెసర్ సీతారాం నాయక్, అరూరి రమేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ.
వరంగల్ మామునూరు విమానాశ్రయం ఎదురుగా లక్ష్మీపురంలో బుధవారం ఓరుగల్లు జనసభ అట్టహాసంగా జరిగింది. వరంగల్, మహబూబాబాద్ భాజపా అభ్యర్థులు అరూరి రమేశ్, అజ్మీరా సీతారాంనాయక్లను గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ‘నమో’ ప్రసంగం కొనసాగింది. వరంగల్ అభివృద్ధిని ప్రస్తావిస్తూ, కాంగ్రెస్, భారాసలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ 47 నిమిషాల పాటు మాట్లాడారు.
తెలుగులో ప్రారంభించి..
‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. తన స్వస్థలమైన అహ్మదాబాద్లో నగర దేవత భద్రకాళి మాత అని, వరంగల్లో భద్రకాళి మాతకు, రామప్ప మందిరానికి నా నమస్కారాలు అంటూ హిందీలో ప్రసంగం కొనసాగించారు.
సభకు హాజరైన జనం
మామునూరులో దిగి..
ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ సభ ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్లో ఓరుగల్లు సభకు మధ్యాహ్నం వచ్చారు. కొద్ది దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి ప్రధాని ప్రత్యేక వాహనాల కాన్వాయ్లో చేరుకున్నారు. అజ్మీరా సీతారాంనాయక్ గిరిజనుల సంప్రదాయ శాలువాను మోదీ మెడలో వేసి సన్మానించారు. అరూరి రమేశ్ శాలువా కప్పి కాకతీయ తోరణం, మోదీ బొమ్మతో కూడిన జ్ఞాపికను అందజేశారు. వరంగల్ అధ్యక్షుడు గంటా రవికుమార్ ప్రధానికి భారీ గద అందజేశారు. వేదికపై ఉన్న నేతలంతా మోదీని సన్మానించారు.
- జనసభకు 1400 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్కిశోర్ ఝా పర్యవేక్షించారు.
- గంటన్నరకు పైగా: ప్రధాని మోదీ వరంగల్లో మొత్తం 1.35 గంటల పాటు ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మామునూరు రన్వేపై దిగారు. 1:35 గంటలకు తిరుగు పయనమయ్యారు.
భాజపా శ్రేణుల్లో జోష్..
ప్రధాని మోదీ సభ విజయవంతం కావడంతో ఓరుగల్లు కమలం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఈ సారి వరంగల్లో పాగా వేయాలని చూస్తున్న కమలం పార్టీకి ఈ సభ కలిసొస్తుందని భావిస్తున్నారు.
స్థానిక అంశాల ప్రస్తావన
ఓరుగల్లు కాకతీయుల సామ్రాజ్య పుణ్యభూమి అని ప్రధాని మోదీ కొనియాడారు. భాజపా ప్రభుత్వం వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ములుగులో సమ్మక్క- సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశామని, వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద జౌళి పార్కు నిర్మించామని, పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నామని ప్రస్తావించారు.
విమానాశ్రయం, కోచ్ ఫ్యాక్టరీ కావాలి
వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్
మూడోసారి ప్రధాని అయ్యాక వరంగల్కు మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులను అందజేయాలి. ప్రజల చిరకాల కోరిక మామునూరు విమానాశ్రయం ఏర్పాటు చేయాలి. కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు. కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇచ్చిన టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేయాలి. వర్షాలు పడితే వరంగల్ నగరం నీట మునగకుండా అండర్ డ్రైనేజీ, భూపాలపల్లిలో రైల్వేలైన్, పాలకుర్తిలో టెక్స్టైల్ పార్కు మంజూరు చేయాలి.
కాంగ్రెస్ దేశానికి శత్రువు
మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు
వరంగల్, మహబూబాబాద్లో విజయం సాధించబోతున్నాం. రూ.9 వేల కోట్లతో ప్రధాన రహదారుల అభివృద్ధి, రూ.108 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టించాం. సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా భాజపా ముందుకు సాగుతుంది.
ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలి
గరికపాటి మోహన్రావు జాతీయ కార్యవర్గ సభ్యులు
మోదీని మరోసారి ప్రధాని చేసేందుకు మహబూబాబాద్, వరంగల్ భాజపా అభ్యర్థులు సీతారాంనాయక్, అరూరి రమేశ్లను గెలిపించాలి.
తెలంగాణ ద్రోహులపాలైంది
మహబూబాబాద్ అభ్యర్థి సీతారాంనాయక్
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ద్రోహుల పాలైంది. మేమే ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని మర్చిపోవాలి. దేశం, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ప్రజలు భాజపాకు మద్దతు తెలపాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.