వంక.. కవురు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక గణాంకాలను బేరీజు వేసుకుని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
పశ్చిమ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు
ప్రకటించిన వైకాపా
భీమవరం పట్టణం, న్యూస్టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. సామాజిక గణాంకాలను బేరీజు వేసుకుని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. బీసీ ఓటుబ్యాంకును దృష్టిలో ఉంచుకుని శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన జిల్లా పరిషత్తు ఛైర్మన్ కవురు శ్రీనివాస్ను, కాపు సామాజిక వర్గానికి చెందిన వంక రవీంద్రనాథ్ పేర్లను ప్రకటించారు. క్షత్రియులకు ఎమ్మెల్సీ దక్కుతుందని భావించారు. అటు స్థానిక సంస్థలు, ఇటు ఎమ్మెల్యేల కోటాలోనూ ఆ వర్గానికి అవకాశం చేజారింది. ప్రస్తుతం వైకాపా ప్రకటించిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను గతంలో తెదేపా కూడా పశ్చిమ ప్రాంతంలోని ఉండి నియోజకవర్గానికి చెందిన పాందువ్వ శ్రీను, పాలకొల్లుకు చెందిన అంగర రామమోహన్కు కేటాయించారు. ఇదే తరహాలో వైకాపా కూడా ఒకటి ఓసీ సామాజిక వర్గానికి, మరొకటి బీసీలకు కేటాయించింది.
ఇంకా దాఖలు కాని నామపత్రాలు
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామపత్రాలు దాఖలు కాలేదు. అభ్యర్థుల నుంచి నామ పత్రాలు స్వీకరించే ప్రక్రియను ఈ నెల 16 నుంచి ప్రారంభించారు. సోమవారం వరకు ఒక్కటి కూడా దాఖలు కాలేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ పి.అరుణ్బాబు తెలిపారు.
జడ్పీ ఛైర్మన్ నుంచి...!
పాలకొల్లు, న్యూస్టుడే: పెనుమంట్ర మండలం పొలమూరు శివారు నాగళ్లదిబ్బకు చెందిన కవురు శ్రీనివాస్ వీరవాసరం మండలం నవుడూరులో కాంపౌండర్గా పనిచేశారు. ఆ మండలంలోని ఉత్తరపాలెం నుంచి ఎంపీటీసీ సభ్యునిగా గెలుపొంది ఎంపీపీగా ఉన్నారు. అనంతరం ఆచంట నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా, రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా, నరసాపురం అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేసి 2019 ఎన్నికల అనంతరం పాలకొల్లు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. డీసీసీబీ ఛైర్మన్గా దాదాపు ఏడాది పైబడి కొనసాగారు. యలమంచిలి జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికై..ప్రస్తుతం జడ్పీ ఛైర్మన్గా కొనసాగుతున్నారు.
తణుకు, న్యూస్టుడే: 2014లో వైకాపాలో చేరి నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వంక రవీంద్రనాథ్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ రాజకీయ పరిశీలకుడిగా ఉన్నారు. రెండేళ్ల కిందట చిన్న పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ బాధ్యతలను ప్రభుత్వం ఇతనికి అప్పగించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంక రవీంద్రనాథ్ పేరును వైకాపా జాబితాలో ఖరారు చేసింది.
ఎమ్మెల్యే కోటాలో జయమంగళ
కైకలూరు, న్యూస్టుడే: ఇటీవల తెదేపాను వీడి వైకాపా తీర్థం పుచ్చుకున్న కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్యే ల కోటాలో బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిగా ఖరారు చేశారు. 1999 నుంచి తెదేపాలో చురుకైన పాత్ర పోషించిన ఈయన ఇటీవల ఆ పార్టీని వీడి వైకాపాలో చేరారు. ఎమ్మెల్యేల సంఖ్యాబలం అధికంగా ఉన్న నేపథ్యంలో జయమంగళ ఎన్నిక లాంఛనం కానుంది. ఈ క్రమంలో సోమవారం జయమంగళ తాడేపల్లిలో సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఘటిత పోరాటాల ఫలితమే కార్మిక చట్టాలు
[ 27-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఏఐటీయూసీ సమావేశం శనివారం జరిగింది. -
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్