విధులకు రాకున్నా వేతనాలు
ఏలూరు నగర పాలక సంస్థలో మరో విచిత్రం వెలుగు చూసింది. ఎవరైనా పనిచేసి జీతం తీసుకుంటారు. ఇక్కడ మాత్రం చాలామంది హాజరు వేసుకుని కథ నడిపిస్తున్నారు.
నగరపాలక సంస్థలోమరో సిత్రం
మామూళ్ల మత్తులోఅధికారుల చోద్యం!
ఈనాడు డిజిటల్, ఏలూరు
ఏలూరు నగర పాలక సంస్థలో మరో విచిత్రం వెలుగు చూసింది. ఎవరైనా పనిచేసి జీతం తీసుకుంటారు. ఇక్కడ మాత్రం చాలామంది హాజరు వేసుకుని కథ నడిపిస్తున్నారు. అంతేకాదు.. వీరు వేరే ఉద్యోగాలూ చేసుకుంటున్నారు. కొందరైతే కాంట్రాక్టులూ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మామూళ్లు తీసుకొని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రజారోగ్య విభాగంలోని ఓ డివిజన్ పరిధిలో పనిచేసే ఇద్దరు అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు అసలు విధులకే హాజరుకారు. వారికి కేటాయించిన ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణతో వారికి పనిలేదు. ఒక్కొక్కరికి రూ.21 వేల జీతం ఠంఛనుగా పడుతుంది. సంబంధిత అధికారికి నెలకు ఇద్దరూ కలిపి రూ.10 వేలు ముట్టజెబుతున్నారు. మరో ఆశ్చర్యం ఏంటంటే వీరిద్దరు నగరంలోని ఓ రెస్టారెంట్లో నెలకు రూ.15 వేల జీతానికి సర్వర్లుగా పనిచేస్తున్నారు. ఇలాంటి సిబ్బంది నగర పాలక సంస్థ పరిధిలో పదుల సంఖ్యలో ఉన్నారు. కొందరు రెస్టారెంట్లలో పని చేస్తుంటే.. మరికొందరు నాయకుల అండతో కాంట్రాక్టులు చేస్తున్నారు.
* పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహించాల్సిన ఓ ఉద్యోగి విధులకు రాకున్నా హాజరు వేసి జీతం జమ చేస్తున్నారు. నాయకుల అండతో ఆర్టీసీలో పార్సిల్ కాంట్రాక్టర్గా మరో మార్గంలో సంపాదించుకుంటున్నారు. విధులకు హాజరు కాకపోవడమే కాకుండా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు చేస్తున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో ఇతను జనన మరణాల విభాగంలో తప్పుడు పత్రాలు సృష్టించిన విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇతను ఈ విభాగంలో కనిపిస్తే క్రిమినల్ కేసు పెడతానని సాక్షాత్తు జేసీ హెచ్చరించారు. అయినా నాయకుల ఆశీస్సులతో ఇప్పటికీ ఆ విభాగాన్ని వదల్లేదు.
అధికారులకు పట్టదు
కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ విభాగాల్లో పని చేసే కిందిస్థాయి సిబ్బంది వెయ్యి మందికిపైనే ఉంటారు. వీరిలో బినామీలను పెట్టుకుని పనులు చేయించేవారు వందకు పైనే ఉన్నారు. దాదాపు 40 మంది అసలు విధులకు హాజరు కారు. వీరి తరఫున బినామీ సిబ్బంది కూడా పనిచేయరు. నగర పరిధిలోని కృష్ణా కెనాల్ పారిశుద్ధ్య పనులు చేసేందుకు 20 మంది సిబ్బందిని కేటాయిస్తే వారిలో నలుగురు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఆయా విభాగాల్లో అధికారులకు ప్రతి నెలా మామూళ్లు అందుతుండటంతో కనీస చర్యలు తీసుకోవడం లేదు.
హమ్మయ్య హాజరు వేశాం
నగర పాలక సంస్థలో చాలా మంది సిబ్బంది విధులకు రావడం లేదు. ప్రతిరోజు ఉదయం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో హాజరు వేసుకుని.. ఆ రోజుకు పనైపోయింది అనుకుంటున్నారు. ఇలా చేసే వారిలో ఎక్కువగా ప్రజారోగ్య, ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగంలో ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిని ఓ పార్కు గార్డెనర్గా నియమించారు. ఆమె చాలా నెలల నుంచి హాజరు వేసుకుని విధులకు రావడం లేదు. జీతం మాత్రం పడిపోతోంది. అధికారులకు ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేసి తాపీగా సొంత పనులు చేసుకుంటున్నారు. దాదాపు అన్ని డివిజన్లలో ఈ తరహా సిబ్బంది ఉన్నారు. వీరంతా అధికారులకు భారీగా ముడుపులు అందిస్తున్నారు. శాశ్వత ఉద్యోగులకు జీతం ఎక్కువ కాబట్టి విధులకు హాజరు కానివారు బినామీలతో పనులు చేయిస్తున్నారు. బినామీలకు రూ.10 వేలు ఇచ్చి వారు మాత్రం వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలు చేసుకుంటున్నారు. అధికారులకు ఒక్కో ఉద్యోగి నెలకు రూ.10 వేల వరకు ఇస్తున్నారని తెలుస్తోంది. అవుట్ సోర్సింగ్ సిబ్బందీ రూ.5 వేలు అందజేస్తున్నారు. ఇందులో ఉన్నతాధికారుల వరకూ వాటాలున్నట్లు సమాచారం.
* ఈ విషయమై నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణను వివరణ కోరగా పారిశుద్ధ్య కార్మికుల హాజరు, పనితీరును తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. హాజరు కాని, బినామీలతో పనులు చేయించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్