logo

జనసేనపార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఘంటసాల

జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

Published : 28 Mar 2024 04:21 IST

వెంకటలక్ష్మికి నియామకపత్రం అందజేస్తున్న పవన్‌కల్యాణ్‌

దెందులూరు (ఏలూరు గ్రామీణ), న్యూస్‌టుడే: జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త ఘంటసాల వెంకటలక్ష్మిని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమెకు బుధవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గుర్తించి పవన్‌ కల్యాణ్‌ ఈ పదవిని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని