logo

నిర్వాసితుల్ని ఆదుకుంటాం

తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నియోజకవర్గాన్ని చిర్రి బాలరాజుతో కలిసి అభివృద్ధి చేస్తామని ఎన్డీయే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ అన్నారు.

Published : 04 May 2024 04:08 IST

బొర్రంపాలెంలో మాట్లాడుతున్న మహేష్‌యాదవ్‌, పక్కన బాలరాజు

టి.నరసాపురం, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నియోజకవర్గాన్ని చిర్రి బాలరాజుతో కలిసి అభివృద్ధి చేస్తామని ఎన్డీయే ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌ అన్నారు. టి.నరసాపురం మండలం సాయంపాలెం, బొర్రంపాలెం, తిరుమలదేవిపేట, టి.నరసాపురం, అప్పలరాజుగూడెం గ్రామాల్లో సుమారు అయిదు వేల మంది కూటమి కార్యకర్తలతో శుక్రవారం సాయంత్రం భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బొర్రంపాలెంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులు అధికంగా సంపాందించారని పేదలు మాత్రం అలాగే ఉండిపోయారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తామన్నారు. పోలవరం నిర్వాసితులను ఆదుకుంటామని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.  కార్యక్రమంలో తెదేపా పోలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొరగం శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శులు శీలం వెంకటేశ్వరరావు, జయవరపు శ్రీరామ్మూర్తి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మండల అధ్యక్షుడు నాయుడు రామకృష్ణ గౌడ్‌, జనసేన మండల అధ్యక్షుడు అడపా నాగరాజు, భాజపా మండల అధ్యక్షుడు మాలెంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని