logo

కూటమి పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి

ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెదేపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఉండి మండలం చెరుకువాడ, అర్తమూరు గ్రామాల్లో తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు,

Published : 05 May 2024 05:39 IST

చెరుకువాడ: గ్రామస్థులు, నాయకులతో రఘురామకృష్ణరాజు

ఉండి, న్యూస్‌టుడే: ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెదేపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఉండి మండలం చెరుకువాడ, అర్తమూరు గ్రామాల్లో తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, గ్రామ అధ్యక్షుడు యిర్రింకి బుజ్జి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు ఆయనకు  హారతులతో స్వాగతం పలికారు. కాలువపేటలో రహదారి సమస్యపై స్థానికులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగు, సాగునీరు, రహదారులు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీఇచ్చారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించిన పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, డీసీˆసీˆబీ మాజీ ఛైర్మన్‌ ముత్యాల వెంకటేశ్వరరావు, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిగ శ్రీనివాస్‌, భాజపా మండల అధ్యక్షుడు యర్రా విక్రమ్‌, జనసేన మండల అధ్యక్షుడు యడవల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ద్విచక్ర వాహనాలపై ప్రదర్శన నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని