ట్రేడింగ్ సంస్థ పేరిట మోసం
లులు ట్రేడింగ్ సంస్థ పేరిట దంపతులు ప్రజలకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ చూపించి వారి నుంచి లక్షల రూపాయలు పెట్టుబడులుగా పెట్టించి.. చివరకు బోర్డు తిప్పేసిన సంఘటన కడప తాలూకా ఠాణా పరిధిలో ఇటీవల చోటు చేసుకుంది. పెట్టుబడి పెట్టిన
ఘటనలో ఎస్.ఐ.తో పాటు దంపతులపై కేసు నమోదు
బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వైనం
విలేకరులతో మాట్లాడుతున్న బాధితుడు ఇమ్రాన్బాషా
కడప నేరవార్తలు, న్యూస్టుడే: లులు ట్రేడింగ్ సంస్థ పేరిట దంపతులు ప్రజలకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ చూపించి వారి నుంచి లక్షల రూపాయలు పెట్టుబడులుగా పెట్టించి.. చివరకు బోర్డు తిప్పేసిన సంఘటన కడప తాలూకా ఠాణా పరిధిలో ఇటీవల చోటు చేసుకుంది. పెట్టుబడి పెట్టిన బాధితుల్లో ఒకరు ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ ఆదేశాల మేరకు తాలూకా పోలీసులు లులు సంస్థ నిర్వాహకులైన దంపతులతో పాటు సంస్థలో పెట్టుబడి పెట్టిన కడప సైబర్ క్రైం ఎస్.ఐ.పై కూడా చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితుడు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కడప నగరానికి చెందిన అల్తాఫ్హుస్సేన్, అతని భార్య షబీనాజహారాతో కలిసి నగరంలోని బిల్టప్ కూడలి సమీపంలో లులు పేరిట ఓ ట్రేడింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. సంస్థలో రూ.పది లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.3 లక్షలు ఇస్తామని ప్రచారం చేసి ప్రజలను నమ్మించారు. దీంతో నగరంలోని సాయిపేటకు చెందిన ఇమ్రాన్బాషా రూ.17.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇతనితో పాటు పలువురు కూడా రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. సైబర్ క్రైం ఎస్.ఐ.జీవన్రెడ్డి రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. కొన్ని రోజుల అనంతరం పెట్టిన పెట్టుబడి ఇవ్వాలని ఇమ్రాన్బాషా సంస్థ నిర్వాహకులను కోరారు. వారు ఇవ్వకపోవడంతో సైబర్ క్రైం ఎస్.ఐ.జీవన్రెడ్డి పూచీపడి తాను ఇప్పిస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా అల్తాఫ్ హుస్సేన్ ఈ ఏడాది జనవరిలో కడప నుంచి పరారయ్యాడు. బాధితుడు ఇమ్రాన్బాషా డబ్బుల కోసం ఎస్.ఐ.కి ఫోన్ చేయగా రెండు విడతలుగా రూ.90 వేలు అతని ఖాతాలో వేశారు. మిగిలిన డబ్బుల కోసం అడిగితే తనకు సంబంధం లేదని చెప్పడంతో బాధితుడు ఎస్పీ స్పందనలో ఫిర్యాదు చేశారు. దీంతో తాలూకా పోలీసులు లులు సంస్థ నిర్వాహకులు అల్తాఫ్హుస్సేన్, ఆయన భార్య షబీనాజహారాతో పాటు ఎస్.ఐ.జీవన్రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై ‘న్యూస్టుడే’ ఎస్.ఐ.జీవన్రెడ్డిని వివరణ కోరగా లులు సంస్థ నిర్వాహకులు మాటలు విని తాను కూడా రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టానని.. తనకు సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. అనవసరంగా తనపై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ది రాక్షస గుణం... పేదల ప్రాణాలు పణం..!
[ 03-05-2024]
నిప్పులు చెరుగుతున్న భానుడి భగభగలతో పండుటాకులు విలవిలలాడిపోయారు... ప్రాణాలు హరిస్తున్న వడగాలులతో అల్లాడిపోయారు... భరించలేని ఉక్కపోతతో నిలువునా ఉడికిపోయారు... ఇదీ జిల్లావ్యాప్తంగా వివిధ బ్యాంకుల వద్ద గురువారం పింఛనుదారుల దయనీయ పరిస్థితి. -
ఆ ముగ్గురు మారీచులతో కడప నాశనం!
[ 03-05-2024]
ముగ్గురు మారీచులు కలిసి కడప నగరాన్ని సర్వనాశనం చేశారంటూ తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. -
నాయకులారా... బడి దుస్థితి చూడరా
[ 03-05-2024]
మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె గ్రామంలో సుమారు 45 సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన స్థలంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రారంభించారు. -
కొండాపురంలో రైళ్లు నిలిపేలా కృషి
[ 03-05-2024]
కొండాపురం రైల్వే నిలయంలో అన్ని రైళ్ల నిలుపుదలకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. -
రాచమల్లుకు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 03-05-2024]
రైతు కంట కన్నీరు వచ్చేలా మోసం చేసిన వారు బాగుపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ కోవకే చెందిన ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదురెడ్డి రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల శనగ రైతులను మోసం చేశారని, విజ్ఞులైన ఓటర్లారా ఎమ్మెల్యేకు ఓటుతో బుద్ధి చెప్పాలని గురువారం విడుదలైన కరపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఎంపీగా షర్మిలకు, ఎమ్మెల్యేగా పుట్టాకు ఓటేయండి: డీఎల్
[ 03-05-2024]
రాష్ట్రం కోల్పోయిన ప్రత్యేక హోదా సాధనకు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కొట్లాడుతున్నారని, ఆమెకే ఓటు వేయాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు. -
ఒక్కఛాన్స్ అన్న జగన్... జనం పాలిట విలన్
[ 03-05-2024]
ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ పాదయాత్రలో జనం ముందుకు వచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే వారి పాలిట విలన్గా మారారని తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డి విమర్శించారు. -
ప్రచారభేరి
[ 03-05-2024]
అయిదేళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో దోపిడీ దొంగల ముఠాలను తయారు చేసి వనరుల విధ్వంసానికి పాల్పడిందని 20 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కు వెల్లిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే పరిపాలనలో అనుభవ శీలి అయిన చంద్రబాబు మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టాలని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూటమి అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. -
గడికోట... ఓ భూబకాసురుడు!
[ 03-05-2024]
రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఓ భూబకాసురుడని, రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డులో భూములను కాజేసి సుమారు రూ.200 కోట్లు కాజేశారని తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. -
తెదేపాకు గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం
[ 03-05-2024]
తెదేపా అధినేత చంద్రబాబుకు కడపకు చెందిన ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ గోవర్ధన్రెడ్డి రూ.5 లక్షల విరాళం అందజేశారు.