అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి.
రోజూ 2.50 లక్షల మంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లపై జగన్ రాక్షసత్వం
తెదేపా ఏర్పాటు చేసిందనే కక్షతోనే మూసేసిన వైకాపా సర్కారు
ఈనాడు, అమరావతి
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి.
దేన్నయినా సరే.. పడగొట్టడమే తప్ప నిర్మించడం, నిలబెట్టడం వంటివి తెలియని సీఎం జగన్... ప్రత్యర్థులపై పగ సాధించడానికి, గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, భవనాలు కూలగొట్టడానికే పదవిని వాడుకున్నారు. చంద్రబాబుపై అక్కసు తీర్చుకోవడానికి అన్న క్యాంటీన్లకు తాళం వేసి, వారి నోటి దగ్గర తిండిని లాగేశారు. చేసుకుందామంటే వైకాపా ఏలుబడిలో ఎలాగూ పనుల్లేవు. ఏం తిని బతకాలి? ‘జనం కోసం అది చేశా. ఇది చేశాన’ని సొంత బాకా ఊదుకోవడమే కానీ... చెప్పిందేదీ ఆయన చేసిన పాపాన పోలేదు. అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం.. పూటకు రూ.5. చొప్పున... మూడు పూటలకూ కలిపి రూ.15కే ఆహారం లభించేది. రోజుకో రకమైన టిఫిన్ అందించడమే కాదు, భోజనంలో వేడి అన్నం, కూర, సాంబారు, పచ్చడి, పెరుగు ఉండేవి. పరిశుభ్రమైన వాతావరణంలో.. ఫ్యాన్లు, టీవీ, శుద్ధి చేసిన నీరు... ఉండేవి. 2018 జులై 11న విజయవాడ భవానీపురంలో అప్పటి సీఎం చంద్రబాబు తొలి అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అదేరోజు 25 పట్టణ స్థానిక సంస్థల్లో 60 క్యాంటీన్లు తెరిచారు. 2019 ఎన్నికల నాటికి వాటి సంఖ్య 154కు చేరింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల ఉసురు తీసింది. ఆ భవనాల్లో కొన్నింటిని వార్డు సచివాలయాలుగా మార్చేసింది. మిగిలిన భవనాలను నిరుపయోగంగా ఉంచి పాడు పెట్టింది.
‘ఆహా’... ఓహో.. అని చెప్పి..
ఎన్నికలకు ఏడాది ముందు జగన్ ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆహా’ క్యాంటీన్లు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. పట్టణ స్థానిక సంస్థల పరిధిలో 140 చోట్ల వీటికి రిబ్బన్ కట్ చేశారు. అందులో 65కిపైగా ఇప్పటికే మూత పడ్డాయి. మిగతావి పేరుకు మాత్రమే నడుపుతున్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు గత తెదేపా ప్రభుత్వం ఏటా రూ.50 కోట్లకుపైగా కేటాయిస్తే.. జగన్ ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు. పట్టణ మహిళా సమాఖ్య ద్వారా పొదుపు సంఘాల సభ్యులతో క్యాంటీన్లను ప్రారంభించారు. క్యాంటీన్ ఏర్పాటుకు పెట్టుబడి కింద ఇచ్చిన రూ.13,500 తిరిగి నెలకు రూ.500 చొప్పున నిర్వాహకులు చెల్లించాలి. పెట్టుబడి నిధి లేక.. వ్యాపారాలు సవ్యంగా సాగక క్రమంగా క్యాంటీన్లు మూతపడ్డాయి. వీటిపై సీఎం సమీక్ష కూడా చేసిన పాపాన పోలేదు.
రైతులూ, కూలీలకు మిగిల్చిన కష్టం!
- గ్రామాల నుంచి పట్టణాలకు రోజూ కూరగాయాలు తెచ్చి వీధుల్లో, రైతుబజార్లలో విక్రయించే పేద రైతులకు అన్న క్యాంటీన్లు ఎంతో సౌలభ్యంగా ఉండేవి. రూ.10కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందేది. క్యాంటీన్లు ప్రారంభించక ముందు ఇదే రైతులు టిఫిన్, భోజనానికి కలిపి రోజూ రూ.100 వరకు ఖర్చు చేసేవారు. అన్న క్యాంటీన్లు మూసేశాక భోజనం ఖర్చులు పెరిగాయని విజయవాడలోని పటమట రైతుబజారుకు రోజూ గ్రామాల నుంచి కూరగాయలు తెచ్చి విక్రయించే పలువురు రైతులు తెలిపారు. ఈ ప్రాంతంలోని అన్న క్యాంటీన్ను మూసేసి అదే భవనంలో వార్డు సచివాలయం పెట్టారు.
- విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి నగరాల్లో భవన నిర్మాణ కూలీలంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజూ వచ్చి పోతుంటారు. అన్న క్యాంటీన్లను ప్రారంభించక ముందువరకు వీరిలో కొందరు ఇళ్ల నుంచి మధ్యాహ్న భోజనం తెచ్చుకునేవారు. మరికొందరు హోటళ్లలో భోజనం చేసేవారు. క్యాంటీన్లు ప్రారంభించాక మధ్యాహ్నం రూ.5కే భోజనం చేసేవారు. వాటిని మూసి వేశాక మళ్లీ భోజన ఖర్చులు పెరిగాయని ఆనందపురం నుంచి విశాఖకు భవన నిర్మాణ పనుల నిమిత్తం రోజూ వచ్చే గణేశ్ తెలిపారు.
‘ఆహా’లో ధరలూ ఎక్కువే!
అక్కడక్కడ అరకొరగా నడుస్తున్న ఆహా క్యాంటీన్లలో టిఫిన్ రూ.20, భోజనం రూ.40. టిఫిన్ కింద రెండు ఇడ్లీ, రెండు దోశెలు, భోజనంలో అన్నం, కూర, సాంబారు ఇస్తున్నారు. శుద్ధి చేసిన తాగునీరు చాలాచోట్ల ఇవ్వడం లేదు.
భోజనం ఖర్చు 100కి పెరిగింది
- జి.అచ్చియ్య, సత్తెనపల్లి
అన్న క్యాంటీన్లు తొలగించి నిరుపేదలకు తీవ్రమైన అన్యాయం చేశారు. వీటిని మూసి వేశాక ఉదయం టిఫిన్, టీ కోసం రూ.30, మధ్యాహ్నం భోజనానికి రూ.70 కలిపి రోజూ రూ.వంద ఖర్చవుతోంది. ఇది మాకు ఎంతో భారం.
నిరుద్యోగ యువతకూ అన్యాయం చేశారు
- టి.శివారెడ్డి, పెదవాల్తేరు, విశాఖపట్నం
అధికారంలో ఎవరున్నా పేదలకు మేలు చేసే కార్యక్రమాలు అమలు చేయాలి తప్పితే రద్దు చేయడం సహేతుకం కాదు. అన్న క్యాంటీన్లు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. వివిధ పనుల కోసం నగరాలు, పట్టణాలకు వచ్చే పేదల ఆకలి తీర్చేవి.
ఆకలి బాధలు తప్పేవి
- జి.సూర్యనారాయణ కూలీ, గుణదల, విజయవాడ
అన్న క్యాంటీన్లలో రూ.15కే మూడు పూటలా ఆహారం లభించేది. క్యాంటీన్లు మూసి వేశాక ఉదయం టిఫిన్, టీ ఖర్చులకే రూ.30 కావాలి. చేద్దామంటే పనుల్లేవు. మధ్యాహ్న భోజనానికి రూ.60 ఖర్చు అవుతోంది. అన్న క్యాంటీన్లు మూసేసి అన్యాయం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస