ఖరీఫ్ ఆయకట్టుపై కసరత్తు
ఖరీఫ్లో మధ్యతరహా, పెద్ద జలాశయాల పరిధిలోని కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరివ్వాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జల ప్రవాహానికి ఉన్న అడ్డంకులు గుర్తించి తొలగించాలని నిర్ణయించారు.
ప్రణాళిక రూపొందించిన జిల్లా ఉన్నతాధికారులు
బ్రహ్మంసాగర్ జలాశయం
న్యూస్టుడే, కడప ఖరీఫ్లో మధ్యతరహా, పెద్ద జలాశయాల పరిధిలోని కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరివ్వాలని జలవనరుల శాఖ సాంకేతిక నిపుణులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జల ప్రవాహానికి ఉన్న అడ్డంకులు గుర్తించి తొలగించాలని నిర్ణయించారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం, తెలుగు గంగ, అనుబంధ జలవనరుల ప్రాంతాల్లోని బీడువారిన నేలకు సేద్యపు జలాలు తరలించాలని పక్కా ప్రణాళికను రూపొందించారు.
* జిల్లాలో 2022 ఖరీఫ్లో జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ అనుబంధ పథకాల పరిధిలో భూములకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపాదించారు. మైలవరం, పైడిపాళెం, పీబీఆర్, లింగాల కుడి కాలువ, వామికొండ, సర్వ రాయసాగర్, బ్రహ్మంసాగర్, ఎస్ఆర్-1, ఎస్ఆర్-2 పరిధిలో 2,91,201 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం జిల్లాలో 54.975 టీఎంసీల నీరుంది. ఇప్పటికే 2.15 లక్షలకు సేద్యపు జలాలు ఇచ్చేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. పంటల సాగు కోసం 21.50 టీంఎసీలు, తాగునీటి అవసరాలకు 7.585 టీఎంసీలు అవసరం ఉంటుందని అంచనా. మరో 25.89 టీఎంసీల జలాలు మిగులు ఉంటుంది. వర్షాలు కురిస్తే నీరు చేర నుంది. ఈ నీటిని ఏం చేయాలి, అదనపు ఆయకట్టుకు ఇవ్వాలంటే క్షేత్రస్థాయిలో ప్రధాన, ఉప, పంట కాలువలను సిద్ధం చేయాల్సి ఉంటుందని గుర్తించారు. ఇందుకు నిధులివ్వాలని ఉన్నతస్థాయికి నివేదిక పంపినట్లు సీనియర్ అధికారి తెలిపారు. వరి పంట సాగును ప్రోత్సహించాలనా, ఆరుతడి పైర్లు వేసుకోవాలని ప్రకటన చేయాలనా అనే అంశంపై ఉన్నత స్థాయిలో చర్చిస్తున్నారు.
* వ్యవసాయ, ఉద్యాన పంటలకు, నేరుగా, బిందు, తుంపర పరికరాల ఎలా ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు. కడపలో బుధవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలోనూ ఇదే సమస్యపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. మైలవరం జలాశయం నిల్వ సామర్థ్యం 6.50 టీఎంసీలు. ప్రస్తుతం 0.678 టీఎంసీల నీరుంది. ఉత్తర, దక్షిణ కాలువల కింద 70,587 ఎకరాలు ఉండగా ఈసారి 50 వేల ఎకరాలకు నీరిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయకట్టుకు అయిదు టీఎంసీలు, తాగునీటికి 1.892 టీఎంసీలు అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నీటి కంటే మరో ఆరు టీఎంసీలకు పైగా నీరు తెప్పించాల్సి ఉంటుంది. తెలుగుగంగ ఉప జలాశయం-1 నిల్వ సామర్థ్యం 2.134 టీఎంసీలు. ప్రస్తుతం 0.55 టీఎంసీల నీరుంది. ఈదఫా 10 వేల ఎకరాలకు గంగ తీసుకెళ్లాంటే ఒక టీఎంసీ కావాలి. మరో 0.450 టీఎంసీలను తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్ఆర్-2లో నీటి కొరత ఉంది. మిగతా పంట కాలువలను పూర్తి చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ పర్యటనపై డేగ కన్నుతో నిఘా
[ 04-05-2024]
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు రేంజ్ డీఐజీ సీˆహెచ్ విజయరావు అధికారులను ఆదేశించారు. -
ఐదేళ్ల పాలనలో ఏం చేశావ్... కార్మికుల బతుకులు కూల్చేశావ్..!
[ 04-05-2024]
జిల్లాలో 55 వేల మంది భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కార్మిక శాఖ పరిగణనలోకి తీసుకోనివారు మరో 50 వేల మంది పైగా కార్మికులు ఉన్నారు. ఒకనాడు పల్లెసీమలు పాడి పంటలతో విలసిల్లాయి. -
పెద్దిరెడ్డికి రైతుల ఉసురు తగలక తప్పదు
[ 04-05-2024]
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి, మామిడి రైతులను దోపిడీ చేసి వారిని తీవ్రంగా నష్టపరిచారని ఆ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
అయ్యో పాపం...!
[ 04-05-2024]
మండుటెండలు, వడగాలుల మధ్య పింఛను సొమ్ము కోసం రెండో రోజైన శుక్రవారం ఉదయం నుంచే పండుటాకులు బ్యాంకుల బాట పట్టారు. తమ వంతు కోసం అక్కడే గంటలతరబడి పడిగాపులు కాశారు. -
ఒట్టేసి చెబుతున్నాం.. ఓటేసి బుద్ధి చెబుతాం
[ 04-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత బి.కొత్తకోట పట్టణ శివారు ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి... కనీస వసతులు అందుబాటు లేకపోవడంతో నిరుపేదలు దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. -
జగన్ పాపానికి ఇద్దరి బలి
[ 04-05-2024]
పింఛను కోసం బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఎండథాటికి తట్టుకోలేక ఇద్దరు వృద్ధులు మృతిచెందిన ఘటన బద్వేలులో శుక్రవారం చోటుచేసుకుంది. -
వైకాపా కంచుకోటకు బీటలు
[ 04-05-2024]
వైకాపాకు కంచుకోట ఉన్న కోమన్నూతలలో దేవిరెడ్డి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నుంచి ఓబులరెడ్డి, బీష్మారెడ్డి, భార్గవ్, ప్రతాప్, మరో 30 కుటుంబాలు శుక్రవారం తెదేపాలో చేరాయి. -
రాజోలి ప్రాజెక్టును పట్టించుకోని వారికి ఎందుకేయాలి ఓట్లు
[ 04-05-2024]
మీఎమ్మెల్యే ఏరోజైనా పలకడా.. ఎప్పుడైనా మీకు కష్టం ఉందా అని అడిగాడా... ఎర్రచందనం స్మగ్లింగ్, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాడట కదా మీ ఎమ్మెల్యే మట్టి, ఇసుక మాఫియా ఇక చెప్పనవసరం లేదని -
షర్మిలకు ఓటేయాలని పిలుపు
[ 04-05-2024]
పోరుమామిళ్ల, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి వివేకాల ఆత్మలు శాంతించాలంటే కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటేయాలని వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు వైకాపా ఎర!
[ 04-05-2024]
రానున్న ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే పట్టుదలతో వైకాపా నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల నాయకులు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!