logo

కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం

వైకాపా పాలనపై విరక్తి చెందిన ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి అన్నారు. మండలంలోని సొరకాయలపేట, గోరంట్లపల్లె, మారెళ్ల, వగళ్ల గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 30 Apr 2024 06:37 IST

మాట్లాడుతున్న తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి  నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి

కంభంవారిపల్లి, న్యూస్‌టుడే: వైకాపా పాలనపై విరక్తి చెందిన ప్రజలు కూటమి వైపు చూస్తున్నారని తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి అన్నారు. మండలంలోని సొరకాయలపేట, గోరంట్లపల్లె, మారెళ్ల, వగళ్ల గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లారి మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అవినీతి, అక్రమాలకు ఏపీ నిలయంగా మారిందని విమర్శించారు. యువత ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారని అన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షురాలు గీతాంజలి, నాయకులు రఘురామిరెడ్డి, కృష్ణమ్మ, గోపాల్‌ రెడ్డి, కృష్ణయ్య, గాలి సుధాకర్‌ నాయుడు, రామకృష్ణ, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని