logo

చంద్రబాబు సభకు వెళ్లారని దాడి

తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయి. అంగళ్లులో ఆదివారం తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం కావడాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

Published : 06 May 2024 04:08 IST

తంబళ్లపల్లె నియోజకవర్గంలో అరాచకం
బాధితుడ్ని కిడ్నాప్‌ చేసిన వైకాపా నేతలు

గాయపడ్డ  మల్లికార్జున

ఈనాడు, కడప: తంబళ్లపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయి. అంగళ్లులో ఆదివారం తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం కావడాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సభకు పెద్దమండ్యం మండలం వెలిగల్లు నుంచి తెదేపా కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త మల్లికార్జున (31) ఆదివారం రాత్రి 8 గంటలకు స్వగ్రామంలో బస్సు దిగారు. వైకాపా నాయకులు రోడ్డుకు అడ్డంగా కారు పెట్టడంతో పక్కకు తీయాలంటూ మల్లికార్జున సూచించారు. ఆగ్రహంతో రగిలిపోయిన వైకాపా నాయకులు తెదేపా కార్యకర్తపై దాడి చేసి కారులో అపహరించుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న తెదేపా నేతలు గ్రామానికి చేరుకున్నారు. ఘటనను తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన మదనపల్లె డీఎస్పీకి ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. పెద్దమండ్యం పోలీసులు వెలిగల్లుకు చేరుకుని విచారణ చేపట్టారు. మల్లికార్జునను వదిలిపెట్టాలని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెదేపా నేతలు హెచ్చరించారు. పోలీసులు జోక్యం చేసుకుని మల్లికార్జునను వదిలిపెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. దాడితో గాయపడిన తెదేపా కార్యకర్త ఇంటికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని