logo

దస్తగిరి ప్రచార వాహనంపై రాళ్ల దాడి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు అప్రూవర్‌, జై భీంరామ్‌ భారత్‌ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ప్రచార వాహనంపై ఆదివారం సాయంత్రం పులివెందులలో అల్లరి మూకలు దాడి చేశాయి.

Published : 06 May 2024 08:03 IST

దస్తగిరి ఫ్లెక్సీని చింపేసిన దుండగులు

వేంపల్లె, న్యూస్‌టుడే : మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు అప్రూవర్‌, జై భీంరామ్‌ భారత్‌ పార్టీ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి ప్రచార వాహనంపై ఆదివారం సాయంత్రం పులివెందులలో అల్లరి మూకలు దాడి చేశాయి. వాహనంపై ఫ్లెక్సీలు చించి వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దస్తగిరి ప్రచార వాహనం నిత్యం పట్టణంలో తిరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక ముద్దనూరు రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలి మీదుగా ఆదివారం ప్రచార వాహనం వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అల్లరిమూకలను చెదరగొట్టడంతో పరారయ్యారు. వైకాపా కార్యకర్తలే ప్రచార వాహనంపై దాడికి పాల్పడ్డారని దస్తగిరి విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని