సీఎం జగన్ కంచుకోటలో ఎందుకీ కలవరం?
సీఎం జగన్కే కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట. ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు.
ఇంటింటికీ జగన్ సతీమణి భారతి ప్రచారం
అడుగడుగునా ప్రజల నుంచి సమస్యలపై ఏకరవు
వైకాపా పాలనపై చాపకింద నీరులా అసంతృప్తి
పరిస్థితిపై స్థానిక నాయకుల మధ్య చర్చోపచర్చలు
ఈనాడు, కడప, న్యూస్టుడే, చక్రాయపేట
పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం బాలతిమ్మయ్యగారిపల్లెలో వృద్ధురాలు లక్ష్మమ్మ చేతులు పట్టుకుని నచ్చచెబుతున్న సీఎం సతీమణి వైఎస్ భారతి
సీఎం జగన్కే కాదు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాం నుంచి వారి కుటుంబానికి పులివెందుల కంచుకోట. ఓట్లు అడగకపోయినా ప్రతి ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సారి పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా సీఎం జగన్ సతీమణి భారతి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ వెళుతున్నారు. గతంలో కొన్ని ప్రాంతాలు, పల్లెలకు వెళ్లినా ఓ చోట నిల్చుని ప్రచారం చేసేవారు. ఇప్పుడు ఆమె ఇంటింటికీ వెళ్లడంతో పాటు కుటుంబసభ్యులు, బంధువులను రంగంలోకి దింపి మరీ ప్రచారం చేస్తున్నారు. భారతి ప్రచారానికి ఎన్నడూ లేనంతగా ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
ఇటీవల వేంపల్లెలో వైకాపా కీలక నేత భాస్కర్రెడ్డి పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో ముద్రణపై ప్రస్తావిస్తూ ఒకింత నిలదీసినట్లు వ్యవహరించారు. జగన్.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటున్నారు.. నా రైతు కూడా అనాల్సిన పరిస్థితి ఉందంటూ.. అన్నదాతను విస్మరించారనే విధంగా ప్రస్తావించారు. పులివెందుల ప్రచారంలోనూ పలు చోట్ల ప్రజలు తమ సమస్యలను భారతి వద్ద ప్రస్తావించారు. వ్యక్తిగత సమస్యలను నివేదిస్తూ అధికారులు చేయడం లేదని వివరించారు. చక్రాయపేట మండలం బాలతిమ్మయ్యగారిపల్లెలో సోమవారం భారతి ఇంటింటి ప్రచారానికి వెళ్లగా, వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను పలువురు ప్రస్తావించారు. భారతి పర్యటనలో ఉన్న నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మరింతగా స్వరం పెంచి తమ కష్టాలు చెప్పుకొన్నారు. పక్కా ఇళ్లు మంజూరు కోసం తనతో పాటు తన కుమారుడు నాలుగైదు సార్లు దరఖాస్తు చేసుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదని భారతి ఎదుట కాలగిరి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సారికి ఓటేయి.. చేస్తామంటూ నేతలు సర్ధి చెప్పే ప్రయత్నం చేయగా వారి వైపు తిరిగి మరింత తీవ్ర స్వరంతో మాట్లాడారు. తమ కుటుంబ కష్టాలు గురించి ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భారతి జోక్యం చేసుకుని పింఛను వస్తోందా? అవ్వా అంటూ ఆమెను శాంతపరిచే ప్రయత్నం చేశారు. మావాళ్లు తప్పకుండా ఇళ్లు కట్టిస్తారంటూ హామీ ఇచ్చి వెనుదిరిగారు. కావలి సుభాషిణి అనే మహిళ.. భారతితో మాట్లాడుతూ ఇంటికోసం 12 సార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని, బోదకొట్టంలో జీవనం సాగిస్తున్నామంటూ దాన్ని చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత ఉన్నా ప్రభుత్వం నుంచి తమకు అమ్మఒడి పథకం వర్తించలేదని.. భర్త ఆటో నడుపుకొంటున్నప్పటికీ ఎలాంటి లబ్ధి చేకూరలేదని సుదర్శనమ్మ ప్రస్తావించారు. తన కుమారుడికి గుండెలో చిల్లు పడినప్పటికీ వైద్యం చేసుకునేందుకు మార్గం కనిపించలేదని విలపించారు. గోడకూలిన ప్రమాదంలో తన బిడ్డకు నడుము విరిగిపోయిందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం రాలేదంటూ ఓబులశెట్టి లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన సమయంలో ఇలాంటి నిలదీతలు, సమస్యలు ప్రస్తావనకు వచ్చిన దాఖలాల్లేవు. ఈ సారి మాత్రం ప్రజలు తీవ్ర అసంతృప్తితో ధైర్యంగా తమ ఇబ్బందులను ప్రస్తావిస్తున్నారు.
వివేకా హత్యతో అప్రమత్తం
పులివెందుల నియోజకవర్గ ప్రజలు మాజీమంత్రి వివేకానందరెడ్డిని అమితంగా ప్రేమిస్తారు. ఏ చిన్న సమస్యనైనా చెప్పుకొంటే వెంటనే వారిని వాహనంలో అధికారి వద్దకు తీసుకెళ్లి పరిష్కరించే నైజం ఆయనది. దీంతో నియోజకవర్గంలో ఏ సమస్యనైనా పరిష్కరించడంతో ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి ప్రస్తావనలు వచ్చేవి కావు. ఆయన మరణంతో ప్రజా సమస్యలు పట్టించుకునే వారే కరవయ్యారు. సీఎం జగన్ వచ్చినా సొంత నియోజకవర్గంలోనూ పరదాల చాటున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా ఆయనను కలవాలంటే ముందస్తుగా పాసులు తీసుకోవాల్సిన పరిస్థితి. పాసులు పొందడం అంత సులువు కాదు. వివేకా హత్య జిల్లాతో పాటు నియోజకవర్గంలో ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. సీబీఐ విచారణ, ఛార్జిషీట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావడంతో జనంలో పెద్ద చర్చ నీయాంశమైంది. జగన్ సోదరి షర్మిల సైతం వివేకా హత్య అజెండాపైనే కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలోకి దిగారు. వివేకా కుమార్తె సునీత గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజాకోర్టులో న్యాయం కావాలని వేడుకుంటున్నారు. షర్మిల, సునీత కొంగు చాచి ధర్మం, న్యాయం కావాలంటూ.. దీనికి ప్రజల మద్దతు కావాలని వేడుకుంటున్నారు. అటు రాజన్న బిడ్డ షర్మిల, ఇటు వివేకా తనయ సునీత కొంగు చాచి అనేంత పదాలు వాడడం ప్రజల మనసులను కదిలించాయి. ఈ పరిణామాల క్రమంలో జగన్ కుటుంబం ఎన్నికలపై మరింత జాగ్రత్త పడుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలకు పార్టీ తరఫున రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆర్థికసాయం ఆశించేందుకు ఓ దరఖాస్తు సైతం రూపొందించి అందుబాటులోకి తెచ్చారు. భారతి పర్యటనలో పోలీసులు, అనుచరులు నిలదీతలు తగ్గించడానికి ఓ వైపు కృషి చేస్తుంటే... నియోజకవర్గంలో పరిణామాలను పరిశీలించడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపైనా ప్రత్యేక దృష్టి పెట్టి... అవసరమైన చోట్ల డబ్బుల పంపిణీకి సిద్ధమయ్యారు. ఉద్యోగులు చాలా మంది తాయిలాలను తిరస్కరించడం వైకాపా వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కడప గౌస్నగర్ ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం
[ 18-05-2024]
పోలింగ్ రోజున కడప గౌస్నగర్లో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడులు జరిగిన ఘటనపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ ముగ్గురిని జిల్లా దాటించారు!
[ 18-05-2024]
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలను కేంద్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు, కడప నియోజకవర్గాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసుశాఖ డేగ కళ్లలో నిఘా పెట్టింది. -
కాలేటివాగులో కాలనాగులు
[ 18-05-2024]
ప్రతిష్ఠాత్మకమైన హంద్రీ-నీవా ప్రాజెక్టు ఉండగా, దీనికి సమాంతరంగా మరొక దానిని ప్రతిపాదించి రూ.వేల కోట్లతో పనులు చేపట్టారు. కాలేటివాగు ప్రాజెక్టు ప్రతిపాదనపై ఆది నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాధనం కొల్లకొట్టడానికే ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారంటూ విపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. -
పోలీసు విధుల్లో కొరవడిన ‘చైతన్య’ం!
[ 18-05-2024]
తాడిపత్రికి స్పెషల్ డ్యూటీ పేరిట అర్ధరాత్రి పూట వెళ్లి జేసీ ప్రభాకర్రెడ్డి ఇంట్లోని పనివాళ్లను విచక్షణారహితంగా కొట్టడం... ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం... దివ్యాంగుడైన కంప్యూటరు అపరేటర్ కిరణ్ తల పగలుకొట్టడం... ఉద్రిక్తతలను తగ్గించాల్సింది పోయి మరింతగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం. -
పురజనుల కష్టాలు చూస్తేనే జలదరింపు!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
జయజయధ్వానాలతో మార్మోగిన బ్రహ్మంగారిమఠం
[ 18-05-2024]
భక్తులు జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై అనే నామస్మరణతో బ్రహ్మంగారి మఠ ఆవరణ మారుమోగింది. జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం, ఆరాధన గురు పూజా మహోత్సవంలో శుక్రవారం స్వామి వారు దీక్షా బంధన ఆలంకారోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. -
డబ్బులుంటేనే దప్పిక తీరేది!
[ 18-05-2024]
జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. వర్షాభావం, కరవు రక్కసితో జలవనరులు పూర్తిగా వట్టి పోయాయి. ప్రధానంగా పట్టణ వాసులు గొంతు తడుపుకొనేందుకు, వాడుకోవడానికి బిందెడు నీళ్లు దొరక్క నరకం చూస్తున్నారు. ప్రతిరోజూ రూ.600 నుంచి రూ.1,000 వరకు ఖర్చు పెట్టి ట్యాంకర్లతో తాగునీటిని కొనుగోలు చేసుకుని గొంతు తడుపుకొంటున్నారు. -
అగ్నిమాపక శాఖలో అసౌకర్యాల మంట
[ 18-05-2024]
అగ్ని ప్రమాదం చోటు చేసుసుకుంటే వెంటనే మంటలు ఆర్పేయాలి.. లేకుంటే ఆస్తి నష్టం జరుగుతుంది. ఒక్కో సారి ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చిన్నపాటి మంటలు చెలరేగినా అధిక ఉష్ణోగ్రతలతో ఈదురు గాలుల తీవ్రతతో క్షణాల్లోనే మంటలు వ్యాపిస్తున్నాయి. -
ఇసుకాసురులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
[ 18-05-2024]
ఇసుకాసురులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ డిమాండ్ చేశారు. శుక్రవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న గుర్రంకొండ మండలంలోని తరిగొండ రామానాయుడు చెరువును పరిశీలించారు. -
తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి
[ 18-05-2024]
ట్యాంకు నుంచి తమ ఇంటికి ఏర్పాటు చేసుకున్న తాగునీటి పైపును వైకాపా నేతలు అకారణంగా కోసేశారని... ఎందుకు ఇలా చేశారని అడిగిన పాపానికి మూకుమ్మడిగా దాడి చేశారని చిన్నమండెం మండలం మల్లూరు క్రాస్కు చెందిన తెదేపా కార్యకర్త కదిరి చిన్నప్ప ఆవేదన వ్యక్తం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి
[ 18-05-2024]
అనుమానాస్పద స్థితిలో హిజ్రా మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కేశాపురం గ్రామం గుట్టమోటు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
వడదెబ్బతో ఇద్దరు ఉపాధి కూలీల మృతి
[ 18-05-2024]
వడదెబ్బకు గురై ఇద్దరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో మృతి చెందారు. రైల్వేకోడూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె పంచాయతీ బంగ్లామిట్టకు చెందిన పాలెంకోట వెంకటేషు (55) శుక్రవారం గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పని చేస్తుండగా ఎండ తీవ్రతకు తాళలేక కుప్పకూలిపోయారు. -
మదనపల్లెలో ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం
[ 18-05-2024]
మదనపల్లె మండలంలోని శ్రీ వేద పాఠశాలలో శనివారం నుంచి ఆర్ఎస్ఎస్ దక్షిణాది రాష్ట్రాల శిక్షణ శిబిరం జరగనున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మదనపల్లెకు రానున్న నేపథ్యంలో మదనపల్లె డీఎస్పీ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో తనిఖీలు చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?