విస్తృతంగా చేరికలు... పెరిగిన వలసలు
ఎన్డీఏ కూటమిలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గురువారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ఎన్డీఏలో చేరిన వారితో జమ్మలమడుగులో అసెంబ్లీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగు, పోరుమామిళ్ల, ప్రొద్దుటూరు వైద్యం, కలసపాడు, మైలవరం, న్యూస్టుడే: ఎన్డీఏ కూటమిలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గురువారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలోని 20 మంది ఆర్ఎంపీలు సైతం కలసి తమ మద్దతు తెలిపినట్లు ఆదినారాయణరెడ్డి తెలిపారు.
మిట్టమానుపల్లెకు చెందిన వైకాపా నాయకులతో ఎన్డీయే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్
పోరుమామిళ్ల పట్టణంలోని బలిజకోట వీధికి చెందిన 10 కుటుంబాలు గురువారం తెదేపాలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అక్కల్రెడ్డిపల్లె నుంచి 10 కుటుంబాలు, ముసల్రెడ్డిపల్లె నుంచి 30 కుటుంబాలు మొత్తం 50 కుటుంబాలు తెదేపాలో చేరాయి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగిరి భైరవప్రసాదు, సర్పంచి సుధాకర్, తెదేపా నాయకులు సీతా వెంకటస్బుయ్య, రామసుబ్బారావు, సత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరులోని అమృతనగర్కు చెందిన 100 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారందరికీ మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి కండువాకప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. వరదరాజులురెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రొద్దుటూరులో అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలు అంతమవుతాయన్నారు. పెద్దముడియం మహమ్మద్బాషా, గైబు, షరీఫ్, బుజ్జి, ఇంద్ర, బాషా, అక్బర్, తదితరులు పాల్గొన్నారు. కలసపాడు మండలంలోని పుల్లారెడ్డిపల్లెలో తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంతూ, జడ్పీట©సీ మాజీ సభ్యుడు డి.రాంభూపాల్రెడ్డి సమక్షంలో, స్థానిక నాయకుడు పెదిరెడ్డి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 15 కుటుంబాలు తెదేపాలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. మైలవరం మండలం వేపరాల-1 ఎంపీటీసీ సభ్యులు అలిశెట్టి కుమార్, దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన యనమల సుబ్బిరెడ్డి, మైలవరానికి చెందిన భీముడు నాయక్లతో పాటు 200 కుటుంబాలు ఆదినారాయణరెడ్డి సమక్షంలో కూటమిలో చేరాయి. మైదుకూరు నియోజకవర్గంలో మిట్టమానుపల్లె పంచాయతీకి చెందిన సాంబశివారెడ్డి, నక్కా నారాయణతోపాటు వారి అనుచరులు ప్రొద్దుటూరులోని పార్టీ కార్యాలయంలో ఎన్డీయే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో తెదేపాలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే