ఓటు వేసుకుంటాం... ఏజెంట్గా కూర్చుంటాం
ప్రజాస్వామ్యరీతిలో మాఓటు హక్కును వినియోగించుకుంటాం.. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లుగా నియమించుకుంటాం.
వైకాపా నాయకుల నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదు
కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు
మైదుకూరు, న్యూస్టుడే : ప్రజాస్వామ్యరీతిలో మాఓటు హక్కును వినియోగించుకుంటాం.. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లుగా నియమించుకుంటాం. వైకాపా నాయకుల నుంచి మాకు కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం మైదుకూరు మండలం తువ్వపల్లె ఎసీˆ్సలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధాన అధికారితోపాటు జిల్లా, నియోజకవర్గ ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎసీˆ్సలు విలేకరులకు తెలిపారు. గురువారం కడప కలెక్టరేట్ చేరుకున్న తువ్వపల్లె ఎసీˆ్సలు ఎన్నికల ప్రధాన అధికారికి పంపిన ప్రతిని ప్రదర్శించారు. తువ్వపల్లె పోలింగ్ స్టేషన్ సంఖ్య 128 పరిధిలోని ఉప మండలాధ్యక్షుడు ఊటుకూరు రఘురామిరెడ్డి, గ్రామ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, గూడా వెంకటసుబ్బారెడ్డి, వేమన నరసింహారెడ్డి, ఎనమల మల్లికార్జునరెడ్డి, ఊటుకూరు రామాంజనేయరెడ్డి ఓటు వేయవద్దని, ఏజెంట్లుగా కూర్చోకూడదని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎసీˆ్సలమైన తమకు ఎన్నికల నిబంధనల మేరకు 128 పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును సజావుగా వినియోగించుకునేందుకు, ఏజెంట్గా నియామకం కొరకు ఉత్తర్వులు జారీ చేసి పోలీసు సిబ్బందిని నియమించి ప్రాణహాని జరగకుండా భద్రత కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదులో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల