కార్మికులు, కర్షకుల సమ్మిళితం.. బెల్లంపల్లి
దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపిన సింగరేణి కాలరీస్ కంపెనీలో బొగ్గుగనుల క్షేత్రంగా కీలక పాత్ర పోషించింది ‘బెల్లంపల్లి’ మాత్రమే. ఖమ్మం జిల్లా ఇల్లందులో ప్రారంభమైన సింగరేణి ప్రస్థానం 1928 నుంచి బెల్లంపల్లిలో విస్తరించింది.
బెల్లంపల్లి రైల్వేస్టేషన్
దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపిన సింగరేణి కాలరీస్ కంపెనీలో బొగ్గుగనుల క్షేత్రంగా కీలక పాత్ర పోషించింది ‘బెల్లంపల్లి’ మాత్రమే. ఖమ్మం జిల్లా ఇల్లందులో ప్రారంభమైన సింగరేణి ప్రస్థానం 1928 నుంచి బెల్లంపల్లిలో విస్తరించింది. దేశంలోని అన్నిరాష్ట్రాలకు చెందిన అధికారులు, సాంకేతిక నిపుణులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో సమ్మిళతమైన ‘బెల్లంపల్లి’లో అన్ని సంప్రదాయాలు, సంస్కృతులు కనిపిస్తాయి. ఇక్కడ ప్రధానంగా సింగరేణిËతో పాటు దేవాపూర్ సిమెంట్ కార్మాగారం, వ్యవసాయరంగాలపై ఆధారపడి ఉంది. బెల్లంపల్లి, తాండూరు, కాసిపేట మండలాల్లో సింగరేణి కార్మికులుండగా నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో వరి, పత్తి ఉద్యాన పంటలు సాగు చేస్తారు.
బెల్లంపల్లి, కాసిపేట, న్యూస్టుడే: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ‘బెల్లంపల్లి’ పట్టణం సింగరేణి బొగ్గుగనులకు పుట్టినిల్లు. 1972 ఎన్నికల వరకు ఎస్టీలకు రిజర్వు చేసిన ఆసిఫాబాద్ నియోజకవర్గం 1978 నుంచి ఎస్సీలకు రిజర్వు చేశారు. అప్పటి నుంచి ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న బెల్లంపల్లి పట్టణం నుంచి ప్రతిసారి ఎన్నికల బరిలో నిలిచిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న బెల్లంపల్లి పట్టణం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఇక్కడ సింగరేణి భూగర్భగనులు, విభాగాలు విస్తరించడంతో వేలాది మంది కార్మికులు ఇక్కడే తమ కుటుంబాలతో నివసించే వారు. భూగర్భ గనులు నియోజకవర్గంలోని తాండూరు, రెబ్బెన మండలాలకు విస్తరించడంతో నియోజకవర్గంలో కార్మికులు, వారి కుటుంబాల మద్దతు ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐకి ఎక్కువగానే ఉండేది. ఆ కారణంగానే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలో ఉన్న గుండా మల్లేష్ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో నియోజక వర్గాల పునర్విభజనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదో నియోజకవర్గంగా బెల్లంపల్లి ఆవిర్భవించింది. అంతకుముందు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న నెన్నెల, వేమనపల్లి మండలాలతో పాటు లక్షెట్టిపేట పరిధిలో ఉన్న కాసిపేట మండలం బెల్లంపల్లి నియోజకవర్గంలో విలీనమయ్యాయి. ఈ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సింగరేణి కార్మికులు అధికంగా ఉండటంతో మొదటిసారి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ ఎమ్మెల్యేగా మళ్లీ కార్మికులు, వారి కుటుంబాల మద్దతుతో గెలుపొందారు. ఇలా సీపీఐ విజయ పరంపర కొనసాగింది. 1999 సంవత్సరంలో పాటి సుభద్ర, 2004లో అమురాజుల శ్రీదేవి ఆసిఫాబాద్ నుంచి తెదేపా తరపున పోటీ చేసి గెలవడానికి కార్మికుల ఓట్లు కారణమయ్యాయి. 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా దాసరి నర్సయ్య సింగరేణి ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తిరిగి 1989లో పోటీ చేసిన దాసరి నర్సయ్య మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచిన దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2018లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఎవరు విజయం సాధించాలన్నా బెల్లంపల్లి పట్టణంలోని ఓట్లు కీలకం. అందులో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు అధిక ప్రభావం చూపిస్తాయి.
భూగర్భగనుల మూత.. విభాగాల తరలింపుతో..
బెల్లంపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక భూగర్భగనులు వాటికి అనుబంధంగా విభాగాలు కొనసాగేవి. 2003 వరకు బెల్లంపల్లి పట్టణంలో 30 వేలకు పైగా కార్మికులు వారి కుటుంబాలు నివసించేవారు. 2004 - 05 వరకు బెల్లంపల్లి ఏరియాలో ఉన్న అన్ని భూగర్భగనులు మూసివేస్తు వచ్చారు. దీంతో బెల్లంపల్లి పట్టణం ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది.
వ్యవసాయం.. సిమెంట్ కర్మాగారం
ఇక్కడ ప్రధానంగా సింగరేణితో పాటు దేవాపూర్ సిమెంట్ కర్మాగారం, వ్యవసాయరంగాలపై ఆధారపడి ఉంది. బెల్లంపల్లి, తాండూరు, కాసిపేట మండలాల్లో సింగరేణి కార్మికులుండగా నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో వ్యవసాయరంగం ఉంది. బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లో ఎక్కువగా మామిడి పంటలు సాగుచేస్తారు. కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ శివారులోని గుట్టలు సిమెంట్ తయారీలో ముడిసరకైన సున్నపురాయి నిల్వలు గుర్తించారు. 1982లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారాన్ని ప్రారంభించి సిమెంట్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇప్పటికి నాలుగు యునిట్లతో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ దేశంలోని పలురాష్ట్రాల నుంచి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి
అంబేడ్కర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాను మనసులో పెట్టుకొని.. తాతను కొట్టి చంపిన మనవళ్లు
-
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
-
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు