కార్మికులు, కర్షకుల సమ్మిళితం.. బెల్లంపల్లి
దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపిన సింగరేణి కాలరీస్ కంపెనీలో బొగ్గుగనుల క్షేత్రంగా కీలక పాత్ర పోషించింది ‘బెల్లంపల్లి’ మాత్రమే. ఖమ్మం జిల్లా ఇల్లందులో ప్రారంభమైన సింగరేణి ప్రస్థానం 1928 నుంచి బెల్లంపల్లిలో విస్తరించింది.
బెల్లంపల్లి రైల్వేస్టేషన్
దక్షిణ భారతదేశానికి వెలుగులు నింపిన సింగరేణి కాలరీస్ కంపెనీలో బొగ్గుగనుల క్షేత్రంగా కీలక పాత్ర పోషించింది ‘బెల్లంపల్లి’ మాత్రమే. ఖమ్మం జిల్లా ఇల్లందులో ప్రారంభమైన సింగరేణి ప్రస్థానం 1928 నుంచి బెల్లంపల్లిలో విస్తరించింది. దేశంలోని అన్నిరాష్ట్రాలకు చెందిన అధికారులు, సాంకేతిక నిపుణులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో సమ్మిళతమైన ‘బెల్లంపల్లి’లో అన్ని సంప్రదాయాలు, సంస్కృతులు కనిపిస్తాయి. ఇక్కడ ప్రధానంగా సింగరేణిËతో పాటు దేవాపూర్ సిమెంట్ కార్మాగారం, వ్యవసాయరంగాలపై ఆధారపడి ఉంది. బెల్లంపల్లి, తాండూరు, కాసిపేట మండలాల్లో సింగరేణి కార్మికులుండగా నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో వరి, పత్తి ఉద్యాన పంటలు సాగు చేస్తారు.
బెల్లంపల్లి, కాసిపేట, న్యూస్టుడే: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ‘బెల్లంపల్లి’ పట్టణం సింగరేణి బొగ్గుగనులకు పుట్టినిల్లు. 1972 ఎన్నికల వరకు ఎస్టీలకు రిజర్వు చేసిన ఆసిఫాబాద్ నియోజకవర్గం 1978 నుంచి ఎస్సీలకు రిజర్వు చేశారు. అప్పటి నుంచి ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న బెల్లంపల్లి పట్టణం నుంచి ప్రతిసారి ఎన్నికల బరిలో నిలిచిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న బెల్లంపల్లి పట్టణం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఇక్కడ సింగరేణి భూగర్భగనులు, విభాగాలు విస్తరించడంతో వేలాది మంది కార్మికులు ఇక్కడే తమ కుటుంబాలతో నివసించే వారు. భూగర్భ గనులు నియోజకవర్గంలోని తాండూరు, రెబ్బెన మండలాలకు విస్తరించడంతో నియోజకవర్గంలో కార్మికులు, వారి కుటుంబాల మద్దతు ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐకి ఎక్కువగానే ఉండేది. ఆ కారణంగానే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలో ఉన్న గుండా మల్లేష్ మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో నియోజక వర్గాల పునర్విభజనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదో నియోజకవర్గంగా బెల్లంపల్లి ఆవిర్భవించింది. అంతకుముందు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న నెన్నెల, వేమనపల్లి మండలాలతో పాటు లక్షెట్టిపేట పరిధిలో ఉన్న కాసిపేట మండలం బెల్లంపల్లి నియోజకవర్గంలో విలీనమయ్యాయి. ఈ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సింగరేణి కార్మికులు అధికంగా ఉండటంతో మొదటిసారి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ ఎమ్మెల్యేగా మళ్లీ కార్మికులు, వారి కుటుంబాల మద్దతుతో గెలుపొందారు. ఇలా సీపీఐ విజయ పరంపర కొనసాగింది. 1999 సంవత్సరంలో పాటి సుభద్ర, 2004లో అమురాజుల శ్రీదేవి ఆసిఫాబాద్ నుంచి తెదేపా తరపున పోటీ చేసి గెలవడానికి కార్మికుల ఓట్లు కారణమయ్యాయి. 1978లో కాంగ్రెస్ అభ్యర్థిగా దాసరి నర్సయ్య సింగరేణి ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తిరిగి 1989లో పోటీ చేసిన దాసరి నర్సయ్య మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా బరిలో నిలిచిన దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2018లో పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఎవరు విజయం సాధించాలన్నా బెల్లంపల్లి పట్టణంలోని ఓట్లు కీలకం. అందులో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల ఓట్లు అధిక ప్రభావం చూపిస్తాయి.
భూగర్భగనుల మూత.. విభాగాల తరలింపుతో..
బెల్లంపల్లి పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక భూగర్భగనులు వాటికి అనుబంధంగా విభాగాలు కొనసాగేవి. 2003 వరకు బెల్లంపల్లి పట్టణంలో 30 వేలకు పైగా కార్మికులు వారి కుటుంబాలు నివసించేవారు. 2004 - 05 వరకు బెల్లంపల్లి ఏరియాలో ఉన్న అన్ని భూగర్భగనులు మూసివేస్తు వచ్చారు. దీంతో బెల్లంపల్లి పట్టణం ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది.
వ్యవసాయం.. సిమెంట్ కర్మాగారం
ఇక్కడ ప్రధానంగా సింగరేణితో పాటు దేవాపూర్ సిమెంట్ కర్మాగారం, వ్యవసాయరంగాలపై ఆధారపడి ఉంది. బెల్లంపల్లి, తాండూరు, కాసిపేట మండలాల్లో సింగరేణి కార్మికులుండగా నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో వ్యవసాయరంగం ఉంది. బెల్లంపల్లి, నెన్నెల మండలాల్లో ఎక్కువగా మామిడి పంటలు సాగుచేస్తారు. కాసిపేట మండలంలోని దేవాపూర్ గ్రామ శివారులోని గుట్టలు సిమెంట్ తయారీలో ముడిసరకైన సున్నపురాయి నిల్వలు గుర్తించారు. 1982లో ఓరియంట్ సిమెంట్ కర్మాగారాన్ని ప్రారంభించి సిమెంట్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఇప్పటికి నాలుగు యునిట్లతో ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ దేశంలోని పలురాష్ట్రాల నుంచి ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు.
దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి
అంబేడ్కర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతిష్ఠాత్మకం.. ఎంపీ స్థానం..
[ 09-05-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భాజపా, భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో త్రిముఖ పోటీ నెలకొంది. ఓట్లు చీల్చే పార్టీ ఏది? ఆ ఓట్లు ఏపార్టీకి మేలు చేకూరుస్తాయనే అంశం మూడు పార్టీల నేతలను అంతర్మథనానికి గురిచేస్తోంది. -
మూగజీవాల దాహం కేకలు
[ 09-05-2024]
మూగజీవాల దాహార్తి తీర్చాలని గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి నీటి తొట్టెలు నిర్మించింది. అధికారుల అవగాహన లోపం, పర్యవేక్షణ లేని కారణంగా గుత్తేదారులు -
భాజపాతోనే దేశానికి, ధర్మానికి రక్షణ
[ 09-05-2024]
‘రాహుల్ గాంధీ ప్రధాని అయితే దేశానికి, ధర్మానికి రక్షణ ఉంటుందా? ఒక్కసారి వినండి కాంగ్రెస్ ఓటు జిహాద్కు పాల్పడుతుంది. మనమంతా ఒక్కటి కావాలి’ అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
కొత్త రైస్ మిల్లులకు త్వరలో పచ్చజెండా?
[ 09-05-2024]
పత్తి పరిశ్రమకు పేరుగాంచిన ఆదిలాబాద్లో కొత్తగా రైస్ మిల్లుల ఏర్పాటు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో వరి సాగు అంతగా లేకున్నా ఈ పరిశ్రమలు ఎలా వస్తున్నాయనే సందేహాలు వ్యక్తమవుతుండగా మరోపక్క కొత్తగా అయిదు -
పంచాయతీ కార్యదర్శులు ఓటేశారు!
[ 09-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటు వేస్తామో.. లేదో? అన్న ఆందోళనలో ఉన్న పంచాయతీ కార్యదర్శులకు ఊరట లభించింది. వారికి పోస్టల్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. -
రైలు తలుపు.. మృత్యు పిలుపు
[ 09-05-2024]
కాగజ్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ మధ్య తరచూ రైల్వే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా రైళ్ల నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలై మృతిచెందుతున్నారు. బల్లార్ష-దిల్లీ మధ్య నిత్యం ప్రతి అరగంటకు ఒక ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు ప్రయాణిస్తుంటాయి. -
రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా సాగాల్సిన సమయమిది
[ 09-05-2024]
‘అధిక సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రమాదంలో పడుతున్న రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అంతా ఐక్యంగా సాగాల్సిన సమయం వచ్చిందని..’ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. -
వసతులు కరవు.. బతుకు బరువు!
[ 09-05-2024]
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో పాలకులదే ప్రధాన పాత్ర. అలాంటి వారిని ఎన్నుకునే బాధ్యత ప్రజలది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాలకులను ఎన్నుకుంటూ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. -
వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఓటేసే అవకాశం
[ 09-05-2024]
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గంలో ఈ నెల 13న నిర్వహించే ఎన్నికల కోసం అన్నీ సిద్ధం చేశామని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. -
ప్రాణాలు పోతున్నా పట్టింపు కరవాయే
[ 09-05-2024]
రైతులు తాము పండించిన పంటలు ఆరబెట్టుకునేందుకు ఉపాధి హామీ పథకంలో కల్లాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తున్నా వాటి గురించి అవగాహన లేకనో.. ఎవరు నిర్మించుకోవాలనే నిర్లక్ష్యమో తెలియదు కానీ రహదారులపైనే ఆరబెట్టుకోవడం పరిపాటిగా మారింది. -
వీరికి సార్వత్రిక సమరం.. వారిది ఆక్రమణల పర్వం
[ 09-05-2024]
బెల్లంపల్లి పట్టణంలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. కబ్జాలు చేయడానికి ఏ మాత్రం భయపడడం లేదు. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే పాగా వేస్తున్నారు. -
‘కార్పొరేట్ వ్యాపారి.. భూగర్భ కార్మికుడి మధ్య పోరు’
[ 09-05-2024]
తెలంగాణ ఉద్యమంలో ఎక్కడా కనిపించని కార్పొరేట్ వ్యాపారి గడ్డం వంశీకృష్ణకు సింగరేణి కార్మికుడిగా పని చేసిన తనకు మధ్య ఎన్నికల పోరులో ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భూమి ఇవ్వకపోతే.. చంపేయండి: మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..!
-
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!