ఓటర్ల జాబితా పరిశీలించండి
ఫొటో ఓటర్ల జాబితాల్లో డూప్లికేట్ నమోదులను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ రజింత్బాషా అధికారులకు సూచించారు. కలెక్టర్ బంగ్లాలో బుధవారం ఎన్నికల సహాయ
కలెక్టర్ రంజిత్బాషా
కలెక్టరేట్(మచిలీపట్నం), న్యూస్టుడే: ఫొటో ఓటర్ల జాబితాల్లో డూప్లికేట్ నమోదులను సమగ్రంగా పరిశీలించాలని కలెక్టర్ రజింత్బాషా అధికారులకు సూచించారు. కలెక్టర్ బంగ్లాలో బుధవారం ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికాలు,, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల తహసీల్దార్లు, ఎన్నికల డీటీలతో సమావేశమయ్యారు. ఒకే ఓటరు ఫొటోతో రెండు మూడు ఎంట్రీ(ఫొటో సిమిలర్ ఎంట్రీ)లపై సమీక్షించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో ఫొటో సిమిలర్ ఎంట్రీలు 73,353 ఉన్నట్లు గుర్తించిన విషయాన్ని ప్రస్తావించగా, వాటికి సంబంధించి నూరు శాతం పరిశీలన పూర్తయిందని అధికారులు కలెక్టర్కు వివరించారు. ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు కల్పించే విషయంలో నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. కొన్ని మండలాల్లో ఎలక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, కొన్ని చోట్ల పీడీఎస్ డీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న విషయం తెలుసుకుని వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లుకు సూచించారు. డీటీలకు పీడీఎస్ డీటీలుగా అదనపు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. బందరు, గుడివాడ ఆర్డీవోలు కిషోర్, పద్మావతి, ముడ వీసీ నారాయణరెడ్డి, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ హరనాథ్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.