TS News: విద్యుత్తు రీకనెక్షన్ తంటా.. రూ.75 చెల్లించేందుకు కార్యాలయానికి వెళ్లాల్సిందే
సికింద్రాబాద్కు చెందిన విద్యుత్తు వినియోగదారుడు ఒకరు సకాలంలో బిల్లు కట్టకపోవడంతో లైన్మైన్ వచ్చి కరెంట్ కనెక్షన్ తొలగించారు. అప్పటికప్పుడు ఆన్లైన్లో కరెంట్ బిల్లు చెల్లించి రీకనెన్షన్ ఇమ్మని కోరితే.. కార్యాలయానికి వచ్చి రూ.75 ఫీజు చెల్లిస్తేనే కనెక్షన్ ఇస్తామన్నారు.
సికింద్రాబాద్కు చెందిన విద్యుత్తు వినియోగదారుడు ఒకరు సకాలంలో బిల్లు కట్టకపోవడంతో లైన్మైన్ వచ్చి కరెంట్ కనెక్షన్ తొలగించారు. అప్పటికప్పుడు ఆన్లైన్లో కరెంట్ బిల్లు చెల్లించి రీకనెన్షన్ ఇమ్మని కోరితే.. కార్యాలయానికి వచ్చి రూ.75 ఫీజు చెల్లిస్తేనే కనెక్షన్ ఇస్తామన్నారు. ఇంట్లో కొవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్లు ఉన్నారు.. కార్యాలయం వరకు రాలేని పరిస్థితి ఉందని వివరించినా లైన్మెన్ ససేమిరా అన్నారు. రీకనెక్షన్ ఫీజును ఆన్లైన్లో కడదామని ప్రయత్నించగా.. ఇప్పటికీ ఆ సదుపాయం లేదని విద్యుత్తు అధికారులు తెలిపారు. ప్రతి నెలా లక్షల మంది వినియోగదారులు రీకనెక్షన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించే వెలుసుబాటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ కొత్త విద్యుత్తు కనెక్ష్షన్ మొదలు మీటర్ టెస్టింగ్ వరకు చాలా సేవలు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం కల్పించినప్పటికీ.. ఇప్పటికీ కొన్ని సేవలు ఆన్లైన్కు దూరంగా ఉన్నాయి. మరికొన్ని సేవలు ఆన్లైన్ చేసినా.. తరచూ సమస్యలతో వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా స్పందన ఉండటం లేదని వినియోగదారులు వాపోతున్నారు.
చిన్న మొత్తాలే.. పెద్ద కష్టాలు
సకాలంలో బిల్లులు చెల్లించక పోయినా.. ఇతరత్రా కారణాలతో ప్రతినెలా నగరంలో పెద్ద సంఖ్యలో సర్వీసు కనెన్షన్లను తొలగిస్తుంటారు. బకాయి పడిన బిల్లుతో పాటు అదనంగా రీకనెన్షన్ ఫీజు చెల్లిస్తే తిరిగి కనెన్షన్ను ఇస్తారు. ఆన్లైన్ చేయక ముందు కార్యాలయానికి వెళ్లి చెల్లించేవారు. కొందరేమో లైన్మెన్, ఆర్టిజన్లకు కట్టేయమనేవారు. ప్రస్తుతం 77 శాతం బిల్లులు ఆన్లైన్లో చేస్తున్నారు. రూ.75 రీకనెన్షన్ ఫీజు చెల్లింపు మాత్రం ఇప్పటికీ ఆన్లైన్ చేయలేదు. అది ఇప్పుడు పెద్ద సమస్యగా ఉంది. సిబ్బంది జేబుల పాలవుతోంది. చెక్ పెట్టాలంటే ఆన్లైన్ చెల్లింపునకు అవకాశం కల్పించాలి. అదనపు లోడు రికార్డైన వినియోగదారులకు డెవలప్మెంట్ ఛార్జీలు వేస్తున్నారు. ఆన్లైన్లో చెల్లిద్దామంటే టీఎస్ఎస్పీడీసీఎల్ వెబ్సైట్లో రావడం లేదు. దీన్ని పరిష్కరించాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.