‘రాజీవ్ స్వగృహ’ దరఖాస్తులకు నకిలీ నోట్ల బెడద
నగర శివారు బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ నివాసాల కొనుగోలు కోసం దరఖాస్తుకు చెల్లిస్తున్న నగదులో నకిలీ నోట్ల బెడద ఎక్కువైంది.
కేవలం ‘ఆన్లైన్’కే అవకాశం.. సర్వర్ మొరాయింపుతో అవస్థలు
బండ్లగూడ, న్యూస్టుడే: నగర శివారు బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ నివాసాల కొనుగోలు కోసం దరఖాస్తుకు చెల్లిస్తున్న నగదులో నకిలీ నోట్ల బెడద ఎక్కువైంది. గురువారం నుంచి నగదు చెల్లింపుతో దరఖాస్తు చేసుకునే విధానాన్ని రద్దు చేసి, కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు రూ.వెయ్యి నేరుగా లేదా ఆన్లైన్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. జూన్ 22న ఆన్లైన్ లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనేక మంది బండ్లగూడలోని స్వగృహ నివాసాలు చూసేందుకు వస్తున్నారు. అక్కడే ఉన్న కేంద్రంలో దరఖాస్తు నింపి నేరుగా రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. అలా వచ్చిన నగదును బ్యాంకుల్లో జమ చేసేందుకు వెళ్తే నిత్యం ఎన్నో కొన్ని నకిలీ నోట్లు బయటపడుతున్నట్లు కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టారు. ఒక్కసారిగా ఆన్లైన్ లావాదేవీలు పెరగడంతో సర్వర్లు మొరాయించి దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించినట్లు, ఖాతాల నుంచి బదిలీ అయినట్లు లబ్ధిదారుల ఫోన్లకు సందేశాలు వస్తున్నా.. స్వగృహ కార్పొరేషన్ ఖాతాకు జమ అయినట్లు చూపడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోర్టు కేసున్న భూమి పట్టా ఎలా మార్చారు?
[ 21-05-2024]
కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. -
పెట్టుబడులకు లాభాలంటూ మోసం
[ 21-05-2024]
ఆయుర్వేదిక్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు. -
వానమ్మా.. వానమ్మా ఈ కష్టాలు ఏంటమ్మా
[ 21-05-2024]
వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
కళాకారులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు
[ 21-05-2024]
కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్ కీర్తించారు. -
తెలుగు జాతీయతకు ప్రతీక ప్రకాశం పంతులు
[ 21-05-2024]
తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్బాబు కీర్తించారు. -
ఆధ్యాత్మికతకు పట్టం కట్టేలా అక్షరాలు
[ 21-05-2024]
త్యాగరాయ గానసభ నిర్వహణలో ఆధ్యాత్మికవేత్త పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘ఉగ్రం...వీరం’ గ్రంథావిష్కరణ సోమవారం రాత్రి జరిగింది. -
ప్రవాసాంధ్రుల ఆస్తుల రక్షణకు మంత్రి హామీ
[ 21-05-2024]
తెలంగాణలోని ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణను కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు వడ్డేపల్లి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 21-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్