తీగ తెగుతోంది.. ప్రాణం తీస్తోంది
ఇప్పటి వరకు నగరంలో రహదారి ప్రమాదాల్లోనే ప్రాణాలు ప్రజలు కోల్పోతున్నారు. ఇప్పుడు విద్యుత్తు సంస్థ నిర్లక్ష్యంతో రహదారిపై తీగలూ ప్రాణాలు తీస్తున్నాయి. విద్యుత్తు పంపిణీ సంస్థ లైన్ల ద్వారా కరెంట్ సరఫరా చేయడమే కాదు సురక్షితంగా నిర్వహించడమూ వారి బాధ్యతే. అత్యవసర సేవల పేరుతో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. రోడ్ కాంగ్రెస్ నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ఎత్తులో
రహదారి మధ్యలో, తక్కువ ఎత్తులో విద్యుత్తు లైన్లు
ఫిర్యాదు చేసినా తొలగించని వైనం
ఈనాడు, హైదరాబాద్; రాంనగర్, గౌతంనగర్, కుత్బుల్లాపూర్, న్యూస్టుడే: ఇప్పటి వరకు నగరంలో రహదారి ప్రమాదాల్లోనే ప్రాణాలు ప్రజలు కోల్పోతున్నారు. ఇప్పుడు విద్యుత్తు సంస్థ నిర్లక్ష్యంతో రహదారిపై తీగలూ ప్రాణాలు తీస్తున్నాయి. విద్యుత్తు పంపిణీ సంస్థ లైన్ల ద్వారా కరెంట్ సరఫరా చేయడమే కాదు సురక్షితంగా నిర్వహించడమూ వారి బాధ్యతే. అత్యవసర సేవల పేరుతో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. రోడ్ కాంగ్రెస్ నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ఎత్తులో ఇష్టారీతిగా రైట్ ఆఫ్ వే తీసుకుంటూ లైన్లను వేసిన ఫలితంగా తరచూ విద్యుత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తూ ఎక్కడైనా తీగలు తెగిపడితే లైన్లు ట్రిప్పయి సరఫరా ఆగిపోవాలి. కానీ బ్రేకర్లు పనిచేయక కరెంట్ తీగ తెగి పడినా విద్యుత్తు ప్రసరిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి భోలక్పూర్లో డీసీఎం వ్యాను తాకి కరెంట్ తీగలు తెగిపడటంతో అదే రహదారిలో వెనుక వస్తున్న బాలుడిపై పడటంతో అక్కడిక్కడే చనిపోయాడు. ఇలాంటి ప్రమాదాలు తరచూ సిటీలో జరుగుతున్నా డిస్కం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తోంది. డీఈ నుంచి ఎస్ఈ, సీజీఎం, డైరెక్టర్ల వరకు పెద్ద వ్యవస్థ ఉన్నా ప్రమాద ఘటనల అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన దాఖలాలే లేవు. కింది స్థాయి సిబ్బందికే పనులను పురమాయించి చేతులు దులుపుకొంటున్నారు.
* హెచ్ఎంటీ కాలనీలో 1967లో ఏర్పాటు చేసిన సుమారు 42 సిమెంటు విద్యుత్తు స్తంభాలకు పెచ్చులూడిపోయి ఇనుప చువ్వలు తేలాయి. బలంగా గాలివీస్తే అవి కూలిపోయే పరిస్థితి. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో 33 కేవీ విద్యుత్తు తీగ తెగి కింద పడటంతో అక్కడే ఆడుకుంటున్న ఓ బధిర బాలుడు దుర్మరణం చెందాడు.
* మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్నగర్ పదో నంబరు వీధిలో విద్యుత్తు స్తంభం రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా మారింది. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు గత నాలుగు విడతల పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేదు.
గ్రేటర్లోని పది సర్కిళ్ల పరిధిలో విస్తృతమైన విద్యుత్తు నెట్వర్క్ ఉంది. ఎల్టీ, 11కేవీ, 33కేవీ లైన్ల వరకు విద్యుత్తు పంపిణీ సంస్థ నిర్వహిస్తోంది. ప్రతి లైను విద్యుత్తు సంస్థ వేసినదే. కానీ కనీస ప్రమాణాలు పాటించడం లేదు. దీంతో రహదారి మధ్యలో, ఖాళీ స్థలం ఉంటే యాజమాని అక్కడ లేడని ఫ్లాట్ మధ్యలో లైన్లు వేస్తున్నారు. ఇటీవల ఎత్తైన స్తంభాలు వేస్తున్నారు కానీ గతంలో తక్కువ ఎత్తులో వేసిన స్తంభాలు, వాటి నుంచి వెళ్తున్న తీగలు వాహనాలకు తాకి తెగిపడుతున్నాయి. వీటిని పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించాల్సి ఉండగా స్థానికులు ఫిర్యాదులు చేసినా నిధులు లేవని పట్టించుకోవడం లేదు. ఇటీవలె పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తైంది. ఇందులో ఒకరోజు పవర్ డేగా నిర్వహిస్తున్నారు. దీన్ని సైతం మొక్కుబడిగా మార్చేశారు.
గతంలో ఘటనలు..
* ఏడాది క్రితం ఉప్పరపల్లి నుంచి హైదర్గూడ వెళ్లే రహదారిలో విద్యుత్తు స్తంభాన్ని టిప్పర్ ఢీకొనడంతో తీగలు తెగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. ఈ తరహా రహదారి మధ్యలో నగరంలో చాలా ప్రాంతాల్లో ఎల్టీ, 11కేవీ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి.
* రాంనగర్లో రెడ్కాన్వెంట్ ప్రాంతంలో నెల రోజుల క్రితం ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు వచ్చాయి. వేసవిలో ఓవర్ లోడ్తో విద్యుత్తు తీగ తెగి పడింది. అయినా లైన్ ట్రిప్ కాలేదు. రోజంతా తెగి పడిన తీగల్లో కరెంట్ పాసైంది. అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఏఈ క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రమాదం జరగకుండా నివరించగల్గారు.
* గతంలో కోదండరెడ్డినగర్లో ట్రాన్స్ఫార్మర్ వద్ద చెట్ల కొమ్మలు విరిగి కరెంట్ స్తంభాలపై పడటం.. లైన్లు ట్రిప్పుకాకపోవడంతో చుట్టుపక్కల 400 ఇళ్లలో విద్యుత్తు ఉపకరణాలు కాలిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది గంటలకే పార్కులకు తాళం
[ 20-05-2024]
విశ్రాంతి లేని నగరం హైదరాబాద్. ఎప్పుడు రోడ్డుపైకి వెళ్లినా వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. రాత్రి వేళల్లోనూ ఐటీకారిడార్, కొన్ని ప్రధాన రహదారులపై కార్యాలయాలు పనిచేస్తుంటాయి. -
కిలోమీటరున్నర పనులు.. నాలుగు నెలలు
[ 20-05-2024]
నగరంలో వానాకాలం ప్రారంభం నాటికే రహదారులు, భూగర్భ తవ్వకాల పనులు పూర్తి చేయాలి. లేదంటే వరదలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. -
రోజూ రూ.కోటిన్నర.. మరి నష్టాలెలా?
[ 20-05-2024]
హైదరాబాద్ మెట్రోలో సగటున ప్రతిరోజు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వారి నుంచి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థకు టికెట్ల ద్వారా రూ.కోటిన్నర ఆదాయం సమకూరుతోంది. -
కంటికి రెప్పలా.. కదిలారు
[ 20-05-2024]
పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్ రన్’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్ డీసీపీ డా.జి.వినీత్ ప్రారంభించారు. -
అసెంబ్లీకి ఓటెత్తి..లోక్ సభకు అనాసక్తి
[ 20-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..ప్రధాన పార్టీల అభ్యర్థులు అసెంబ్లీ సెగ్మెంట్లలో నమోదైన పోలింగ్ శాతాన్ని పోల్చుకుంటున్నారు. -
ఉద్యానాలు.. ఆక్రమించేశారు
[ 20-05-2024]
హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీకి చెందిన రూ.వంద కోట్ల విలువైన మూడెకరాల స్థలాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించేశారు. -
భూనిర్వాసితులను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
[ 20-05-2024]
అధిక వడ్డీల ఆశ చూపెట్టి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భూనిర్వాసితుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసంచేసిన ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్లపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని -
ప్రపంచంలోనే అరుదు.. బాంబే బ్లడ్ గ్రూపు
[ 20-05-2024]
బాంబే బ్లడ్ గ్రూప్ ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్ అని హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
స్పందనలో వేగం.. నష్టానికి కళ్లెం
[ 20-05-2024]
అగ్నిప్రమాదాల సమయంలో ‘తక్షణ ప్రతిస్పందన సమయం’ పెరగడంతో ఆస్తి నష్టం తగ్గుతోంది. ఫైరింజన్ వెళ్లడం కాస్త ఆలస్యమైనా కోట్లాది రూపాయల ఆస్తి కాలిబూడిదయ్యే ప్రమాదం ఉంది. -
బెట్టింగ్లతో అప్పులపాలై.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
[ 20-05-2024]
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడ్డ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఎంఎస్ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్
[ 20-05-2024]
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. -
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
[ 20-05-2024]
పీర్జాదిగూడ నగరంలో అవిశ్వాస తీర్మానంపై ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, భారాసలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పాటు బల నిరూపణకు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా సమన్వయకర్తగా అంబర్పేట జైస్వాల్ గార్డెన్కు చెందిన మధుసత్యం గౌడ్ నియమితులయ్యారు. -
ఎరువు.. కావాలి ఆదరువు
[ 20-05-2024]
పంచాయతీల్లో కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పల్లె పోరుకు కసరత్తు
[ 20-05-2024]
స్థానిక సమరానికి కసరత్తు ప్రారంభమైంది. పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘నేలబిడ్డల’పై.. నిప్పులు చిమ్మిన నింగి
[ 20-05-2024]
ప్రకృతితో మమేకమయ్యే హలధారి.. వానకు తడిసి.. ఎండకు ఎండి పంటే ప్రాణంగా ముందుకు ‘సాగు’తాడు. ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. -
కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ
[ 20-05-2024]
సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.