కేంద్రంలో కాంగ్రెస్కు అధికారం అసాధ్యం
లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదానే లేదని, ప్రస్తుతం 300 సీట్లలోకూడా పోటీ చేయని పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు.
హుజూరాబాద్ గ్రామీణం, పట్టణం, న్యూస్టుడే: లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదానే లేదని, ప్రస్తుతం 300 సీట్లలోకూడా పోటీ చేయని పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని బృందావన్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రికి రేవంత్రెడ్డి తన పదవి పోతుందనే భయంతోనే ప్రధాని మోదీని తిడుతున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అమలుకు భాజపా వ్యతిరేకం కాదని, కేవలం మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ఫోన్ ట్యాపింగ్ డబ్బులతో కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రూ.12 వేల కోట్లతో పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని వెల్లడించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావును ఆ పార్టీ నేతలే గుర్తు పట్టడం లేదన్నారు. మోదీ ప్రధానిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు ఇచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. కరీంనగర్లో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి సమ్మేళనం కార్యక్రమంలోనూ బండి సంజయ్ మాట్లాడారు. నిరుద్యోగుల కోసం కొట్లాడితే పేపర్ లీక్ చేశారని తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. దయచేసి పది రోజులు నాకోసం కష్టపడండి.. అయిదేళ్లు మీకోసం కష్టపడతా అని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు గౌతంరెడ్డి, రాజు, సంపత్రావు, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేనేం పాపం చేశానమ్మా!
[ 15-06-2024]
అమ్మా.. ఏడుస్తున్నావా! ఎందుకమ్మా రోదిస్తావ్.. నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా! తల్లి పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధ పడుతున్నావా.. అయినా.. ఏడ్చి ఏం సాధిస్తావమ్మా? -
వేగంగా.. పారదర్శకంగా..!
[ 15-06-2024]
గత సర్కారు హయాంలో ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం అమలు తీరు, మంచినీరు ఏ విధంగా అందుతుంది? జలాలపై ప్రజల అభిప్రాయ సేకరణకు ప్రస్తుత ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే చేయిస్తోంది. -
ప్రగతి చక్రానికి రథ సారథులు
[ 15-06-2024]
ఆర్టీసీ అనగానే టక్కున గుర్తుకొచ్చేది ప్రజా రవాణా వ్యవస్థ. అన్ని వర్గాల ప్రజలను బస్సుల్లో వారివారి గమ్యస్థానాలకు చేరవేస్తుంటుంది. వీటికి సారథులుగా వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులే కీలకపాత్ర పోషిస్తుంటారు. -
ఎవరికీ పట్టని వలస బతుకులు
[ 15-06-2024]
వలస కార్మికుల రక్షణకు పాలకులు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. క్షేత్ర స్థాయిలో అమలు చేయాల్సిన అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి -
సొంతింటి కల నెరవేరేదెన్నడో?
[ 15-06-2024]
పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు నిరాశే ఎదురైంది. -
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై సందిగ్ధం
[ 15-06-2024]
రామగుండం విద్యుత్తు కేంద్రం విస్తరణపై మరోసారి సందిగ్ధం నెలకొంది. మూకుమ్మడిగా అధికారులను యాదాద్రి విద్యుత్తు కేంద్రానికి డిప్యుటేషన్ కల్పిస్తూ ఆదేశాలు రావడంతో ఆందోళన నెలకొంది -
నిధులు చాలక... అంగన్వాడీ భవనాలు పూర్తికాక
[ 15-06-2024]
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆట, పాటలతో కూడిన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అయితే సొంత భవనాలు లేక చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు -
మురుగు శుద్ధి ఎప్పుడో?
[ 15-06-2024]
జిల్లా కేంద్రం.. సిరిసిల్ల పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జనావాసాలు, డైయింగ్ యూనిట్ల నుంచి నిత్యం 20 ఎంఎల్డీ (మిలియన్ లిక్విడ్ డిఛార్జి)లకు పైగా వ్యర్థ జలాలు నేరుగా మానేరు వాగులో కలుస్తున్నాయి -
జనజీవన స్రవంతిలోకి మావోయిస్టు దంపతులు
[ 15-06-2024]
మావోయిస్టు దంపతులు శుక్రవారం కరీంనగర్ సీపీ, వరంగల్ కమిషనరేట్ ఇన్ఛార్జి కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో జనజీవన స్రవంతిలో కలిశారు. కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు -
ద్విభాషా పుస్తకం.. అవగాహన సులభం
[ 15-06-2024]
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో ఉన్నతమైన బోధనను విద్యార్థులకు అందజేయాలన్న ఉద్దేశంతో మూడేళ్ల క్రితం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వం ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టింది. -
ఆలయ ఉద్యోగుల్లో బదిలీల గుబులు
[ 15-06-2024]
ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఆలయ ఉద్యోగులకు బదిలీల గుబులు పట్టుకుంది. దీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తున్న వారికి ఈసారి స్థానచలనం తప్పదని చెబుతున్నారు. -
అప్పు తీసుకున్న వారి వేధింపులు..మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
[ 15-06-2024]
అప్పు తీసుకున్న వ్యక్తులు తిరిగి చెల్లించకపోగా చంపుతామని బెదిరించడం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. -
హమ్మయ్య.. జీతాలు వచ్చాయి
[ 15-06-2024]
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పని చేస్తున్న 200 మంది నర్సింగ్ అధికారులకు ఎట్టకేలకు జీతాలు వచ్చాయి -
పూడిక తొలగింపుతోనే.. భవిష్యత్తుకు భరోసా
[ 15-06-2024]
శ్రీరాంసాగర్ జలాశయంలో పూడిక పేరుకుని నీటినిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు తగ్గినట్లు ఇటీవలే అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
అనుకుందే జరిగింది.. భారత్, కెనడా మ్యాచ్ రద్దు
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
-
పుణె కారు ప్రమాదం.. మైనర్కు బెయిల్ మంజూరులో లోపాలు!
-
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్ణయం