పర్యాయ ఘట్టానికి క్షణగణన
రెండేళ్లుగా కృష్ణ భక్తులు ఎదురుచూస్తున్న ఆ శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆ సమయం కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా పర్యాయ ఉత్సవానికి ఉడుపి పట్టణం లక్షల సంఖ్యలో భక్తులతో కిక్కిరిసి కనిపించేది. ప్రస్తుతం కరోనా కారణంగా అనేక ఆంక్షలు విధించడంతో
కాబోయే పర్యాయ మఠాధిపతి విద్యాసాగర తీర్థ చేతి నరాల్ని పరిశీలిస్తున్న ప్రస్తుత మఠాధిపతి ఈశప్రియతీర్థ
ఉడుపి, న్యూస్టుడే: రెండేళ్లుగా కృష్ణ భక్తులు ఎదురుచూస్తున్న ఆ శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆ సమయం కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా పర్యాయ ఉత్సవానికి ఉడుపి పట్టణం లక్షల సంఖ్యలో భక్తులతో కిక్కిరిసి కనిపించేది. ప్రస్తుతం కరోనా కారణంగా అనేక ఆంక్షలు విధించడంతో భక్తుల సంఖ్య తగ్గిపోయింది. వచ్చిన కొద్దిమంది భక్తులు పర్యాయ ముహూర్తం కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ఇప్పటి వరకు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సోమవారం అర్ధరాత్రి అనంతరం ఉడుపి పట్టణంలో పర్యాయ ఘట్టం ఆరంభమవుతుంది. కాబోయే పర్యాయ మఠాధిపతి అయిన కృష్ణాపుర మఠాధిపతి విద్యా సాగరతీర్థ ఉడుపి సమీపంలోని కాపు వద్ద దండి తీర్థంలో పుణ్యస్నానాలు చేసి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పట్టణ శివార్లలోని జోడుకట్టె చేరుకుంటారు. ఆ తరువాత సంప్రదాయం ప్రకారం ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు. ఆయనకు ప్రస్తుత పర్యాయ మఠాధిపతి ఈశప్రియతీర్థ అన్నం గరిటె, అక్షయ పాత్ర అందజేస్తారు. దీంతో పర్యాయ ఉత్సవంలో ప్రధాన ఘట్టం పూర్తవుతుంది. అక్షయపాత్ర, అన్నం గరిటె మధ్యాచార్యుడి కాలం నుంచి వస్తోంది. ఆయన తొలిసారిగా వీటిని తమ శిష్యుడికి అప్పగించారు. అప్పటి నుంచి ప్రతీ పర్యాయ సందర్భంలోనూ వీటిని కాబోయే పర్యాయ మఠాధిపతికి అందజేయడం సంప్రదాయంగా వస్తోంది. మధ్వాచార్యుడు ఆసీనులైన సర్వజ్ఞ పీఠంపై పర్యాయ మఠాధిపతి కూర్చుంటారు.
సర్వజ్ఞ పీఠం: మధ్వాచార్యుడు మఠం నిర్వహణ బాధ్యతలు చూసే స్థలమిది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిషత్తు పోరులోనూ కాసుల మాటే !
[ 19-05-2024]
విధానపరిషత్తు అంటే పెద్దలు చర్చించుకునే సభ! ప్రభుత్వాలు రూపొందించే బిల్లులు మేధావుల చర్చల తర్వాతనే గవర్నర్ చెంతకు చేరుతాయి. -
ప్రజ్వల్ తప్పించుకోలేడు
[ 19-05-2024]
మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ అభిప్రాయపడ్డారు. -
ఇస్రో.. ఉద్యోగావకాశాల గని!
[ 19-05-2024]
ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయాలు సాధిస్తోంది. -
ప్రధాని వ్యాఖ్యలు షాకిచ్చాయి
[ 19-05-2024]
మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించటం వల్ల మెట్రోకు నష్టం వాటిల్లుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు షాక్కు గురి చేశాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘డీకేపై అర్థరహిత ఆరోపణలు’
[ 19-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన పెన్డ్రైవ్ పంపిణీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి పాత్ర ఉందంటూ చెబితే రూ.100 కోట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆశ చూపించారంటూ భాజపా నేత దేవరాజేగౌడ -
ఆటవిడుపు
[ 19-05-2024]
నిత్యం సభలు, సమావేశాలు, పర్యటనలతో గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు శనివారం తీరక చేసుకున్నారు. -
‘ఐస్క్రీమ్ మ్యాన్’ ఇకలేరు
[ 19-05-2024]
ఐస్క్రీముల రాజధాని మంగళూరులో ‘ఐస్క్రీమ్ మ్యాన్’గా గుర్తింపు దక్కించుకున్న రఘునందన్ కామత్ (70) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న బస్సు
[ 19-05-2024]
ట్రాక్టర్ను బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు హులిగమ్మ భక్తులు దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!