పర్యాయ ఘట్టానికి క్షణగణన
రెండేళ్లుగా కృష్ణ భక్తులు ఎదురుచూస్తున్న ఆ శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆ సమయం కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా పర్యాయ ఉత్సవానికి ఉడుపి పట్టణం లక్షల సంఖ్యలో భక్తులతో కిక్కిరిసి కనిపించేది. ప్రస్తుతం కరోనా కారణంగా అనేక ఆంక్షలు విధించడంతో
కాబోయే పర్యాయ మఠాధిపతి విద్యాసాగర తీర్థ చేతి నరాల్ని పరిశీలిస్తున్న ప్రస్తుత మఠాధిపతి ఈశప్రియతీర్థ
ఉడుపి, న్యూస్టుడే: రెండేళ్లుగా కృష్ణ భక్తులు ఎదురుచూస్తున్న ఆ శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. ఆ సమయం కోసం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాధారణంగా పర్యాయ ఉత్సవానికి ఉడుపి పట్టణం లక్షల సంఖ్యలో భక్తులతో కిక్కిరిసి కనిపించేది. ప్రస్తుతం కరోనా కారణంగా అనేక ఆంక్షలు విధించడంతో భక్తుల సంఖ్య తగ్గిపోయింది. వచ్చిన కొద్దిమంది భక్తులు పర్యాయ ముహూర్తం కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. ఇప్పటి వరకు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సోమవారం అర్ధరాత్రి అనంతరం ఉడుపి పట్టణంలో పర్యాయ ఘట్టం ఆరంభమవుతుంది. కాబోయే పర్యాయ మఠాధిపతి అయిన కృష్ణాపుర మఠాధిపతి విద్యా సాగరతీర్థ ఉడుపి సమీపంలోని కాపు వద్ద దండి తీర్థంలో పుణ్యస్నానాలు చేసి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పట్టణ శివార్లలోని జోడుకట్టె చేరుకుంటారు. ఆ తరువాత సంప్రదాయం ప్రకారం ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు. ఆయనకు ప్రస్తుత పర్యాయ మఠాధిపతి ఈశప్రియతీర్థ అన్నం గరిటె, అక్షయ పాత్ర అందజేస్తారు. దీంతో పర్యాయ ఉత్సవంలో ప్రధాన ఘట్టం పూర్తవుతుంది. అక్షయపాత్ర, అన్నం గరిటె మధ్యాచార్యుడి కాలం నుంచి వస్తోంది. ఆయన తొలిసారిగా వీటిని తమ శిష్యుడికి అప్పగించారు. అప్పటి నుంచి ప్రతీ పర్యాయ సందర్భంలోనూ వీటిని కాబోయే పర్యాయ మఠాధిపతికి అందజేయడం సంప్రదాయంగా వస్తోంది. మధ్వాచార్యుడు ఆసీనులైన సర్వజ్ఞ పీఠంపై పర్యాయ మఠాధిపతి కూర్చుంటారు.
సర్వజ్ఞ పీఠం: మధ్వాచార్యుడు మఠం నిర్వహణ బాధ్యతలు చూసే స్థలమిది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలివిడతకు ఎండపోటు
[ 08-05-2024]
కన్నడనాట ఎన్నికల ఘట్టాన్ని సూర్యదేవుడు వెంటాడాడు. తొలి విడతను మించి.. గ్రామీణ ప్రాంతాలున్న ఉత్తర కర్ణాటకలో- మలివిడతలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందనుకుంటే ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ప్రస్తావనార్హం. -
పెన్డ్రైవ్ల వెనుక సిద్ధు సర్కారు
[ 08-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియో కేసును కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా మార్చుకుందని జనతాదళ్ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. -
ఓటంటేనే వారికి ప్రాణం!
[ 08-05-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హిక్కద్ కురువె కాళీనది మధ్య ఒక ద్వీపంలో ఉంటుంది. అక్కడ పోలింగ్ బూత్ లేకపోవడంతో గ్రామస్థులు బోటు ఎక్కి అంకోలాకు వచ్చి తమ హక్కు వినియోగించుకున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
[ 08-05-2024]
హాసన లైంగిక వేధింపుల కేసులో కీలకమైన పెన్డ్రైవ్ వ్యవహారంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న భాజపా నేత దేవరాజేగౌడను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ రేస్కోర్సు రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. -
ఓటరు దేవుడు.. మొండికేశాడు
[ 08-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొదటి విడతలో 69 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ విడత పూర్తి గ్రామీణ ప్రాంతాలున్నా.. -
ఓటంటేనే ఓ వేడుక!
[ 08-05-2024]
ఓ వైపు ఎండలు.. మరో వైపు ఎన్నికల్లో ఓటేయాల్సిన బాధ్యత. ఈ రెండింటితో బాధ్యతతోనే ముందడుగు వేశారు మహిళలు, యువకులు, కొత్త ఓటర్లు! -
ఆసాంతం.. ప్రశాంతం
[ 08-05-2024]
బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నిక సోమవారం ఉదయం సజావుగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు వారంతా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. -
అక్క ఇంట్లో చెల్లి చోరీ!
[ 08-05-2024]
సొంత సోదరి ఇంట్లో నగదు, బంగారు నగలు చోరీ చేసిన చెల్లి- లగ్గెరె నివాసి ఉమాను కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.51.90 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ దయానంద్ విలేకర్లకు వివరించారు. -
తలుపులు వేసుకుని..
[ 08-05-2024]
హుబ్బళ్లిలోని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం తలుపులు వేసుకుని భోజనం చేశారు. -
అడ్డగోలుగా గర్భవిచ్ఛితి
[ 08-05-2024]
పాండవపుర ఆరోగ్య శాఖ వసతి గృహాల సముదాయంలో లభించిన పిండాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కుమారస్వామే: డీకే శివకుమార్
-
ప్లేఆఫ్స్ బెర్తుల్లో 2 ఫిక్స్.. మిగిలిన రెండింటి కోసం నాలుగు పోటీ
-
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కొట్టేసిన క్యాట్
-
రోజంతా ఒడుదుడుకుల్లో సూచీలు.. చివరికి ఫ్లాట్గా
-
‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
-
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్