బెంగళూరుపై నిర్లక్ష్య మేఘం
బెంగళూరు ఇప్పుడు వానలంటే హడలెత్తే పరిస్థితి. మేఘావృతమైతే చాలు నగరవాసి బెంబేలెత్తుతున్నాడు.. నగరంలో మౌలిక సదుపాయాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలకు కొదవే లేదు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం నగర సదుపాయాలను సాకుగా చేసుకుని
సమాంతర మురుగు కాల్వలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి
ఈనాడు, బెంగళూరు: బెంగళూరు ఇప్పుడు వానలంటే హడలెత్తే పరిస్థితి. మేఘావృతమైతే చాలు నగరవాసి బెంబేలెత్తుతున్నాడు.. నగరంలో మౌలిక సదుపాయాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలకు కొదవే లేదు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం నగర సదుపాయాలను సాకుగా చేసుకుని రాజకీయ విమర్శలు దిగిన సందర్భాలెన్నో. ఇన్ని విమర్శలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీల తీరుపై నగరవాసులను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. గత మే నెల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగర మురుగునీటి వ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పరంపర కొనసాగుతోంది. ఆగస్టు 1 నుంచి 5 వరకు నగరంలో కురిసిన వర్షాలతో మరోమారు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏటేటా వర్షాలకు మురుగు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని తెలిసినా బీబీఎంపీ ఏమాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బెంగళూరు రెయిన్స్ అట్ బీబీఎంపీకామ్’ ట్యాగ్లైన్తో నెటిజెన్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఆ హామీలేమైనట్లు?
నగర మురుగు కాలువల మరమ్మతులు, మురుగు ప్రవాహ సామర్థ్యం (ఎంఎల్డీ)ను పెంచేందుకు బీబీఎంపీ కోట్లాది రూపాయలు అట్టిపెడుతోంది. వాస్తవానికి బెంగళూరులో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక మురుగు నీటి వ్యవస్థ సామార్థ్యానికి మించిన మురుగు నీరు, వ్యర్థం వర్షాకాలంలో తయారవుతోంది. వృషభావతి కాల్వలో పేరుకున్న కాలుష్య, చెరువుల ఆక్రమణల కారణంగా నగరంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ద్వితీయ, తృతీయ మరుగు కాల్వలను ఏర్పాటు చేయాలని బీబీఎంపీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు గత మే నెలలో ముఖ్యమంత్రి బొమ్మై కూడా రూ.1,600 కోట్లను విడుదల చేశారు. ఇందులో రూ.400 కోట్లను ద్వితీయ, తృతీయ కాల్వల వ్యవస్థకు ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. ఆగస్టు నాటికి ఆ తాలూకా ప్రాథమిక స్థాయి పనులు కూడా మొదలు కాలేదన్న ఆరోపణలు నగరానికి చెందిన సివిక్ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
బెళ్లందూరు వద్ద పూడికను తొలగిస్తున్న క్రేన్లు
అటకెక్కిన 800 కి.మీ.ల ప్రణాళిక
బెంగళూరు నగర పరిధిలో 800 కి.మీ.ల వరకు ద్వితీయ మురుగు నీటి వ్యవస్థ, వ్యర్థాన్ని తొలగింపు (ఎస్టీపీ) పనులు చేపట్టేందుకు రూ.83 కోట్లను బీబీఎంపీ విడుదల చేసింది. హెబ్బాళ, మహాలక్ష్మి లేఅవుట్, బెళ్లందూరు పరిసరాల్లో ఈ పనులు మొదలైనా దాదాపు 15 రోజుల తర్వాత ఈ పనులు నిలిచిపోయాయి. మే నెలల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ పనులు నిలిచిపోయినట్లు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. ఈ నిధులు కేటాయించి ఏడాది ముగిసినా వాటి పనులు మొదలైంది గత మే నెలలో అంటూ బీప్యాక్ సంస్థ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక మురుగు నీటి వ్యవస్థ సామర్థ్యాన్ని 60 ఎంఎల్డీ నుంచి 100 ఎంఎల్డీకి పెంచాలన్న నిర్ణయం కూడా అమలుకు నోచుకోలేదని వీరి వాదన. ఈ పనుల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని కేఆర్ పురం, సి.వి.రామన్ నగర్, సర్జాపుర రహదారి, మహాలక్ష్మి లేఅవుట్, మారతహళ్లి, మహదేవపుర, హెబ్బాళ పరిసరాల్లో వాననీరు ఇళ్ల సముదాయాల్లోకి వచ్చి చేరుతోందని బెంగళూరు రెయిన్స్ అడ్మిన్లు ఆరోపిస్తున్నారు.
మరో వారం రోజులు
బెంగళూరు నగరంలో మార్చి నుంచి ఆగస్టు 5 నాటికి కురిసిన వర్షాలు ఏడాది వర్షపాతాన్ని మించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాస్తవానికి అక్టోబరు, నవంబరులో కురిసే వర్షాలతో కలిపి ఏడాదిలో 1,500 మి.మీ.ల వర్షపాతం నమోదవుతుంది. ఆగస్టు 5 నాటికి బెంగళూరులో 946 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. గతేడాది 1,500 మి.మీ, 2020లో 1,200 మి.మీ, 2019లో 900 మి.మీ వార్షిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికే 950 మి.మీల నమోదవటంతో త్వరలో వార్షిక వర్షపాతం సగటును మించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఆగస్టులోనే గత ఐదేళ్లలో కురవనంత వర్షం ఈ ఏడాది కురిసింది. ఆగస్టు 4 నాటికి 65 మి.మీల వర్షపాతం నమోదు కాగా, 2017లోనే అత్యధికంగా 128.7 మి.మీల అత్యధికంగా నమోదైంది. ఇంకా వర్షాలు కొనసాగుతుండటంతో ఈ రికార్డును కూడా ఛేదించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.