బెంగళూరుపై నిర్లక్ష్య మేఘం
బెంగళూరు ఇప్పుడు వానలంటే హడలెత్తే పరిస్థితి. మేఘావృతమైతే చాలు నగరవాసి బెంబేలెత్తుతున్నాడు.. నగరంలో మౌలిక సదుపాయాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలకు కొదవే లేదు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం నగర సదుపాయాలను సాకుగా చేసుకుని
సమాంతర మురుగు కాల్వలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి
ఈనాడు, బెంగళూరు: బెంగళూరు ఇప్పుడు వానలంటే హడలెత్తే పరిస్థితి. మేఘావృతమైతే చాలు నగరవాసి బెంబేలెత్తుతున్నాడు.. నగరంలో మౌలిక సదుపాయాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలకు కొదవే లేదు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం నగర సదుపాయాలను సాకుగా చేసుకుని రాజకీయ విమర్శలు దిగిన సందర్భాలెన్నో. ఇన్ని విమర్శలు ఎదురైనా రాష్ట్ర ప్రభుత్వం, బీబీఎంపీల తీరుపై నగరవాసులను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. గత మే నెల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగర మురుగునీటి వ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో పోస్టుల పరంపర కొనసాగుతోంది. ఆగస్టు 1 నుంచి 5 వరకు నగరంలో కురిసిన వర్షాలతో మరోమారు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏటేటా వర్షాలకు మురుగు నీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని తెలిసినా బీబీఎంపీ ఏమాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బెంగళూరు రెయిన్స్ అట్ బీబీఎంపీకామ్’ ట్యాగ్లైన్తో నెటిజెన్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఆ హామీలేమైనట్లు?
నగర మురుగు కాలువల మరమ్మతులు, మురుగు ప్రవాహ సామర్థ్యం (ఎంఎల్డీ)ను పెంచేందుకు బీబీఎంపీ కోట్లాది రూపాయలు అట్టిపెడుతోంది. వాస్తవానికి బెంగళూరులో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక మురుగు నీటి వ్యవస్థ సామార్థ్యానికి మించిన మురుగు నీరు, వ్యర్థం వర్షాకాలంలో తయారవుతోంది. వృషభావతి కాల్వలో పేరుకున్న కాలుష్య, చెరువుల ఆక్రమణల కారణంగా నగరంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ద్వితీయ, తృతీయ మరుగు కాల్వలను ఏర్పాటు చేయాలని బీబీఎంపీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకు గత మే నెలలో ముఖ్యమంత్రి బొమ్మై కూడా రూ.1,600 కోట్లను విడుదల చేశారు. ఇందులో రూ.400 కోట్లను ద్వితీయ, తృతీయ కాల్వల వ్యవస్థకు ప్రత్యేకంగా కేటాయించాలని సూచించారు. ఆగస్టు నాటికి ఆ తాలూకా ప్రాథమిక స్థాయి పనులు కూడా మొదలు కాలేదన్న ఆరోపణలు నగరానికి చెందిన సివిక్ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
బెళ్లందూరు వద్ద పూడికను తొలగిస్తున్న క్రేన్లు
అటకెక్కిన 800 కి.మీ.ల ప్రణాళిక
బెంగళూరు నగర పరిధిలో 800 కి.మీ.ల వరకు ద్వితీయ మురుగు నీటి వ్యవస్థ, వ్యర్థాన్ని తొలగింపు (ఎస్టీపీ) పనులు చేపట్టేందుకు రూ.83 కోట్లను బీబీఎంపీ విడుదల చేసింది. హెబ్బాళ, మహాలక్ష్మి లేఅవుట్, బెళ్లందూరు పరిసరాల్లో ఈ పనులు మొదలైనా దాదాపు 15 రోజుల తర్వాత ఈ పనులు నిలిచిపోయాయి. మే నెలల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ పనులు నిలిచిపోయినట్లు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు. ఈ నిధులు కేటాయించి ఏడాది ముగిసినా వాటి పనులు మొదలైంది గత మే నెలలో అంటూ బీప్యాక్ సంస్థ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక మురుగు నీటి వ్యవస్థ సామర్థ్యాన్ని 60 ఎంఎల్డీ నుంచి 100 ఎంఎల్డీకి పెంచాలన్న నిర్ణయం కూడా అమలుకు నోచుకోలేదని వీరి వాదన. ఈ పనుల నిర్లక్ష్యం కారణంగా నగరంలోని కేఆర్ పురం, సి.వి.రామన్ నగర్, సర్జాపుర రహదారి, మహాలక్ష్మి లేఅవుట్, మారతహళ్లి, మహదేవపుర, హెబ్బాళ పరిసరాల్లో వాననీరు ఇళ్ల సముదాయాల్లోకి వచ్చి చేరుతోందని బెంగళూరు రెయిన్స్ అడ్మిన్లు ఆరోపిస్తున్నారు.
మరో వారం రోజులు
బెంగళూరు నగరంలో మార్చి నుంచి ఆగస్టు 5 నాటికి కురిసిన వర్షాలు ఏడాది వర్షపాతాన్ని మించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాస్తవానికి అక్టోబరు, నవంబరులో కురిసే వర్షాలతో కలిపి ఏడాదిలో 1,500 మి.మీ.ల వర్షపాతం నమోదవుతుంది. ఆగస్టు 5 నాటికి బెంగళూరులో 946 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. గతేడాది 1,500 మి.మీ, 2020లో 1,200 మి.మీ, 2019లో 900 మి.మీ వార్షిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటికే 950 మి.మీల నమోదవటంతో త్వరలో వార్షిక వర్షపాతం సగటును మించే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఆగస్టులోనే గత ఐదేళ్లలో కురవనంత వర్షం ఈ ఏడాది కురిసింది. ఆగస్టు 4 నాటికి 65 మి.మీల వర్షపాతం నమోదు కాగా, 2017లోనే అత్యధికంగా 128.7 మి.మీల అత్యధికంగా నమోదైంది. ఇంకా వర్షాలు కొనసాగుతుండటంతో ఈ రికార్డును కూడా ఛేదించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలివిడతకు ఎండపోటు
[ 08-05-2024]
కన్నడనాట ఎన్నికల ఘట్టాన్ని సూర్యదేవుడు వెంటాడాడు. తొలి విడతను మించి.. గ్రామీణ ప్రాంతాలున్న ఉత్తర కర్ణాటకలో- మలివిడతలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందనుకుంటే ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ప్రస్తావనార్హం. -
పెన్డ్రైవ్ల వెనుక సిద్ధు సర్కారు
[ 08-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియో కేసును కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా మార్చుకుందని జనతాదళ్ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. -
ఓటంటేనే వారికి ప్రాణం!
[ 08-05-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హిక్కద్ కురువె కాళీనది మధ్య ఒక ద్వీపంలో ఉంటుంది. అక్కడ పోలింగ్ బూత్ లేకపోవడంతో గ్రామస్థులు బోటు ఎక్కి అంకోలాకు వచ్చి తమ హక్కు వినియోగించుకున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
[ 08-05-2024]
హాసన లైంగిక వేధింపుల కేసులో కీలకమైన పెన్డ్రైవ్ వ్యవహారంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న భాజపా నేత దేవరాజేగౌడను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ రేస్కోర్సు రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. -
ఓటరు దేవుడు.. మొండికేశాడు
[ 08-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొదటి విడతలో 69 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ విడత పూర్తి గ్రామీణ ప్రాంతాలున్నా.. -
ఓటంటేనే ఓ వేడుక!
[ 08-05-2024]
ఓ వైపు ఎండలు.. మరో వైపు ఎన్నికల్లో ఓటేయాల్సిన బాధ్యత. ఈ రెండింటితో బాధ్యతతోనే ముందడుగు వేశారు మహిళలు, యువకులు, కొత్త ఓటర్లు! -
ఆసాంతం.. ప్రశాంతం
[ 08-05-2024]
బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నిక సోమవారం ఉదయం సజావుగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు వారంతా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. -
అక్క ఇంట్లో చెల్లి చోరీ!
[ 08-05-2024]
సొంత సోదరి ఇంట్లో నగదు, బంగారు నగలు చోరీ చేసిన చెల్లి- లగ్గెరె నివాసి ఉమాను కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.51.90 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ దయానంద్ విలేకర్లకు వివరించారు. -
తలుపులు వేసుకుని..
[ 08-05-2024]
హుబ్బళ్లిలోని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం తలుపులు వేసుకుని భోజనం చేశారు. -
అడ్డగోలుగా గర్భవిచ్ఛితి
[ 08-05-2024]
పాండవపుర ఆరోగ్య శాఖ వసతి గృహాల సముదాయంలో లభించిన పిండాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కేజీఎఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!