HD Kumaraswamy: మా కుటుంబంలో చీలికకు ‘శకుని’ యత్నం: కుమారస్వామి
తమ కుటుంబంలో చీలికలు తెచ్చేందుకు ఓ ‘శకుని’ ప్రయత్నిస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ధ్వజమెత్తారు. తన భార్య భవానీకి హాసన నుంచి టికెట్ ఇవ్వకపోతే ఆ స్థానంతో పాటు, హొళెనరసీపుర నుంచి తనకు టికెట్ ఇవ్వాలని తన సోదరుడు హెచ్డీ రేవణ్ణ కోరిన విషయం తనకు తెలియదన్నారు. హాసన నుంచి పోటీకి తన వదిన భవానీ ఏడాదిన్నర కిందటే కోరగా నిరాకరించానని చెప్పారు.
నిప్పులు చెరిగిన కుమార
హుబ్బళ్లి, న్యూస్టుడే : తమ కుటుంబంలో చీలికలు తెచ్చేందుకు ఓ ‘శకుని’ ప్రయత్నిస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ధ్వజమెత్తారు. తన భార్య భవానీకి హాసన నుంచి టికెట్ ఇవ్వకపోతే ఆ స్థానంతో పాటు, హొళెనరసీపుర నుంచి తనకు టికెట్ ఇవ్వాలని తన సోదరుడు హెచ్డీ రేవణ్ణ కోరిన విషయం తనకు తెలియదన్నారు. హాసన నుంచి పోటీకి తన వదిన భవానీ ఏడాదిన్నర కిందటే కోరగా నిరాకరించానని చెప్పారు. హాసన నుంచి పార్టీ కార్యకర్త స్వరూప్ను పోటీకి దించుతామని స్పష్టం చేశారు. హుబ్బళ్లిలోని సిద్ధారూఢ మఠానికి ఆయన మంగళవారం వచ్చారు. అనంతరం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు.
స్వరూప్ నిజాయతీపరుడైన కార్యకర్త అని అభివర్ణించారు. మహాభారతంలో ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో సోదరుడు హెచ్డీ రేవణ్ణ పక్కన చేరి ఆయనకు బ్రెయిన్ వాష్ చేస్తున్న శకునులు ఎవరో తనకు తెలుసన్నారు. తన తండ్రి దేవేగౌడ కూడా తన సోదరుడి మనసు మార్చలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. భవానీకి గతంలో జిల్లా పంచాయతి సభ్యురాలిగా అవకాశం ఇచ్చామని ప్రజ్వల్కు లోక్సభ సభ్యునిగా, మరో కుమారుడు సూరజ్కు ఎమ్మెల్సీగా, రేవణ్ణకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. అభిమానులు, శ్రేయోభిలాషుల పేరిట బయటి వ్యక్తులే తమ కుటుంబంలో చిచ్చు పెడుతూ, హాసన సీటు కోసం పట్టుబట్టాలని రేవణ్ణకు నూరిపోస్తున్నారని విమర్శించారు. మా కుటుంబ ప్రతిష్ఠను దిగజార్చేందుకే బయటి వ్యక్తులు ఇలా చేస్తున్నారని ఆక్రోశించారు.
హాసన టికెట్ కేటాయింపు అంశంలో దేవేగౌడదే తుది నిర్ణయమని చెప్పారు. భార్యను పోటీ నుంచి విరమించుకోవాలని చెప్పేందుకు తన అన్న భయపడుతున్నట్లు ఉందన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు నేను రోజుకు 17 గంటలు శ్రమిస్తున్నానని తెలిపారు. హాసన టికెట్ ఖరారు కాకపోవడంతోనే జాబితా విడుదలలో జాప్యం జరిగిందన్నారు. బుధవారం సాయంత్రానికి తమ రెండో జాబితాను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. మాజీ ప్రధాని దేవేగౌడ ఈ నెల 22 నుంచి కొన్ని నియోజకవర్గాలలో ప్రచారాన్ని చేస్తారని కుమారస్వామి ప్రకటించారు. రాజకీయాలకు అతీతంగా రేవణ్ణ, సిద్ధరామయ్య ఇద్దరూ మంచి స్నేహితులు. సిద్ధరామయ్యను ఉద్దేశించే శకుని అని కుమారస్వామి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకుల అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివరామయ్యల జయకేతనం
[ 20-05-2024]
కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఏడాది పూర్తి కానుంది. లోక్సభ ఎన్నికల నియమావళి జారీలో ఉండడంతో వార్షికోత్సవ నిర్వహణ, సాధన సమావేశాన్ని నిర్వహించడం సాధ్యం కావడం లేదు. -
ప్చ్.. కానరాని ప్రజ్వల్ జాడ
[ 20-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన అనంతరం డిప్లమ్యాటిక్ పాస్పోర్టుతో గత నెల 26న జర్మనీకి వెళ్లిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను భారత్కు తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేశారు. -
హోం శాఖను హైజాక్ చేశారు
[ 20-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు మూసి వేసేందుకు సిట్ సన్నాహాలు చేసుకుంటోందని విపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తే తమకు ముప్పు వాటిల్లుతుందని కొందరు మంత్రులు గుర్తించారని పేర్కొన్నారు. హోం శాఖను ఎవరో హైజాక్ చేయడంతో, ప్రభుత్వమే నిందితుని స్థానంలో నిలబడిందని వ్యాఖ్యానించారు. -
కొండకోనల్లో ఎన్నెన్నో అందాలు
[ 20-05-2024]
వానలు ప్రారంభం కావడంతో బండీపుర జాతీయ ఉద్యానవన అందాల వీక్షణకు పర్యాటకులు మునిగాళ్లపై నిలిచారు. వేసవి సెలవులు ఇంకా కొనసాగుతున్న క్రమంలో కుటుంబ సమేతంగా తరలివచ్చే వారు పెరుగుతున్నారు. -
వంతెనపై జాలీ రైడ్
[ 20-05-2024]
యలహంక ఉపరితల వంతెనపై తన స్నేహితురాలిని బైకు ముందు భాగంలోని పెట్రోల్ ట్యాంకుపై కూర్చోబెట్టుకుని ఒక యువకుడు బైకుపై జాలీరైడ్కు వెళ్లాడు. -
నకిలీ సిమ్కార్డులతో సైబర్ నేరాలు
[ 20-05-2024]
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజుల జాగారం
[ 20-05-2024]
తల్లి చనిపోయిందన్న అవగాహన లేకుండా శవం పక్కనే ఒక మహిళ నాలుగు రోజులు జాగారం చేసిన ఘటన ఇది. వారి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. -
యశోద ఆత్మహత్యాయత్నం
[ 20-05-2024]
తన అక్క అంజలి అంబిగేర హత్యకు గురి కావడంతో వ్యధకు గురైన ఆమె సోదరి యశోద శనివారం రాత్రి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తక్షణమే ఆమెను చికిత్స కోసం కిమ్స్లో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె కోలుకుంది. -
ఆకట్టుకున్న దేశీయ బియ్యం మేళా
[ 20-05-2024]
కనుమరుగైపోతున్న వడ్ల రకాలు, బియ్యాన్ని, ఇతర దేశవాళీ విత్తనాలను నంజరాజ బహద్దూరు ఛత్రంలో శనివారం ప్రదర్శించారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రదర్శన, విక్రయాలు కొనసాగాయి. కొన్ని దశాబ్దాల నుంచి మార్కెట్లో విక్రయానికి రాని బియ్యం, వడ్లను రైతులు మేళాకు తీసుకు వచ్చారు. -
పోలీసులను బెదిరించిన భాజపా ఎమ్మెల్యే
[ 20-05-2024]
అక్రమ క్వారీయింగ్ను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ భాజపా ఎమ్మెల్యే హరీశ్ పూంజా బెళ్తంగడి ఠాణాకు శనివారం రాత్రి వచ్చారు. మీరు నా వాహనాలను, నా మనుషులను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను బెదిరించారు.