శిబిరాల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: హరీశ్రావు
కంటివెలుగు శిబిరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్, వైద్యసిబ్బందిని మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, పాలనాధికారి, జిల్లా వైద్యాధికారి
సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: కంటివెలుగు శిబిరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్, వైద్యసిబ్బందిని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. దగ్గరిచూపు కళ్లద్దాలు అవసరమయ్యే వారికి వెంటనే అందజేయాలని సూచించారు. పట్టణంలోని 43వ వార్డు బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి హాజరైన వృద్ధులు, మహిళలను శిబిరం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంతమందికి పరీక్షలు చేశారని, కళ్లద్దాలు ఎంతమందికి పంపిణీ చేశారనే వివరాలను సిబ్బంది ద్వారా ఆరా తీశారు. మంత్రి వెంట మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, జిల్లా పాలనాధికారి ప్రశాంత్జీవన్ పాటిల్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, సుడా ఛైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి ఉన్నారు.
పనుల్లో వేగం పెరగాలి
సిద్దిపేట: జిల్లా సమగ్ర ప్రగతిలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్, ర.భ. శాఖ ఈఈ సుదర్శన్రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి సిద్దిపేట, గజ్వేల్ అభివృద్ధి పనులపై సమీక్షించారు. సిద్దిపేట రింగు రోడ్డు నిర్మాణం తీరుపై ఆరా తీశారు. మార్చిలోపు పూర్తి చేయాలన్నారు. సిద్దిపేట నుంచి ఎన్సాన్పల్లికి రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని, వేగిరం చేయాలన్నారు. వెటర్నరీ కళాశాల అడ్మిషన్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు ఫోన్లో సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుణాగ్రహం.. అతలాకుతలం
[ 20-05-2024]
పలు మండలాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పంటలు నీటిపాలయ్యాయి. చాలామంది అన్నదాతలు నష్టపోయారు. ధాన్యం నీటిపాలు కావడంతో పెట్టిన పెట్టుబడులూ వచ్చేలా లేవని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
భారమైన అద్దెలు.. కనిపించని వసతులు
[ 20-05-2024]
జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పలు సమస్యల మధ్య కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు. నెలనెలా అద్దెలు రాకపోవడంతో ఆయా భవనాల యజమానులు ఖాళీ చేయాలని పట్టుబడుతున్నారు. -
ఏకరూపం.. ఆలస్యం
[ 20-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా ఏకరూప దుస్తులు ఇస్తున్నారు. బడుల ప్రారంభం నాటికే రెండు జతలు పంపిణీ చేయాల్సి ఉన్నా ఏటా ఆలస్యమవుతోంది. -
ఒత్తిడితో జయించు.. ప్రణాళికతో సాధించు!
[ 20-05-2024]
సిద్దిపేటకు చెందిన ఓ విద్యార్థి హైదరాబాద్లోని కళాశాలలో ఇంటర్ చదివారు. ఒకదాంట్లో అనుత్తీర్ణుడవగా తల్లిదండ్రులు మందలించారు. దీంతో పది రోజుల పాటు అతడు ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా వింతగా ప్రవర్తించాడు. -
తీరు మారదు.. కాలుష్యం వదలదు!
[ 20-05-2024]
కాలుష్య నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వృథా ప్రయాసే అవుతోంది. గతేడాది జిన్నారం మండలం గడ్డపోతారం, ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని 15 పరిశ్రమలు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో రూ.10 లక్షలకు తక్కువ కాకుండా బ్యాంకు గ్యారంటీలను జప్తు చేశారు. -
బడులకు భద్రతేది?
[ 20-05-2024]
జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇది. గతంలో నిర్మించిన ప్రహరీ శిథిలమై కూలిపోయింది. పునర్నిర్మించక పోవడంతో పాఠశాలకు, ఆవరణలోని మొక్కలకు రక్షణ కరవైంది. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 20-05-2024]
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఓబీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపల్లి పాండు డిమాండ్ చేశారు. -
సీసీఎస్ సీఐ సస్పెన్షన్
[ 20-05-2024]
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. -
వారధి.. పనులు నెమ్మది
[ 20-05-2024]
ప్రయాణికుల రాకపోకల కష్టాలు తీర్చడానికి నిర్మిస్తున్న వారధి పనుల్లో జాప్యంతో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పడం లేదు. జహీరాబాద్ పట్టణంతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతీసారి 15-20 నిమిషాలు గేటు వద్ద ఆగాల్సి వస్తోంది. -
నాసి విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం: సీపీ
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ బి.అనూరాధ అన్నారు. విత్తన అక్రమార్కులపై పీడీ చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. -
ఎట్టకేలకు ఖాతాల్లో బిల్లుల జమ
[ 20-05-2024]
గత మూడేళ్లుగా పెండింగులో ఉన్న వ్యక్తిగత శౌచాలయాల బిల్లుల చెల్లింపుకు మోక్షం లభించింది. ఎట్టకేలకు వాటి బిల్లులు విడుదల చేయడమే కాకుండా నేరుగా లబ్దీదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. -
అర్బన్ పార్కు.. సందడిగా తిరుగు
[ 20-05-2024]
కొండపాక మండలం మర్పడ్గ గ్రామ శివారులో రాజీవ్ రహదారి పక్కన 210 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటైన తేజోవనం అటవీ అర్బన్ పార్కు కళకళలాడుతూ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది.