పట్టణ చూపు.. ప్రగతి వైపు
నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జూన్ 3 నుంచి 18 వరకు 15 రోజుల పాటు అన్ని పురపాలికల్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు
జూన్ 3 నుంచి 18 వరకు నాలుగో విడత కార్యక్రమం
పట్టణ ప్రగతి కార్యక్రమంపై ఇటీవల మిర్యాలగూడలో సమీక్ష చేస్తున్న
పురపాలిక సంచాలకుడు ఎన్.సత్యనారాయణ
మిర్యాలగూడ, న్యూస్టుడే: నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జూన్ 3 నుంచి 18 వరకు 15 రోజుల పాటు అన్ని పురపాలికల్లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆ శాఖ సంచాలకుడు డాక్టర్ ఎన్.సత్యనారాయణ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. పురపాలిక అధికారులతో పాటుగా పాలకవర్గం ఛైర్మన్లు పట్టణ ప్రగతి కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం తరువాత పురపాలక సంఘాల అధ్యక్షులు, అధికారులను మధ్యప్రదేశ్లోని ఇండోర్ పర్యటనకు విడతల వారీగా పంపాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా ఐదు అంశాలపై పట్టణ ప్రగతి కార్యక్రమంలో దృష్టి సారించాలని కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పురపాలికల అధికారులు పట్టణ ప్రగతికి ముందస్తు సన్నాహాలు చేస్తున్నారు. ప్రత్యేకించి గ్రీన్ బడ్జెట్ను పురపాలికల బడ్జెట్లకు అనుగుణంగా ఖర్చు చేసేందుకు కమిషనర్లు, పర్యావరణ ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా పురపాలికలను పరిశీలించాలని ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో సూచించారు. నిధులు ఉండి వ్యయం చేయకపోతే చర్యలు తీసుకుంటారనే భయంతో అధికారులు ముమ్మరంగా పనులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలో పనులు ప్రారంభం: రవీందర్సాగర్, కమిషనర్, మిర్యాలగూడ
నిబంధనల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. సమీకృత మార్కెట్ నిర్మాణానికి స్థలం కేటాయించగా.. అనుమతులు లభించాయి. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తాం.
వెజ్, నాన్వెజ్ మార్కెట్
పట్టణాల్లో ఒకే చోట కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లు ఉండేలా సమీకృత మార్కెట్ల నిర్మాణాలు జరపాలని ఆదేశించారు. దీనికి అవసరమైన స్థలాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. స్థల కేటాయింపులో సమస్యలు ఉంటే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులు ప్రారంభిస్తారు.
హరితహారం
పురపాలికల్లో హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పురపాలికల బడ్జెట్లో పదిశాతం గ్రీన్ బడ్జెట్కు కేటాయించగా.. దీన్ని పూర్తిగా ఖర్చుచేయాలని ఆదేశించారు. పట్టణాల్లోని వార్డుల్లో సాధ్యమైనంత వరకు నర్సరీలు ఏర్పాటు చేస్తారు. బృహత్ పట్టణ ప్రకృతివనాల పెంపునకు అవసరమైన స్థలాలు గుర్తించి ముందస్తు సన్నాహాలు చేయాలని సూచించారు. పట్టణ శివారు ప్రాంతాల్లో, వీధుల్లో అవసరమైన ప్రాంతాలను గుర్తించి మొక్కలు నాటించాలి.
వైకుంఠధామాల నిర్మాణం
పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణాలను ఆక్టోబర్ నాటికి పూర్తిచేయాలని సూచించారు. నిర్మాణాలు పూర్తయిన వాటిని జిల్లా అదనపు కలెక్టర్, ఇతర అధికారులు సౌకర్యాలను పరిశీలిస్తారు. మిషన్ భగీరథ నీరు వైకుంఠధామాలకు నిత్యం సరఫరా అయ్యేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
సామూహిక మరుగుదొడ్లు
అన్ని పురపాలికల్లో సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణాలను పూర్తిచేయాలని ఆదేశించారు. బహిరంగ మల, మూత్ర విసర్జనరహిత పట్టణాలుగా ప్రకటించే లక్ష్యంతో పనిచేయటంతో పాటు మరమ్మతులకు గురైన సామూహిక మరుగుదొడ్లను పనిచేసేలా చూస్తారు.
పరమపద వాహనాల ఏర్పాటు
పట్టణాల్లో చనిపోయిన వారి మృతదేహాల తరలింపునకు పురపాలిక సంఘం తరఫున పరమపద వాహనాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నూతనంగా అవసరమైన వాహనాలను కొనుగోలు చేసి పట్టణాల్లో ఎవరు మృతిచెందినా అంత్యక్రియలకు పంపాలని ఆదేశించారు. వాహనాల పర్యవేక్షణకు సిబ్బందిని నియమించాలి.
గ్రామీణ క్రీడా ప్రాంగణాలు
పట్టణంలోని ఆయా వార్డుల్లో చిన్నారులు ఆడుకునేందుకు ఆటస్థలాలను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలను ‘ఏ ప్లేస్ టు ప్లే’ పేరుతో శుభ్రం చేయించాలని ఆదేశించారు. వార్డు స్థాయి క్రీడా కమిటీలను ఏర్పాటు చేసి వారితో క్రీడల నిర్వహణ చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రిలో స్వామి అలంకార వేడుకలు
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీనరసింహస్వామి వారి వార్షిక జయంత్యుత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి అలంకార వాహన సేవోత్సవాన్ని నిర్వహించారు. -
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలి
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
[ 20-05-2024]
ఎం.ఎల్.సి ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లకు, టీములకు సూచించారు. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల