మూడుముళ్లకు వేళాయె..!
మూడు నెలల తర్వాత ముహూర్తాలు వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లి సందడి నెలకొంది. వచ్చే నెల 3 నుంచి శుభగడియలు ప్రారంభం కానున్నాయి.
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే: మూడు నెలల తర్వాత ముహూర్తాలు వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లి సందడి నెలకొంది. వచ్చే నెల 3 నుంచి శుభగడియలు ప్రారంభం కానున్నాయి. మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న పెళ్లిళ్లపై అన్ని రంగాల వారు ఆశలు పెట్టుకున్నారు. డిసెంబరు 1వ తేది నుంచి శుక్రమూఢం తొలగిపోనుంది. 3, 4, 7, 9, 14, 16, 17, 18, తేదీల్లో వివాహాలకు దివ్య ముహూర్తాలుగా వేద పండితులు చెబుతున్నారు. వివాహాలకు, శుభకార్యాలకు నిర్వాహకులు అనేక మంది ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఫంక్షన్హాళ్లను బుక్ చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లిళ్లు నిర్ణయించుకునేవారికి పట్టణాల్లో ఫంక్షన్ హాళ్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారు వివాహాలను దేవాలయాలు, ఇళ్ల వద్ద జరుపుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. గత మూడు నెలల నుంచి ముహూర్తాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడిన ఫంక్షన్హాళ్ల నిర్వాహకులు ప్రస్తుతం వచ్చే గడియలతో కొంత ఊరట చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు వందలకు పైగా కల్యాణ మండపాలు ఉన్నాయి.
ఫంక్షన్హాల్లో పెళ్లి పందిరి
ముద్రణ రంగం, కల్యాణ మండపాలు, అలంకరణ, పూల వ్యాపారులు, క్యాటరింగ్ వంటచేసేవారు, ఫొటో, వీడియో గ్రాఫర్లు ముందస్తుగా ఆర్డర్లు తీసుకుంటున్నారు. ప్రధానంగా నిర్వహణ, క్లీనింగ్ తదితర పనులపై ఆధారపడ్డ వేల మంది దినసరి కూలీలకు గత మూడు నెలలు గడ్డుకాలంగా మారింది. మరో అయిదు రోజుల్లో పెళ్లిళ్లు ప్రారంభం కానుండటంతో అన్ని రంగాలవారు ఆనందపడుతున్నారు.
పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి
- రాఘవరెడ్డి, ఫంక్షన్హాల్ నిర్వాహకుడు
వచ్చే నెలలో జరిగే పెళ్లిళ్లకు దాదాపు ఫంక్షన్హాళ్లు ముందస్తుగా బుకింగ్ అయ్యాయి. మూడు నెలల నుంచి ఫంక్షన్హాళ్లలో చిన్న చిన్న కార్యక్రమాలు తప్ప ఆడంబరమైన కార్యక్రమాలు జరగలేదు. ప్రస్తుతం వచ్చే నెలలో కూడా ఎనమిది ముహూర్తాలే ఉన్నాయని నిర్వాహకులు ముందస్తుగానే బుక్ చేసుకున్నారు. ఆదాయం కొంత ఆశాజనకంగా ఉంది.
అధికసంఖ్యలో వివాహాలు
-ఫణికుమార్, అర్చకులు
వచ్చే నెల 19 తర్వాత నెల రోజుల పాటు ముహూర్తాలు లేవు. ఆ తర్వాత మాఘం, పాల్గుణ మాసాల్లో ఉన్నాయి. దీంతో మార్గశిర మాసంలోనే శుభకార్యాలు ముగించుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. మూడు నెలల నుంచి శుభగడియలు లేకపోవడంతో వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కానున్న ముహూర్తాలను నిర్వాహకులు నిర్ణయించుకుంటున్నారు. దీంతో అధిక సంఖ్యలో వివాహాలు జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రిలో స్వామి అలంకార వేడుకలు
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీనరసింహస్వామి వారి వార్షిక జయంత్యుత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి అలంకార వాహన సేవోత్సవాన్ని నిర్వహించారు. -
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలి
[ 20-05-2024]
నకిలీ విత్తనాలు అరికట్టడంలో డీలర్లు సహకరించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు. -
ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి
[ 20-05-2024]
ఎం.ఎల్.సి ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లకు, టీములకు సూచించారు. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
[ 20-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో నారసింహుడు జయంత్యుత్సవాలు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా సోమవారం ఉదయం మొదలయ్యాయి. -
నాడు మిత్రులు నేడు ప్రత్యర్థులు.. ఆసక్తికరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోరు
[ 20-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసన మండలి(ఎమ్మెల్సీ) నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక జరగనుంది. -
గృహజ్యోతిపై భానుడి ప్రతాపం
[ 20-05-2024]
భానుడు గత పది సంవత్సరాల ఉష్ణోగ్రత రికార్డును అధిగమించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. -
డిగ్రీ విద్యార్థులకు దోస్త్
[ 20-05-2024]
ఇంటర్లో ఆయా కోర్సులు పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది చేరేది డిగ్రీ. తెలంగాణ ప్రభుత్వం కొన్నేళ్లుగా డిగ్రీలో ప్రవేశాలకు ‘డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) వెబ్సైట్’ను ప్రారంభించింది. -
మరోసారి గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్
[ 20-05-2024]
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కీలకమైందని, పట్టభద్రులు విజ్ఞతతో ఓటేసి నిజాయతీ గల భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని శాసన మండలికి పంపాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. -
దర్జీగా.. ఇక దర్జాగా..!
[ 20-05-2024]
మహిళలు ఆర్థిక సాధికారత పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ బడులు మహిళలకు అప్పగించింది. -
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు
[ 20-05-2024]
రాష్ట్రానికి ఈ సారి ముందస్తుగా రుతు పవనాలు చేరుకుంటాయని, వర్షాలు కూడా గత ఏడాది కంటే ఎక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. -
పట్టభద్రుల ఉప ఎన్నికకు రంగం సిద్ధం
[ 20-05-2024]
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. -
పదికి సంసిద్ధత
[ 20-05-2024]
తొమ్మిదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను రాబోయే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదో తరగతికి సంసిద్ధులను చేస్తోంది జిల్లా విద్యాశాఖ. -
అరచేతిలో పుస్తక ప్రపంచం
[ 20-05-2024]
పిల్లల్లో పఠనాసక్తిని పెంచేందుకు లిటరసీ క్లౌడ్ కార్యక్రమాన్ని విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. -
మోదీ పాలనలో కుంభకోణాలు లేవు: ఈటల
[ 20-05-2024]
భాజపా పదేళ్ల పాలనలో దేశంలో ఎలాంటి కుంభకోణాలు లేకుండా మోదీ పరిపాలించారని మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి: మంత్రి ఉత్తమ్
[ 20-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
ఎర్లీబర్డ్తో ఖజానాకు కాసులు
[ 20-05-2024]
పురపాలికల్లో ఆస్తి పన్ను వసూళ్లు పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
[ 20-05-2024]
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. ట్రోలింగ్తో వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’