వేదన వినండి
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కలెక్టరేట్కు వచ్చి తమ వేదన వినిపించుకుంటే పరిష్కారం లభిస్తుందన్న ఆశ. సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో కనిపించిన కొంతమందిని పలకరించినపుడు తమ ఆవేదన వినిపించారు
- ఈనాడు, ఒంగోలు
ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య. కలెక్టరేట్కు వచ్చి తమ వేదన వినిపించుకుంటే పరిష్కారం లభిస్తుందన్న ఆశ. సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో కనిపించిన కొంతమందిని పలకరించినపుడు తమ ఆవేదన వినిపించారు
చక్రాల కుర్చీలో స్పందన భవన్కు వస్తున్న యాకూబ్
మర్రిపూడి మండలం యల్లంపల్లికి చెందిన యాకూబ్ బెంగళూరులో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన ప్రమాదంతో నడవలేని స్థితికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోరుతూ ఇప్పటికి పది దఫాలు స్పందనకు వచ్చి వినతులు అందించారు. తనకు వచ్చే పింఛనుతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, రేషన్ బియ్యమే ఆధారమన్నారు. తనకు సాయం కోరుతూ మరో దఫా వినతి ఇచ్చారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధ దంపతుల పేర్లు కాశింపీరా, ఖాదర్బి. వీరిది కంభం మండలం కందులాపురం. 1994లో గ్రామంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం బతుకుదెరువు కోసం కర్నాటక వలస వెళ్లారు. వీరు స్థానికంగా లేకపోవడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించేశాడని వీరు వాపోయారు. మండల అధికారులు, పోలీసులను కలిసి తమ సమస్యపై పలు దఫాలు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో సోమవారం కలెక్టర్ను కలిసి అర్జీ అందించారు.
ఏడాదిగా వేతనాలు లేవు
కలెక్టర్కు సమస్యలు వివరిస్తున్న ఎఫ్ఎన్ఓలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పారిశుద్ధ్య కార్మికులుగా, కాపలాదారులుగా, వైద్యులకు సహాయకులుగా (ఎఫ్ఎన్ఓలు) దాదాపు వందమంది పనిచేస్తున్నారు. ‘ఆప్కాస్’ కింద ఒప్పంద ఉద్యోగులుగా ప్రభుత్వం వీరిని నియమించింది. అందరికీ వ్యక్తిగత గుర్తింపు కార్డులూ మంజూరు చేశారు. 60 మందికి మాత్రమే ప్రతీ నెలా వేతనాలు వస్తున్నాయి. మిగిలిన 40 మందికి గత ఏడాదిగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలూ వీరి కుటుంబ సభ్యులకు వర్తించకుండా పోయాయి. కలెక్టర్ దినేష్కుమార్ను కలిసి వారంతా తమ గోడు విన్నవించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆటల్లోనూ జగన్నాటకం.. వేసవిలో కనిపించని క్రీడా శిబిరాలు
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది. -
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే