భయం వద్దు.. ఆకాశమే హద్దు!
పరీక్షల కాలం.. విద్యార్థుల్లో భయం.. చదివిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయో..రావో వచ్చినా రాయగలుగుతామో.. లేదోనంటూ ఆందోళన.. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యల వైపు పయనం.
పరీక్షల కాలం.. విద్యార్థుల్లో భయం.. చదివిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయో..రావో వచ్చినా రాయగలుగుతామో.. లేదోనంటూ ఆందోళన.. దీంతో మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యల వైపు పయనం. తమ చదువు తల్లిదండ్రులకు ఆర్థికభారం కావొద్దనే ఆలోచనతో బలవన్మరణాలకు తెగబడుతున్న దారుణం. మార్కులు, ర్యాంకులే చదువు కాదని.. విద్యతో కలిగే ప్రయోజనం, చదువులో వెనకబడినా.. జీవితంలో విజయం సాధించిన వారి స్ఫూర్తిగాథలతో పిల్లల్లో ధైర్యం నింపాలి. భయం వీడితే జయం మీదేనంటూ తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రోత్సహించాలి.
ఈనాడు, మహబూబాబాద్
ఏటా పరీక్షలు బాగా రాయలేకపోయామని ఇంటర్, పది విద్యార్థులు చేసుకుంటున్న ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చరణ్తేజ్ వార్షిక పరీక్షల ఒత్తిడి కారణంగానే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటర్లో వారికి ఇష్టమున్న గ్రూప్లో చేరనివ్వకుండా తల్లిదండ్రులు తమకు ఇష్టమైన కోర్సుల్లో చేర్పిస్తారు. అది విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తోంది. ఎంపీసీ గ్రూప్ చదివితే.. మంచి ర్యాంక్ సాధించి ఐఐటీలో చేరొచ్చని, బైపీసీ ఎంచుకుంటే నీట్లో మంచి ర్యాంకు వచ్చి డాక్టర్ కావచ్చని పిల్లలపై తమ ఇష్టాలను తల్లిదండ్రులు రుద్దుతుంటారు. ఆ కోర్సులు ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రులకు చెప్పలేక ఒత్తిడితో అయిష్టంగానే చదువుతుంటారు. ఇలాంటి వారు మార్కులు తెచ్చుకోలేక ఆత్మనూన్యత భావంతో ఆత్మహత్య చేసుకోవాలనే అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంటున్నారు.
బంధువుల పిల్లలు మంచి స్థానంలో ఉన్నారంటూ..వారిని ప్రేరణగా తీసుకోవాలని సూచిస్తూ ఒత్తిడి తేవడం. తరగతి గదుల్లోనూ అంతర్గత పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఉపాధ్యాయులు, అధ్యాపకులు భయపెట్టడంతో వార్షిక పరీక్షల సమయంలో తెలియకుండానే ఆందోళన, ఒత్తిడికి లోనవుతున్నారు. తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక పోతున్నామనే మనోవేదనకు లోనై చావే పరిష్కారం అన్న తీవ్ర నిర్ణయం తీసుకుంటారు.
ఇలా చేద్దాం
చదువు విషయంలో తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాల ప్రకారం నడుచుకోవాలి. వారు ఎలాంటి కోర్సులో చేరాలనుకుంటున్నారో.. దాని ప్రయోజనాలు, చదవగల సామర్థ్యాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి.
పరీక్షల్లో వచ్చిన మార్కుల గురించి ఆలోచించకుండా పిల్లల్లోని ఇతర నైపుణ్యాలను మెచ్చుకోవడం వల్ల వారిలో మంచి మార్పు వస్తుంది. ః విద్యార్థుల్లో ఉన్న భయాన్ని, ఆందోళనని పారదోలుతూ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చినా మరో మార్గాన్ని ఎంచుకోవచ్చంటూ భరోసా కల్పించాలి.
ఇవి గమనించాలి: ఆత్మహత్య చేసుకోవాలనుకునే విద్యార్థులు ఒంటరిగా ఉంటారు. భోజనం చేసేటప్పుడు కూడా ఆందోళనతో దిగాలుగా ఉంటారు. చదివే సమయంలో డల్గా ఉంటారు. తోటి స్నేహితులకూ దూరంగా ఉంటారు.ఈ లక్షణాలు గమనించి ఆ ఆలోచనల నుంచి దృష్టి మళ్లించాలి.
గతంలోని సంఘటనలు
- 2023 మేలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన తేజావత్ సింధు ఇంటర్ వృత్తి విద్య ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంది.
- 2023 ఏప్రిల్ 11న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడగుట్టతండాకు చెందిన గుగులోతు కృష్ణ నీట్ రాసినా సీటు రాదనే ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వీరే స్ఫూర్తి
ఐఏఎస్ అధికారి అంజుశర్మ పదో తరగతిలో, ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. అయినా కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసంతో చదువుకున్న ఆమె ఆ తరువాత ఐఏఎస్ అధికారిగా అయ్యారు.
ఆపిల్ ఫోన్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్ కూడా కళాశాలలో డ్రాప్ విద్యార్థి. అయినా ఆయన మనోవేదనకు గురికాలేదు. ఆయన ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరు.
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత తనకు ఇష్టమైన క్రికెట్ను కెరీర్గా ఎంచుకుని ఆ వైపుగా ఎదిగారు. క్రికెట్ దేవుడు అనే పేరు తెచ్చుకున్నారు.
ఓడిన చోటే గెలుపు సాధించాలి : బరుపాటి గోపి, సైకాలజిస్టు, వరంగల్
పరీక్షలను పాజిటివ్ ఆలోచనలతో రాయాలి. భయాన్ని వీడి ఇష్టంతో చదివితే గుర్తుంటాయి. తల్లిదండ్రులు కూడా చదవటం లేదని..నిరాశకు గురిచేయకుండా బాగా చదువుతావంటూ ప్రోత్సహించాలి. ఓడిన చోటనే గెలుపును సాధించాలి. ఎందరో జీవితగాథలను చెప్పి వారిలో స్ఫూర్తి నింపాలి
ఇంటర్, డిగ్రీలో తప్పాను: గండ్రాతి సతీష్, ఎస్సై, నర్సింహులపేట
ఇంటర్లో సప్లిమెంటరీ రాసి పాసయ్యాను. డిగ్రీలోనూ రెండు సార్లు ఫెయిలయ్యా. మనోధైర్యం కోల్పోకూడదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో డిగ్రీ పాసయ్యా. సర్కారు కొలువు సాధనే లక్ష్యంతో మొదటిసారి ఎస్సై ఉద్యోగానికి పరీక్ష రాస్తే అవకాశం రాలేదు. ఇతర కొలువులు వచ్చినా ఎస్సై పరీక్ష రాసిఅనుకున్నది సాధించా.
న్యూస్టుడే, నర్సింహులపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షణకవచ్ ప్రశ్నార్థకం!
[ 18-06-2024]
‘‘రెండు రైళ్లు ఒకే పట్టాల మీదకు వచ్చినప్పుడు.. వాటికవే గుర్తించి వెంటనే వేగం తగ్గించుకొని నిలిచిపోయే ‘కవచ్ వ్యవస్థ’ ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది.. సోమవారం ·బెంగాల్లో ఒకే పట్టాల మీదకు రెండు రైళ్లు రావడంతో ఘోరం జరిగింది. -
కదలని చెత్త.. తీరని చింత
[ 18-06-2024]
బల్దియాలో చెత్త చింత తీరడం లేదు. ఇంటింటా సేకరించిన చెత్త, ప్రధాన, అంతర్గత రహదారుల్లో పోగవుతున్న వ్యర్థాలను డంప్ చేయడం అధికారులకు సవాల్గా మారింది. రాంపూర్ డంపింగ్యార్డు వ్యర్థాలతో నిండిపోయింది. -
అధికారులకు చెప్పినా.. ఆగని మట్టి తరలింపు
[ 18-06-2024]
వర్ధన్నపేట శివారులోని అక్కకుంట, ఉప్పరపల్లి గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో ఆదివారం రాత్రి నుంచి ఇటుకల బట్టి వ్యాపారులు వందల సంఖ్యలో టిప్పర్లలో మట్టి తరలించారు. -
అంగన్వాడీ.. గాడిన పడేలా!
[ 18-06-2024]
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు లబ్ధిదారులకు సక్రమంగా చేరడం లేదనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారికే అందించేలా ప్రభుత్వం అంగన్వాడీల ఆధ్వర్యంలో నేషనల్ న్యూట్రీషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టం(ఎన్హెచ్టీఎస్) అనే ప్రత్యేక యాప్ ద్వారా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి
[ 18-06-2024]
పెళ్లి చేసుకుందామనుకున్న ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. -
బడి బస్సులపై నిఘా!
[ 18-06-2024]
జిల్లా ఆర్టీఏ అధికారులు, సిబ్బంది మొత్తం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను తీసుకువెళ్లే ప్రైవేట్ బస్సులపై నిఘా పెట్టారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీ చేయడం ప్రారంభించారు. -
విద్యుత్తు సమస్యలపై.. ప్రజా‘వాణి’ విన్నారు!
[ 18-06-2024]
క్షేత్రస్థాయిలో నివాస, వ్యవసాయ, పరిశ్రమలకు సరఫరా చేస్తున్న విద్యుత్తుపరంగా ఎదురవుతున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపుతూ.. వినియోగదారులకు చేరువయ్యేందుకు తెలంగాణ ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎన్పీడీసీఎల్) ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన విద్యుత్తు ప్రజావాణికి తొలివారమే ఆశించిన స్పందన లభించింది. -
పర్యావరణ పరిరక్షణకు ఎకోక్లబ్
[ 18-06-2024]
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత తదితర విషయాలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 15 నుంచి 24 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ దిశానిర్దేశం చేసింది. -
సంత.. సౌకర్యాల చింత
[ 18-06-2024]
ఉమ్మడి జిల్లాలోనే పాలకుర్తిలో సోమవారం నిర్వహించే సంతకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. మేలైన మేకలు, గొర్రెలతోపాటు పాడి పశువులు, గెదేలు విరివిగా లభిస్తాయని నమ్మకం. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి కొనుగోళ్లకు వస్తుంటారు. -
ఆక్రమించి.. చదును చేసి!
[ 18-06-2024]
ఇక్కడ కనిపిస్తున్న భూమి గణపురం మండలం ధర్మరావుపేటలోని ఊరచెరువు శిఖం భూమి. ఇందులో సుమారు 30 ఎకరాలను కొంత మంది చదును చేసి వ్యవసాయ భూమిగా మార్చి పట్టా చేసుకోవడానికి ప్రయత్నం చేయడంతో గ్రామస్థులు నిరసన చేపట్టారు. -
వయోపరిమితి పెంపు... పెరగనున్న ప్రయోజనం
[ 18-06-2024]
సింగరేణిలో వయోపరిమితి పెంపుతో వారసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారిలో హర్షం వ్యక్తమవుతోంది. సింగరేణి వ్యాప్తంగా 300 మందికి పైగా వారసులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఏర్పడింది. -
గడువు పొడిగించినా.. పనులు పూర్తయ్యేనా.?
[ 18-06-2024]
మహబూబాబాద్లో ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. వైద్య కళాశాలలో తరగతులు ప్రారంభమై రెండేళ్లుపూర్తయి మూడో విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలకు సమయం సమీపిస్తున్నా ఈ భవన నిర్మాణాలు మాత్రం ముందుకు కదలడం లేదు. -
రుణమాఫీ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు
[ 18-06-2024]
ఆగస్టులో ప్రభుత్వం రూ.2 లక్షల రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేయనుందని...ఆగస్టు నుంచి జనవరి మధ్య స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ చెప్పారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పోలవరాన్ని జగన్ అధోగతి పాల్జేశారు: ఎమ్మెల్సీ అనురాధ
-
5 రోజుల వ్యవధిలో 3 మ్యాచ్లు.. భారత్ కెప్టెన్ రోహిత్ కీలక వ్యాఖ్యలు
-
డిప్యూటీ సీఎం పవన్కు అమరావతిలో ఘనస్వాగతం
-
భారత్కు గూగుల్ జెమిని యాప్.. తెలుగుతో సహా 9 భాషల్లో అందుబాటులోకి!
-
‘0.001% నిర్లక్ష్యం ఉన్నా’.. నీట్ వివాదంపై ‘సుప్రీం’ సీరియస్
-
ఎన్డీయే నేతలు కొందరు మాతో టచ్లో ఉన్నారు: రాహుల్ కీలక వ్యాఖ్యలు