జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
అయిదేళ్ల పాలన ముగుస్తున్నా అందని ఆర్థిక సాయం
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ అంటున్న గండికోట నిర్వాసితులు
న్యూస్టుడే, కొండాపురం
జలాశయంలో నీటమునిగిన గంగాపురం (పాతచిత్రం)
‘దేవుడు దయతలిస్తే గండికోట రిజర్వాయరులో ఈ ఏడాది 20 టీఎంసీలకు తగ్గకుండా నీరు నిల్వ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నిర్వాసితులకు రూ.6.75 లక్షలు ఇస్తున్నా సరిపోలేదని చెబుతుండడంతో రూ.10 లక్షలు ఇస్తామని మాట ఇచ్చాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రతి రైతన్నకు తోడుగా ఉండేందుకు రూ.6.75 లక్షలు ఇచ్చిన ఆ గ్రామాలకు రూ.3.25 లక్షలు అదనంగా ఇవ్వబోతున్నాం’..
-ఇదీ 2019, జులై 8న సీఎం హోదాలో తొలిసారిగా జమ్మలమడుగు బహిరంగ సభలో జగన్ అన్న మాటలు.
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం తొలిసారిగా 12 టీఎంసీల నీటిని నింపింది. అంతకు ముందు, అప్పటి వరకు రూ.1.86 లక్షలున్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సొమ్మును రూ.6.75 లక్షలకు పెంచింది. ముంపునకు గురైన 14 గ్రామాల్లోని 9,096 మంది నిర్వాసితులకు రూ.479.35 కోట్లు మంజూరు చేసి పంపిణీ చేశారు. గండికోట నిర్వాసితులకు అదనంగా మరో రూ.3.25 లక్షలు ఇస్తామని గత ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఇంతవరకు అతీగతీ లేదు.
మరో 16 రోజుల్లో ఎన్నికలు: సీఎం జగన్ హామీ ఇచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోయింది. వైకాపా ప్రభుత్వం కాలపరిమితి కూడా దాటిపోతోంది. సాధారణ ఎన్నికలు కూడా మరో 16 రోజుల్లో జరగనున్నాయి. 9,096 మంది నిర్వాసితులకు రూ.3.25 లక్షల అదనపు పరిహారం కింద రూ.295.62 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పుణ్యమా..అని నిర్వాసితుల ప్రస్తావన గతేడాది మేలో తెరపైకి వచ్చింది. 2023, జులై 6వ తేదీ రూ.454.60 కోట్లకు సంబంధించిన జీవో 312ను విడుదల చేసింది. అదనపు పరిహారం చెల్లింపునకు దస్త్రాన్ని కదిలింది. గతేడాది నవంబరులో నిర్వాసితులతో సంతకాలను చేయించినా ఇంతవరకు సొమ్ములు అందలేదు.
ఇప్పటికీ అందలేదు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పూర్తవుతున్నా నిర్వాసితులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. మొదటి విడత 14 గ్రామాల్లో మా గ్రామాన్ని గుర్తించి అప్పటి ప్రభుత్వం రూ.6.75 లక్షలు పరిహారం అందించింది. వైకాపా ప్రభుత్వం అదనంగా ఇస్తామన్న రూ.3.25 లక్షల పరిహారం సొమ్ములు ఇప్పటికీ అందలేదు.
మనోహర్, కె.బొమ్మేపల్లె
ఇళ్లు, భూములు కోల్పోయాం
జలాశయం కోసం సొంతూరు, భూములు, ఇళ్లను కోల్పోయాం. సీఎం జగన్ ఇస్తామన్న అదనపు పరిహారం రూ.3.25 లక్షలు ఇవ్వలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయిదేళ్లవుతున్నా సీఎం ఇచ్చిన హామీ నెరవేరలేదు. ప్రస్తుతం పనులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నాం.
సురేష్రెడ్డి, కొర్రపాడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..