Amit Shah: అబద్ధాలతో గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నం: అమిత్షా
‘రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ.. మోదీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
భువనగిరి: ‘రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీలు.. మోదీ గ్యారంటీల మధ్య జరుగుతున్న ఎన్నికలివి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకట్లేదని ఎద్దేవా చేశారు. మోదీ ఏం చెబుతారో దానిని తప్పకుండా చేస్తారని, రాహుల్ ఇచ్చిన గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేదని అన్నారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ‘‘ రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ అమలు కాలేదు. వారికి ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం ఇవ్వలేదు. వరి, గోధుమలకు రూ.500 బోనస్ అందించలేదు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను ఎన్నటికీ నెరవేర్చదు. ఆ పార్టీ 70 ఏళ్లుగా అయోధ్య విషయాన్ని పక్కన పెట్టింది.
నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలివి. కుటుంబ అభివృద్ధి- దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్య ఎన్నికలు. మూడు విడతల్లో ఇప్పటికే 200 సీట్లకు పైగా స్థానాలు గెలుస్తాం. దేశవ్యాప్తంగా మొత్తం 400 లోక్సభ స్థానాలు సాధిస్తాం. తెలంగాణలో గత ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లు గెలిచాం. ఈసారి 10కి పైగా గెలుస్తాం. రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్కోర్తో దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుంది. అబద్ధాలతో ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ యత్నిస్తోంది.
ఆ మూడు పార్టీల మధ్య త్రికోణ బంధం
మోదీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు చెబుతున్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నష్టం వాటిల్లుతుంది. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు కశ్మీర్తో ఏం సంబంధమని ఖర్గే ప్రశ్నించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడేలా చేశాం. ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మోదీ పరిసమాప్తం చేశారు. దేశాన్ని సురక్షితంగా ఉంచారు. కాంగ్రెస్, భారాస, మజ్లిస్ మధ్య త్రికోణ బంధం ఉంది. మూడు పార్టీలు హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించవు. రద్దు చేసిన ట్రిపుల్ తలాక్ను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నారు.
భారాస హయాంలో కుటుంబమే బాగుపడింది
భువనగిరి టెక్స్టైల్ పరిశ్రమల కోసం మోదీ కృషి చేశారు. రూ.1500 కోట్లతో జాతీయ టెక్స్టైల్ విధానం అమల్లోకి తెచ్చాం. భువనగిరి నుంచి భూపాలపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించాం. బీబీ నగర్ ఎయిమ్స్ నిర్మించి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. జనగామ నుంచి భువనగిరి వరకు రైల్వే లైన్ల ఆధునికీకరణ చేపట్టాం. కొమురవెల్లిలో అత్యాధునిక రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నాం. భారాస ప్రభుత్వ హయాంలో కుటుంబం మాత్రమే బాగుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది’’ అని అమిత్షా విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు