icon icon icon
icon icon icon

Bandi Sanjay: కేసీఆర్‌ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు: బండి సంజయ్‌

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లే అని భాజపా ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు.

Published : 07 May 2024 12:57 IST

కరీంనగర్‌: కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కుటుంబ పాలనకు ఓటు వేసినట్లేనని భాజపా ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘‘కేసీఆర్‌ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారు. మోదీ తనను అరెస్టు చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. అవినీతిని భాజపా ప్రభుత్వం సహించదు. కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడింది. ఇక్కడి డబ్బుతో విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కాంగ్రెస్‌, భారాస నాణేనికి బొమ్మాబొరుసుగా ఉన్నాయి. ఆస్తులు, అక్రమ సంపాదనపై చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా? హస్తం పార్టీ ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయింది. ఆ పార్టీ ఇప్పటివరకు చేసిన అవినీతి అక్రమాలు చాలు. కాంగ్రెస్‌ మాయమాటలకు ప్రజలు మోసపోవద్దు. అక్రమ సంపాదనతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు’’ అని బండి సంజయ్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img