icon icon icon
icon icon icon

Bandi Sanjay: కేసీఆర్‌ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది కేటీఆరే: బండి సంజయ్‌

కేసీఆర్‌ కంటే ఎక్కువగా అధికారం చలాయించింది కేటీఆరే అని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 10 May 2024 12:38 IST

సిరిసిల్ల: భారాస ప్రభుత్వంలో కేసీఆర్‌ కంటే ఎక్కువగా అధికారం చెలాయించింది కేటీఆరే అని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ విమర్శించారు. సిరిసిల్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ కంటే ఎక్కువ దాదాగిరి, గూండాగిరి కేటీఆరే చేశారని.. సిరిసిల్లలో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఇక్కడి నేతన్నల దుస్థితికి వాళ్లిద్దరే కారణమన్నారు.  

‘‘భారాస హయాంలో నేతన్నలకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టారు. వారికి 50 శాతం విద్యుత్‌ రాయితీ ఇస్తామని మోసగించారు. కాంగ్రెస్‌, భారాస పరస్పర దూషణలకు దిగుతున్నాయి. ఆ రెండు పార్టీలు మోసగించినందునే ప్రజలు భాజపాకు మద్దతుగా నిలిచారు. ఆరు గ్యారంటీల పేరుతో హస్తం పార్టీ మోసం చేసింది. పలు రూపాల్లో దోపిడీకి యత్నిస్తోంది. నేతన్నల బకాయిలు చెల్లిస్తామని మోసగించింది. కాంగ్రెస్‌ మాయమాటలను ప్రజలు నమ్మవద్దు’’ అని బండి సంజయ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img