Chandrababu: సైకోను శాశ్వతంగా ఇంటికి పంపాలి: చంద్రబాబు
పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో వేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.
డోన్: పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో వేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రజల భూములను జగన్ పేరుతో రాసుకుంటున్నారని ఆరోపించారు. తన భూములను ఇతరుల పేరిట మార్చారని తీవ్ర ఆవేదనకు గురై ఓ చేనేతకారుడు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులూ చనిపోయారన్నారు. నంద్యాల జిల్లా డోన్లో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా జగన్.. ప్రజల ఆస్తులు కొట్టేసే యత్నం చేస్తున్నారని విమర్శించారు.
తెదేపాది సామాజిక న్యాయమని, జగన్ది సామాజిక ద్రోహమని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ రాయలసీమకు వైకాపా నాయకులు ఏమైనా చేశారా?ప్రాజెక్టులు కట్టారా? రోడ్లు వేశారా? పరిశ్రమలు తెచ్చారా? ఏమీ చేయని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలి? పార్టీ రంగుల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు. సైకో జగన్కు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి. ప్రభుత్వ సలహాదారులకు రూ.700 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రకటనల కోసం సాక్షి మీడియాకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చారు. ఆరోగ్యశ్రీకి రూ.1500 కోట్ల మేర బకాయిలు పెట్టి.. ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారు. ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తామని సర్వనాశనం చేశారు. జగన్ పాలనలో వ్యవసాయాన్ని పూర్తిగా చంపేశారు. రైతు మెడ నొక్కారు.. ప్రస్తుతం రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రైతు కూలీలు దీనావస్థలో ఉన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేసిన పార్టీ తెదేపా’’ అని చంద్రబాబు అన్నారు.
మహాశక్తి కింద 4 కార్యక్రమాలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘‘మహిళల నిధి కింద నెలకు రూ.1500 అందజేస్తాం. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తాం. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. డ్వాక్రా సంఘాల్లో మహిళలను లక్షాధికారులను చేస్తాం. ఒక్కో సంఘానికి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. మహిళలను ప్రతి ఇంటికి ఆర్థిక మంత్రిగా చేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. -
నన్ను కాపాడింది అతడే.. లేదంటే ప్రాణాలు పోయేవి: పులివర్తి నాని
తిరుపతిలో తనపై జరిగిన హత్యాయత్నం గురించి చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని వెల్లడించారు. -
ఓటమి ఖాయమని తెలిసే ప్లాన్ బీ అమలు చేశారు: వర్ల రామయ్య
ఎన్నికల్లో వైకాపా సృష్టించిన అరాచకాలపై కూటమి నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. -
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు ఖాయం: కిషన్రెడ్డి
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
పోలీసుల అదుపులో తెదేపా నేత బాజీచౌదరి.. కుంకలగుంటలో ఉద్రిక్తత
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని కుంకులగుంటలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంల భద్రతపై తెదేపా ఆందోళన
స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంల భద్రతపై రాష్ట్ర ఎన్నిల ప్రధానాధికారి ఎంకే మీనాకు పొన్నూరు తెదేపా అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చేశారు. -
ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం.. సీఎస్, డీజీపీకి సమన్లు
పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఏపీలో 81.86 శాతం పోలింగ్: సీఈవో ముకేశ్కుమార్ మీనా
ఏపీ ఎన్నికల్లో (AP Elections 2024) 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు హౌస్ అరెస్టు.. పల్నాడు జిల్లాలో భారీగా బలగాల మోహరింపు
పల్నాడు జిల్లాలో కలెక్టర్ 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ అనంతరం దాడుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. -
వైకాపా నేతలను ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చింది: నారా లోకేశ్
ఓటమి భయం వైకాపా నేతలను నరరూప రాక్షసులుగా మార్చేసిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. -
తాడిపత్రిలో 144 సెక్షన్.. వేర్వేరు ప్రాంతాలకు జేసీ ప్రభాకర్, పెద్దారెడ్డి తరలింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు లాఠీఛార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. -
వైకాపా నేతలకు తొత్తులుగా పోలీసులు: బీద రవిచంద్ర
ఐదేళ్లుగా వైకాపా పాలనలో అరాచకం కొనసాగిందని తెదేపా నేత బీద రవిచంద్ర యాదవ్ విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నాయకులకు అధికారులు, పోలీసులు తొత్తులయ్యారని ఆరోపించారు. -
‘రిగ్గింగ్ను అడ్డుకోవాలనే ఏజెంట్గా కూర్చున్నా’
‘మా ఊళ్లో ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్ సర్వసాధారణంగా మారింది. దీన్ని అడ్డుకోవాలనే ఏజెంట్గా ఉండాలని నిర్ణయించుకున్నా’ అని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ సోమవారం వైకాపా వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ పల్నాడు జిల్లా రెంటాలకు చెందిన చేరెడ్డి మంజుల తెలిపారు. -
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్
పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక సంఘటనలు రెండోరోజూ కొనసాగడంతో ఈసీ 144 సెక్షన్ అమలుకు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. -
150కి పైగా స్థానాల్లో కూటమిదే గెలుపు: రఘురామ
ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి భారీ మెజారిటీలతో 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని.. పోలింగ్కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే దీనికి నిదర్శనమని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
వైకాపా మూకల రక్తదాహం
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా వైకాపా రాక్షస మూకల రక్తదాహం తీరలేదు. మంగళవారం రెండో రోజూ రాష్ట్రంలో అనేక చోట్ల తీవ్ర స్థాయిలో హింసాకాండకు, విధ్వంసానికి పాల్పడ్డారు. -
నాని లక్ష్యంగా.. సమ్మెటతో వైకాపా మూకల వీరంగం
తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం ఆవరణలో వైకాపా నాయకులు మారణాయుధాలతో రెచ్చిపోయారు. ఇక్కడ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్రూమ్లను పరిశీలించేందుకు మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో వచ్చిన చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. -
తాడిపత్రిలో పెద్దారెడ్డి అరాచకం
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎన్నికల ముందు అన్నట్లుగానే విధ్వంసకాండను సృష్టించారు. మంగళవారం తాడిపత్రిని యుద్ధభూమిగా మార్చారు. -
ఎమ్మెల్యే పిన్నెల్లి విధ్వంసకాండ
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో విధ్వంసం సృష్టించారు. తన కారుపై ఎవరో రాయి వేశారనే నెపంతో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. -
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ 82.37%
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలట్తో కలిపి 82.37% మేర పోలింగ్ నమోదైనట్లు ప్రాథమిక అంచనా. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. -
యుద్ధప్రాతిపదికన కాలువల పనులు చేయాలి
రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం సాగునీటి కాలువల నిర్వహణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ