icon icon icon
icon icon icon

Congress: లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణకు కాంగ్రెస్‌ ప్రత్యేక మ్యానిఫెస్టో

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ (Congress) పార్టీ విడుదల చేయనుంది.

Published : 02 May 2024 11:49 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ (Congress) పార్టీ విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) దీన్ని ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే.. రాష్ట్రానికి ఏం చేస్తామనేదాన్ని ఆయన వెల్లడించనున్నారు. విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్‌ స్కూళ్లు తదితర అంశాలకు ఇందులో చోటు కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ ‘న్యాయ్‌ పత్ర’ పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img