నియోజకవర్గంగా వర్ధిల్లి.. డివిజన్గా మెరిసి..
రామాయంపేట.. పరిచయం అక్కర్లేని ప్రాంతం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన ఘనత దక్కించుకుంది. ఒకప్పుడు వెలుగొందిన ఈ నియోజకవర్గం ప్రస్తుతం మెదక్లో కలిసిపోయింది. ఇటీవల రామాయంపేట కేంద్రంగా డివిజన్ కేంద్రం ఏర్పడటం గమనార్హం.
రామాయంపేట, న్యూస్టుడే, రామాయంపేట
తాలూకా కార్యాలయం
రామాయంపేట.. పరిచయం అక్కర్లేని ప్రాంతం. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిన ఘనత దక్కించుకుంది. ఒకప్పుడు వెలుగొందిన ఈ నియోజకవర్గం ప్రస్తుతం మెదక్లో కలిసిపోయింది. ఇటీవల రామాయంపేట కేంద్రంగా డివిజన్ కేంద్రం ఏర్పడటం గమనార్హం.
1952లో రామాయంపేట నియోజకవర్గం ఏర్పాటైంది. ఆ తర్వాత గజ్వేల్తో కలిసి 1978 వరకు కొనసాగింది. ఇక అక్కడి నుంచి 2009 వరకు సొంత నియోజకవర్గంగా వెలుగొందింది. ఈ కాలంలో 8 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆర్.ముత్యంరెడ్డి, టి.అంజయ్య, ఆర్.ఎస్.వాసురెడ్డి, విఠల్రెడ్డి, వాసుదేవరావు, పద్మాదేవేందర్రెడ్డిలు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2008లో తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో మైనంపల్లి హనుమంతరావు విజయం అందుకున్నారు. ఏడాది పాటు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేట తన ప్రాభవాన్ని కోల్పోయింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో రామాయంపేట మండలాన్ని మెదక్ నియోజకవర్గంలో కలిపేశారు.
అంజయ్య
అనూహ్య పరిణామాలతో..
నియోజకవర్గ పరిధిలో రామాయంపేటతో పాటు చేగుంట, చిన్నశంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి మండలాలతో పాటు మెదక్ మండలంలోని 14 గ్రామపంచాయతీలు ఉండేవి. చిన్నశంకరంపేట మండలానికి చెందిన ఆర్.ముత్యంరెడ్డి 1978లో రామాయంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తన ప్రత్యర్థి ఎం.కొండల్రెడ్డిపై విజయం పొందారు. రాష్ట్రంలో అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా అంజయ్యను నియమించింది. ఆయన ఆరు నెలల్లో ప్రత్యక్షంగా ఎన్నిక కావాల్సి ఉండటంతో రామాయంపేట నుంచి పోటీ చేసేందుకు నిర్ణయించారు .అప్పటికే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ముత్యంరెడ్డి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో అంజయ్య 35,235 ఓట్లతో గెలుపొందారు. 1980 అక్టోబరు 11 నుంచి 1982 ఫిబ్రవరి 24 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం ఉన్న ప్రయాణ ప్రాంగణం ఆయనే శంకుస్థాపన చేశారు. 1981 మార్చి 22న రామాయంపేట తాలూకా కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ప్రస్తుతం డివిజన్ కేంద్రంగా
నియోజకవర్గ ప్రాభవాన్ని కోల్పోగా స్వరాష్ట్రం వచ్చాక పురపాలికగా మారింది. స్థానికులు డివిజన్ కేంద్రంగా మార్చాలని ఏడాదికి పైగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చివరకు ప్రభుత్వం ఇటీవల డివిజన్ కేంద్రంగా మార్చింది. రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, నార్సింగి మండలాలు వస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వతంత్ర భారతంలో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయని ఉక్కుమనిషి
ఉక్కు మనిషి అన్న పదం వినగానే ఆబాలగోపాలానికి గుర్తుకొచ్చే పేరు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఉప ప్రధాని హోదాలో కేంద్ర హోం, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారాయన. -
ఆస్ట్రేలియాలో పండగలా పోలింగ్
ఆస్ట్రేలియాలో నిర్బంధ ఓటింగ్ అమల్లో ఉంది. అక్కడి ప్రజలు ఓటు వేయడాన్ని శ్రమగా భావించరు. సంతోషంగా ఓటేస్తూ.. పోలింగ్ను పండగలా నిర్వహించుకుంటారు. -
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్
అర్జెంటీనాలో 112 ఏళ్లుగా నిర్బంధ ఓటింగ్ చట్టం అమలవుతోంది. తొలిసారిగా 1912లో ఇక్కడ పురుషులకు ఓటింగ్ను తప్పనిసరి చేశారు. -
టమాటా పప్పు.. కోడిగుడ్డు కూర.. పోలింగ్ సిబ్బందికి మెనూ ఇదే!
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల ఆహారం అందించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు!
తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత తాము అనుకున్న అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. -
ఆన్లైన్లో ఓటర్ స్లిప్... డౌన్లోడ్ చేసుకోండిలా!
Voter Slip Download Options: ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ కచ్చితంగా అవసరం. మీ కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఏమౌతుందిలే అనుకునేవారు చరిత్ర గతిని మార్చిన ‘ఒక్క ఓటు’ ఉదంతాలు తెలుసుకోవాల్సిందే. -
ఎంపీగా ఎన్నికైతేే జీతం ఎంతో తెలుసా?
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
లష్కర్ నుంచి ఎన్నికయ్యారు.. కేంద్రంలో మంత్రులయ్యారు
సికింద్రాబాద్ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన నలుగురు నేతలకు కేంద్ర మంత్రులుగా పనిచేసే అవకాశం దక్కడం విశేషం. 1979 ఉప ఎన్నికలు, 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన పి.శివశంకర్.. -
వారి ఓటును వారికి వేసుకోలేరు!
అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు వారి ఓటును వారికి వేసుకోలేకపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరికి ఇదే పునరావృతం కానుంది.ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉంది. దీంతో తమ పార్టీకి, కొన్నిచోట్ల ఇతర పార్టీలకు ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఓటు.. సుదీర్ఘ ప్రయాణం
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చాక పౌరులందరికీ సార్వత్రిక ఓటును వినియోగించుకునే కల సాకారమైంది. -
రూ.2తో ఓటు ఛాలెంజ్
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?
పోలింగ్ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. -
ఒక్కసారి మాత్రమే గెలిచారు..
భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఒక్క సారి మాత్రమే గెలిచారు. రెండో సారి విజయాన్ని అందుకోలేకపోయారు. -
16 శాతం ఓట్లు రాకుంటే.. డిపాజిట్ గల్లంతే
డిపాజిట్.. ఎన్నికల్లోనూ వినిపించే పదం. ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు దీనిపై చర్చ జరుగుతుంది. ఎవరు డిపాజిట్ కోల్పోయారు అంటూ మాట్లాడుకుంటారు. -
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
ఎన్నికల పోలింగ్ సమయంలో వేలికి సిరా చుక్క ఎందుకు పెడతారు? వెంటనే అది ఎందుకు చెరిగిపోదు? అసలు ఈ సిరా కథేంటో తెలుసుకుందామా? -
మరింత పారదర్శకత కోసమే వీవీప్యాట్లు
ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్)ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం 2013లో ఎన్నికల నియమావళి నిబంధనలు 1961కి సవరణ చేశారు. -
ప్రపంచంలోనే ‘కాస్ట్లీ’ ఎన్నికలు.. ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు?
2024 సార్వత్రిక ఎన్నికల ఖర్చు రూ. 1.35 లక్షల కోట్లకు చేరుకోనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
అస్సాంలో మొత్తంగా 96,987 మంది ‘డీ’ ఓటర్లు ఉన్నట్లు అంచనా. అంతకుముందు వీరి సంఖ్య లక్షకు పైగా ఉండేది. -
డిపాజిట్ రాకున్నా ఎమ్మెల్యే అయ్యారు
ఎన్నికల్లో డిపాజిట్ దక్కకపోతే మరీ చిన్నతనంగా భావిస్తారు. అటువంటిది డిపాజిట్ రాకపోయినా ఓ అభ్యర్థిని ఎమ్మెల్యే పదవి వరించిన ఉదంతం జరిగింది. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.