Rajnath Singh: పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు: రాజ్నాథ్
Rajnath Singh: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాజపా నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పీవోకే, రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మార్పుల వంటి పలు అంశాలపై స్పందించారు.
దిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను భారత్ ఎప్పటికీ వదులుకోబోదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పునరుద్ఘాటించారు. అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం భాజపాకు (BJP) లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ అనేక దుష్ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు.
జమ్మూకశ్మీర్లో పరిస్థితులు మెరుగయ్యాయి..
పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని రాజ్నాథ్ (Rajnath Singh) అన్నారు. కశ్మీర్ అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలే తమంతట తాముగా భారత్లో భాగం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. జమ్మూకశ్మీర్లో పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయని పేర్కొన్నారు. అక్కడ AFSPA (సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం) అవసరం లేదని చెప్పారు. దాన్ని ఎత్తివేసేందుకు సమయం సమీపించిందని వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉందని, అక్కడే తగిన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. త్వరలో జమ్మూకశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే, ఎప్పుడనేది మాత్రం నిర్దిష్టంగా చెప్పలేదు.
రిజర్వేషన్లను తొలగించబోం..
భాజపా (BJP) ప్రభుత్వం ఎప్పటికీ రిజర్వేషన్లను తొలగించబోదని రాజ్నాథ్ హామీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని కూడా మార్చబోదన్నారు. రాజ్యాంగ పీఠికను సైతం సవరించేది లేదని స్పష్టం చేశారు. ఓట్ల కోసం ఈ అంశాల్లో కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ 80 సార్లు రాజ్యాంగాన్ని సవరించిందని.. ఎమర్జెన్సీ సమయంలో పీఠికనూ మార్చిందని తెలిపారు. ప్రజల్లో విశ్వాసాన్ని నింపి వారి మద్దతు పొందాలని.. భయం ద్వారా కాదని హితవు పలికారు. భాజపా మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
రాహుల్పై పాక్ ప్రశంస ఆందోళనకరం..
ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం రాహుల్ గాంధీకి లేదని రాజ్నాథ్ (Rajnath Singh) విమర్శించారు. దీంతో హిందూ-ముస్లింల మధ్య విభజనకు కాంగ్రెస్ యత్నిస్తోందని ఆరోపించారు. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోందన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం-ఒకే ఎన్నికల వంటి విధానాలను అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ చెబుతోన్న సంపద పంపిణీ వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలిపారు. అర్జెంటీనా, వెనిజువెలాలో ఆ దిశగా చేసిన ప్రయోగం బెడిసికొట్టిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ప్రశంసించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని రాజ్నాథ్ అన్నారు. భారత ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాక్ యత్నిస్తోందని.. కానీ, దానికి అంత సామర్థ్యం లేదని కొట్టిపారేశారు.
400 సీట్లు పక్కా..
ఈసారి ఎన్డీయే కూటమి కచ్చితంగా 400 సీట్లు గెలుచుకుంటుందని రాజ్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. భాజపా (BJP) సొంతంగా 370 స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఈ అంచనాకు వచ్చామని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, ఝార్ఖండ్లో తమ సీట్లు గణనీయంగా పెరుగుతాయన్నారు. తమిళనాడులోనూ కొన్ని స్థానాలు గెలుస్తామన్నారు. ఛత్తీస్గఢ్లో పూర్తిగా భాజపా ఆధిపత్యం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో సీట్లు తగ్గొచ్చా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. కొన్ని చోట్ల సర్దుబాట్లు తప్పవని వ్యాఖ్యానించడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
-
నా కుమారున్ని మీకు అప్పగిస్తున్నాను: సోనియాగాంధీ
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్