icon icon icon
icon icon icon

Revanth Reddy: పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు’: సీఎం రేవంత్‌ ఎద్దేవా

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాం.. వాళ్లు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Published : 01 May 2024 12:06 IST

హైదరాబాద్‌: పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాం.. వాళ్లు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని సీఎం విమర్శించారు.

‘‘తెలంగాణ అడిగింది బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ.. భాజపా ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అడిగింది రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ.. భాజపా ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అడిగింది కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం.. భాజపా ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అడిగింది మేడారం జాతరకు జాతీయ హోదా.. భాజపా ఇచ్చింది ‘గాడిద గుడ్డు’. తెలంగాణ అభివృద్ధికి భాజపానే అడ్డు.. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు’ ’’ అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img